AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ తీసేస్తాం.. జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు

ధరణి పోర్టల్‌ను ఉపయోగించి తెలంగాణ ప్రభుత్వం రైతుల భూములను లాక్కొంటోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురిచేసేందుకే అధికార పార్టీ ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారని ఆరోపించారు.

Telangana: బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ తీసేస్తాం.. జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు
Jp Nadda
Aravind B
|

Updated on: Jun 26, 2023 | 4:32 AM

Share

ధరణి పోర్టల్‌ను ఉపయోగించి తెలంగాణ ప్రభుత్వం రైతుల భూములను లాక్కొంటోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురిచేసేందుకే అధికార పార్టీ ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారని ఆరోపించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఆదివారం ఏర్పాటుచేసిన నవ సంకల్ప బహింరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే వెంటనే ధరణి పోర్టల్‌తో పాటు బీఆర్‌ఎస్ పోర్టల్ కూడా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పీఎం ఆవాస్ యోజన పథకం కింద మంజూరు చేసే ఇళ్లలో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు.

ఉద్యమం చేసి పోరాటి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని.. కేసీఆర్ సర్కార్ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతున్నాయని.. వారి ప్రయాస అంతా ఫోటోలకే పరిమితమవుతుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు సమాజ్ వాదీ పార్టీ, టీఎంసీ, ఆర్జేడీ, ఠాక్రే లాంటి పార్టీలు తమ కుటుంబాలను కాపాడుకునేందుకే ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రధాని ముందుచూపుతోనే దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశారన్నారు. గతంలో దేశంలో 28 శాతం పెదరికం ఉండగా.. ఇప్పుడు 10 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం