AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీనివాస్ గౌడ్ ‘ఆఫిడవిట్ కేసు’లో పోలీసులపై కోర్టు ఆగ్రహం.. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలంటే లెక్క లేదా అంటూ..

Telangana: కోర్టు ఆదేశాలను ఇచ్చి 10 రోజులు దాటినా మహబూబ్‌నగర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ చేయకపోవడంతో మరోసారి కోర్టును ఆశ్రయించారు పిటిషనర్‌ రాఘవేంద్ర రాజు. దీంతో కోర్టు మరోసారి శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్ కేసులో జోక్యం చేసుకుంది. ఈ మేరకు కోర్టు ఇచ్చిన ఆదేశాలంటే లెక్క లేదా అంటూ మహబూబ్‌నగర్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం 4 గంటల్లోగా కేసు నమోదు చేయాలని పోలీసులను..

శ్రీనివాస్ గౌడ్ ‘ఆఫిడవిట్ కేసు’లో పోలీసులపై కోర్టు ఆగ్రహం.. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలంటే లెక్క లేదా అంటూ..
Minister Srinivas Goud
శివలీల గోపి తుల్వా
|

Updated on: Aug 11, 2023 | 5:32 PM

Share

తెలంగాణ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్‌ గౌడ్‌ను ఎన్నికల అఫిడవిట్‌ కేసు వెంటాడుతోంది. అఫిడవిట్‌ను ట్యాంపర్‌ చేశారన్న ఆరోపణలతో పది రోజుల క్రితం సంచలన ఆదేశాను ఇచ్చింది నాంపల్లి కోర్టు. తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు తదితర శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వరిస్తున్న విరసనోళ్ల  శ్రీనివాస్‌ గౌడ్‌తో పాటు మరో 10 మందిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఉత్తర్వులను జారీ చేసింది కోర్టు. కోర్టు ఆదేశాలను ఇచ్చి 10 రోజులు దాటినా మహబూబ్‌నగర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ చేయకపోవడంతో మరోసారి కోర్టును ఆశ్రయించారు పిటిషనర్‌ రాఘవేంద్ర రాజు. దీంతో కోర్టు మరోసారి శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్ కేసులో జోక్యం చేసుకుంది. ఈ మేరకు కోర్టు ఇచ్చిన ఆదేశాలంటే లెక్క లేదా అంటూ మహబూబ్‌నగర్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం 4 గంటల్లోగా కేసు నమోదు చేయాలని పోలీసులను మరోసారి ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాక.. నివేదిక ఇవ్వాలని కోరింది నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు.

మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నికల అఫిడవిట్‌ను ట్యాంపర్‌ చేశారంటూ కోర్టును ఆశ్రయించాడు మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్ర రాజు. ఈ మేరకు మంత్రితో పాటు బాధ్యులైన రిటర్నింగ్‌ అధికారులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని కోరారు. అయితే రాఘవేంద్ర రాజు పిటిషన్‌ను కొట్టేయాలంటూ హైకోర్టుకు వెళ్లారు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌. కానీ ఆయనకు హైకోర్టులో చుక్కెదురైంది. రాఘవేంద్ర రాజు పిటీషన్‌పై శ్రీనివాస్‌ గౌడ్‌ అభ్యంతరాలను హైకోర్టు తోసి పుచ్చింది. అదే సమయంలో నాంపల్లి కోర్టు ఏకంగా క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చి సంచలనం సృష్టించింది. ఈ ఆదేశాలు ఇచ్చి రోజులు గడుస్తున్నా.. మహబూబ్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో మరోసారి ఆదేశాలిచ్చింది న్యాయస్థానం.

కాగా, 2018 ఎన్నికల సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ నామినేషన్‌తో పాటు సమర్పించిన అఫిడవిట్‌ స్థానంలో మరో అఫిడవిట్ అప్లోడ్ చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయంలో రాఘవేంద్ర రాజు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో నాంపల్లి కోర్టుతో పాటు ఎన్నికల సంఘం కూడా విచారణ జరుపుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్