Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అయ్యో.. చెట్టుకు వేలాడుతూ కనిపించిన ప్రేమికులు..

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పురుగుల మందు తాగి.. ఆపై చెట్టుకు ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నారు.

Telangana: అయ్యో.. చెట్టుకు వేలాడుతూ కనిపించిన ప్రేమికులు..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 27, 2023 | 10:02 AM

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పురుగుల మందు తాగి.. ఆపై చెట్టుకు ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నారు ప్రేమ జంట. ఈ ఘటన నేరెడుగొమ్ము మండలం కాచరజుపల్లి దగ్గర జరిగింది. బైక్ పై వచ్చిన లవర్స్ కాచరపల్లి దగ్గర ఆత్మహత్య చేసుకున్నారు.

చెట్టుకు వేలాడుతూ ప్రేమికుల మృతదేహాలు కనిపించడంతో.. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ద్విచక్ర వాహనం, పురుగుల మందు డబ్బా, సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రేమ జంట సూసైడ్ పై ఆరా తీస్తున్నారు.

మృతులను రాకేష్, దేవిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారా..? లేక, ఎవరైనా కొట్టి చంపారా అనే విషయంపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే, ఇరువురి కుటుంబాలకు సమాచారం ఇచ్చామని.. వారిని విచారించిన అనంతరం అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..