AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Jagga Reddy: బీజేపీ ప్రభుత్వంలో సామాన్యుల జీవనం అస్థవ్యస్థం అవుతోంది.. కేంద్రంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్..

MLA Jagga Reddy: అడ్డూ అదుపు లేకుండా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో..

MLA Jagga Reddy: బీజేపీ ప్రభుత్వంలో సామాన్యుల జీవనం అస్థవ్యస్థం అవుతోంది.. కేంద్రంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్..
Jaggareddy
Shiva Prajapati
|

Updated on: Jul 12, 2021 | 6:41 PM

Share

MLA Jagga Reddy: అడ్డూ అదుపు లేకుండా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందని నిప్పులు చెరిగారు. కేంద్రం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ సోమవారం నాడు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఎద్దుల బండి లాగి నిరసన తెలిపారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఈ నిరసన కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన జగ్గారెడ్డి.. కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత.. సామాన్య ప్రజలు జీవనం సాగించలేని పరిస్థితి నెలకొందన్నారు. పెట్రోల్, డీజిల్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి పన్నులు పెంచుతూ పేద ప్రజలపై మోయలేని అదనపు భారాలు వేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో లీటర్ 60 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర ఇప్పుడు ఏకంగా 104 రూపాయలకు చేరిందని పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా, అత్యంత హేయంగా మోడీ సర్కారు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతోందని దుమ్మెత్తిపోశారు. ఇంత దారుణంగా గతంలో ఏనాడూ పెరగలేదన్నారు.

పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ప్రభావం.. ఇతరర నిత్యావసర వస్తువుల ధరలపై పడుతోందని, ఫలితంగా వాటి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఎన్డీయే పాలనలో దేశ ప్రజలు ఏనాడూ లేనంత ఆర్థిక భారాన్ని మోస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. మోడీ సర్కారు కు కనీసం మానవత్వం లేదని విమర్శించారు. రెండు రోజులకోసారి రేట్లు పెంచి ప్రజల నడ్డీ విరుస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే.. భవిష్యత్ లో మరిన్ని ఉద్యమాలు చేస్తామన్నారు. కాంగ్రెస్ హాయాంలో ముడి చమురు ధరలు భారీగా పెరిగినా.. ప్రజలపై భారం మోపకుండా చమురు ధరలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూశారని చెప్పుకొచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో చమురు ధరలు నెలకు ఒక్కసారి పైసల్లో పెరిగితే.. ఇప్పుడు రూపాయల్లో పెంచుతున్నారని అన్నారు. మోడీ సర్కారు ఇప్పటికైనా కదలకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. కాంగ్రెస్ వస్తేనే ప్రజలపై భారాలు తగ్గుతాయని జగ్గారెడ్డి ఉద్ఘాటించారు.

Also read:

Skylab Movie: ప్రపంచం నాశనం అవుతుందన్నారు.. కానీ వారి జీవితాల్లో ఏం జరిగింది.. ఆసక్తికరంగా ‘స్కైలాబ్’ ఫస్ట్‏లుక్ పోస్టర్..

Megha Gas station: గ్యాస్ పంపిణీలో మేఘా సంస్థ మరో మైలు రాయి.. వరంగల్‌లో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సిటీ గేట్‌ స్టేషన్‌

Viral Video: అందమైన ఆ ‘రోటీ అమ్మాయి’.. ఎవరో తెలిసిపోయింది.. పూర్తి వివరాలు మీకోసం…

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...