AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar: మెచి నదిపై కుప్పకూలిన మరో బ్రిడ్జి.. వారాల వ్యవధిలో రెండోసారి

బిహార్‌లో మరో భారీ బ్రిడ్జి కుప్పకూలింది. జూన్‌ 4న ఖగారియా జిల్లాలో గంగానదిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. వారాల వ్యవధిలోనే బీహార్‌ రాజధాని పట్నాకు..

Bihar: మెచి నదిపై కుప్పకూలిన మరో బ్రిడ్జి.. వారాల వ్యవధిలో రెండోసారి
Under Construction Bridge Collapsed
Srilakshmi C
|

Updated on: Jun 25, 2023 | 12:48 PM

Share

పట్నా: బిహార్‌లో మరో భారీ బ్రిడ్జి కుప్పకూలింది. జూన్‌ 4న ఖగారియా జిల్లాలో గంగానదిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. వారాల వ్యవధిలోనే బీహార్‌ రాజధాని పట్నాకు 400 కిలోమీటర్ల దూరంలోని కిషన్‌గంజ్‌ జిల్లాలో మెచి నదిపై నిర్మిస్తోన్న మరో బ్రిడ్జిలోని కొంత భాగం శనివారం (జూన్‌ 24) ధ్వంసమైంది. కిషన్‌గంజ్‌, కతిహార్‌ ప్రాంతాల మధ్య నిర్మాణంలో ఉన్న ఈ వంతెన కుప్పకూలడం ప్రస్తుతం వివాదాశంగా మారింది.

కేంద్ర ప్రభుత్వ భారతమాల ప్రాజెక్టులో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఆరు పిల్లర్ల వంతెనను నిర్మిస్తోంది. దాదాపు రూ.1,080 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. దీని నిర్మాణ పనులు గతేడాది ప్రారంభమయ్యాయి. వంతెన నిర్మాణం పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభించాల్సి ఉంది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఎన్‌హెచ్‌ఏఐకి చెందిన అత్యున్నత స్థాయి నిపుణుల బృందం ఆదివారం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతుందని వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి

డిప్యూటీ సీఎం తేజస్వీ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ఈ వంతెనను ఎన్‌హెచ్‌ఏఐ నిర్మిస్తోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని’ ఆయన తెలిపారు. సుల్తంగంజ్-అగువానీ ఘాట్ వంతెన కూలిపోవడంతో రాష్ట్రంలోని బీజేపీ, మహాకూటమి పార్టీల మధ్య పొలిటికల్‌ వార్‌ ప్రారంభమైంది. బీహార్‌ వరుసగా నిర్మాణంలో ఉన్న వంతెనలు కూలడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిగతా బ్రిడ్జిలైనా పటిష్టంగా ఉన్నాయా.. లేదా అవి కూడా ఏ క్షణానైనా కూలిపోయే స్థితిలో ఉన్నాయా అంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు చేపడుతున్నామని చెబుతూ నాసిరకం వంతెనలు నిర్మించి.. ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారంటూ మండిపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!