AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana cabinet: ఇవాళ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ మీటింగ్.. పలు కీలక అంశాలపై చర్చ..

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఇవాళ తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో వరి, బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలుపై చర్చించనున్నారు.

Telangana cabinet: ఇవాళ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ మీటింగ్.. పలు కీలక అంశాలపై చర్చ..
Cm Kcr
Sanjay Kasula
|

Updated on: Sep 16, 2021 | 9:34 AM

Share

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఇవాళ తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో వరి, బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలుపై చర్చించనున్నారు. రైతులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దళితబంధు అమలు విషయంలో కొత్తగా 4 మండలాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద నిధుల మంజూరుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది కేబినెట్‌ . దాంతోపాటు నీటి పంపకాలు, అంతర్రాష్ట్ర జలవివాదాలపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, దళిత బంధు, వరి సాగు పై జరుగబోతోన్న క్యాబినెట్ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ప్రగతిభవన్‌‌లో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది. ఈ సందర్భంగా శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాల తేదీల ఖరారుతో పాటు దళితబంధు, వరికి ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం తదితర అంశాలపై చర్చించనున్నారు. గత మార్చి 25న శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి. మళ్లీ ఆరు నెలల్లోపు అంటే ఈ నెల 25వ తేదీలోగా ఉభయసభల సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. ఆ లోగా సమావేశాలను ప్రారంభించేలా ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనోత్సవం ఈ నెల 19తో ముగియనుంది. ఆ తర్వాత 1-2 రోజుల విరామం అనంతరం సమావేశాలను ప్రారంభించాలనే అంశంపై ఇప్పటికే చర్చ నడుస్తోంది. సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లుల అంశాన్ని కూడా ఖరారు చేస్తారు. దళితబంధు పథకంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వాసాలమర్రిలో ప్రారంభించిన ఈ పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఆ తర్వాత మధిర, తుంగతుర్తి, అచ్చంపేట-కల్వకుర్తి, జుక్కల్‌ నియోజకవర్గాల్లోని చింతకాని, తిరుమలగిరి, చారగొండ, నిజాంసాగర్‌ మండలాల్లో ప్రయోగాత్మకం (పైలట్‌ ప్రాజెక్టు)గా అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలు, నిధుల మంజూరుకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది.

ఇవికూడా చదవండి: Saidabad rape and murder: కీచకుడి మారువేశాలు.. ఇలా మనకు సమీపంలో ఉంటే గుర్తు పట్టండి.. జస్ట్ కాల్ చేయండి అంతే..

Gujarat New Cabinet: మంత్రివర్గ కొత్త కూర్పుపై ప్రధాని మోడీ, అమిత్‌షా మార్క్‌.. 27 మందితో గుజరాత్‌లో కొత్త కేబినెట్‌..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు