Women’s Reservation Bill: కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: ఎమ్మెల్సీ కవిత
బిల్లు ఆమోదంపై ఎమ్మెల్సీ కవిత మీడియా నిర్వహించారు. కేంద్ర కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. దేశ అభివృద్ధిలో మహిళలకు కీలక పాత్ర పోషించే అవాకశం వచ్చిందని అన్నారు. పాలసీ మేకింగ్లో మహిళలకు సముచిత స్థానం ఉండాలని ఆమె కోరారు. బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం కదిలి వచ్చిందని అన్నారు..

కేంద్ర సర్కార్ మహిళా రిజర్వేషన్ బిల్లుపై కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోడీ మంత్రివర్గం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. బిల్లు ఆమోదంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కేంద్ర కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆమె అన్నారు.
దేశ అభివృద్ధిలో మహిళలకు కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చిందని అన్నారు. పాలసీ మేకింగ్లో మహిళలకు సముచిత స్థానం ఉండాలని ఆమె కోరారు. బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం కదిలి వచ్చిందని కవిత తెలిపారు.
బిల్లు తెస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ప్రవేశపెడితే మద్దతిస్తామన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని, చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యంతో ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని కవిత అన్నారు. కేబినెట్ నిర్ణయాలు అధికారికంగా చెబితే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. పార్లమెంట్లో ఎప్పుడు బిల్లు పెట్టినా.. ఏదో ఒక పార్టీ అడ్డుకునేదని అన్నారు. దేశ అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చిందన్నారు. బిల్లులో ఏ అంశాలు ఉన్నాయో స్పష్టత ఇవ్వాలన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి