Telangana: కాంగ్రెస్‌కు మరో షాక్.. బీజేపీలోకి మర్రి శశిధర్ రెడ్డి..! కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ..

మరో కాంగ్రెస్‌ నేత పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారు. కమలం పార్టీకి జైకొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే సీనియర్‌ పొలిటీషియన్ మర్రి శశిధర్‌ రెడ్డి అమిత్‌షాతో భేటీ.. పార్టీ మార్పుపై క్లియర్‌ సిగ్నల్స్‌ పంపుతోంది.

Telangana: కాంగ్రెస్‌కు మరో షాక్.. బీజేపీలోకి మర్రి శశిధర్ రెడ్డి..! కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ..
Marri Shashidhar Reddy
Follow us

|

Updated on: Nov 19, 2022 | 6:55 AM

తెలంగాణ కాంగ్రెస్‍కు మరో షాకింగ్ న్యూస్. మరో సీనియర్‌ నేత హస్తాన్ని వదిలి కాషాయ గూటికి చేరడానికి రెడీ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డికి రూట్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ వివిధ బీజేపీ అధిష్టాన నేతలతో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో.. బీజేపీ కండువా కప్పుకుంటున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. కాని వాటిని తీవ్రంగా ఖండించారు. కట్ చేస్తే.. గత రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు మర్రి. దీంతో.. ఆ ఆరోపణలకు మరింత బలం చేకూరింది. డీకే అరుణతో కలిసి వెళ్లిన మర్రి శశిధర్ రెడ్డి.. అమిత్ షాతో భేటీ కావటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక బీజేపీ కండువా కప్పుకోవటమే తరువాయి అని సన్నిహిత వర్గాలంటున్నారు. నేడో రేపో ఆయన మీడియా ముందుకు వచ్చి.. అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలున్నాయి.

రెండు రోజుల క్రితం మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే.. ఆయన పార్టీ మారుతున్నారంటూ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. బీజేపీ నేతలతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారని.. అదే రోజు సాయంత్రం ఆయన జేపీ నడ్డా సమక్షంలో కషాయ కండువా కప్పుకోనున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ.. ఈ వార్తలను ఖండించిన మర్రిశశిధర్ రెడ్డి.. ఢిల్లీ పర్యటనపై క్లారిటీ ఇచ్చారు. తనకు ఢిల్లీకి వెళ్లటం కొత్తమే కాదని.. ఈసారి మాత్రం తన మనవడి స్కూల్ ఫంక్షన్ కోసం ఢిల్లీకి వచ్చానని స్పష్టం చేశారు. అయితే.. ఆయన క్లారిటీ ఇచ్చిన రెండు రోజుల్లోనే మళ్లీ అమిత్ షాతో భేటీ అవ్వటం తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

గతంలో కాంగ్రెస్‌లో ఉన్న డీకే అరుణ.. బండి సంజయ్ మర్రి శశిధర్ రెడ్డిని  అమిత్‌షా దగ్గరకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికకు సంబంధించి ఇరు నేతలు చర్చించారు. హైదరాబాద్ వెళ్లి కార్యాకర్తలతో మాట్లాడి.. మర్రి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. జేపీ నడ్డా సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నట్టు సమాచారం. అమిత్ షా భేటీ సందర్భంగా బీజేపీ నేతలు ఎంపీ అరవింద్ నివాసంపై దాడి గురించి చెప్పారు. దీంతో అమిత్ షా.. వెంటనే ఫోన్లో అరవింద్‌తో మాట్లాడారు.

ఇవి కూడా చదవండి

ఇక కొన్ని నెలల క్రితం మునుగోడు మాజీ ఎమ్యెల్యే రాజగోపాల్‌ రెడ్డి పార్టీ మారటం.. తర్వాత ఉప ఎన్నికలు రావడం జరిగాయి. అయితే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, శ్రవణ్‌, మర్రి శశిధర్‌, ఇలా వరుసగా కీలక నేతలు పార్టీలు మారుతుండడం.. కలవరపెడుతోంది. ఓవైపు జోడోతో జోష్‌లో ఉన్నామనుకుంటున్నా సమయంలో.. ఈ చేరికలు కేడర్‌ను అయోమయంలో పడేస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!