AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. ఎంఎంటీఎస్ ఫేజ్ – 2 కు వేగంగా అడుగులు..

హైదరాబాద్ మహా నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న జనాభాకు తగ్గట్టుగా ప్రజా రవాణాను అందించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే సిటీ బస్సులు, మెట్రోలు, లోకల్ రైళ్లు సేవలు అందిస్తుండగా.. ఎంఎంటీఎస్ అయిన..

Telangana: భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. ఎంఎంటీఎస్ ఫేజ్ - 2 కు వేగంగా అడుగులు..
Hyderabad MMTS
Ganesh Mudavath
|

Updated on: Nov 27, 2022 | 6:39 AM

Share

హైదరాబాద్ మహా నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న జనాభాకు తగ్గట్టుగా ప్రజా రవాణాను అందించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే సిటీ బస్సులు, మెట్రోలు, లోకల్ రైళ్లు సేవలు అందిస్తుండగా.. ఎంఎంటీఎస్ అయిన లోకల్ రైళ్లకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో ఎంఎంటీఎస్ రెండో దశ పనులు చేపట్టేందుకు తెలంగాణ సర్కార్ ముందడుగులు వేస్తోంది. ఫేజ్‌-2 పనులు ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఈ క్రమంలో రూ.200 కోట్లు నిధులను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి ప్రాజెక్టు. దీనికి రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రెండో దశ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.816 కోట్లు కేటాయించింది. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.179 కోట్లు విడుదల చేయగా, ఇప్పుడు రూ.200 కోట్లు విడుదల చేసేందుకు ఆదేశించింది. మౌలాలి – ఘట్‌కేసర్‌ మధ్య ఉన్న 12.20 కిలోమీటర్ల దూరంలో విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. ఫలక్‌నుమా – ఉందానగర్‌ సెక్షన్ లోని 13.5 + 6.5 కిలోమీటర్లు (రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు) డబ్లింగ్‌, ఎలక్ట్రిఫికేషన్‌ పనులు కంప్లీట్ అయ్యాయి.

సికింద్రాబాద్‌-బొల్లారం మధ్య 14 కిలోమీటర్లకు సంబంధించి డబ్లింగ్‌తో పాటు విద్యుదీకరణ పనులు కొంత పూర్తి చేశారు. బొల్లారం – మేడ్చల్‌ స్టేషన్ల మధ్య 14 కిలోమీటర్ల వరకు డబ్లింగ్‌తో పాటు విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. సనత్‌నగర్‌ – మౌలాలి స్టేషన్ల మధ్య 22.10 కిలోమీటర్ల మేరకు డబ్లింగ్‌తో పాటు విద్యుదీకరణ పనులు పూర్తి కావాల్సి ఉంది. మౌలాలి – మల్కాజిగిరి – సీతాఫల్‌ మండి స్టేషన్ల మధ్య 10 కిలోమీటర్ల దూరంలో డబ్లింగ్‌తో పాటు విద్యుదీకరణ పనులు పూర్తి కావాల్సి ఉంది.

తెల్లాపూర్‌ -రామచంద్రాపురం స్టేషన్ల మధ్య 5.75 కిలోమీటర్లు మార్గం డబ్లింగ్‌, విద్యుదీకరణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఎంఎంటీఎస్‌ లోకల్‌ రైలు రెండో దశ లో భాగంగా కొత్త రైల్వే స్టేషన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మౌలాలి – సనత్‌నగర్‌ మార్గంలో ఫిరోజ్‌గూడ, సుచిత్ర సెంటర్‌, భువ్‌దేవ్‌ నగర్‌, నేరేడ్‌మెంట్‌తో పాటు మౌలాలి హెచ్‌డీ కాలనీ స్టేషన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్