AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: తెలంగాణలో టీడీపీ కమిటీలన్నీ రద్దు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..

తెలంగాణ టీడీపీకి కొత్త జవసత్వాలు అందిస్తామన్నారు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న కమిటీలను రద్దు చేశారు. త్వరలోనే కొత్త కమిటీలు వేస్తామన్నారు.

Chandrababu: తెలంగాణలో టీడీపీ కమిటీలన్నీ రద్దు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..
Chandrababu
Shaik Madar Saheb
|

Updated on: Aug 25, 2024 | 8:26 PM

Share

తెలంగాణలో పార్టీ పటిష్టత, బలోపేతంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. పార్టీ బలోపేతానికి ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఉన్న అడ్‌హక్‌ కమిటీలు రద్దు చేస్తున్నామని తెలిపారు. ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. రానున్న రోజుల్లో పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని చంద్రబాబు సూచించారు. తెలంగాణలో పార్టీకి కొత్త జవసత్వాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పార్టీలో యువ రక్తాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. పార్టీలో యువకులకు ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. టీటీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు ఆదివారం సమావేశం అయ్యారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో జరిగిన భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.

తెలుగుదేశం తెలుగు ప్రజలందరి కోసం పని చేస్తుందని చంద్రబాబు తెలిపారు. పార్టీని, తనను గత 45 ఏళ్లుగా ప్రజలు ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. అందుకు తగినట్లే పార్టీ నిరంతరం ప్రజలకు సేవ చేస్తోందని చెప్పారు. తనపై ఇప్పుడు రెండు బాధ్యతలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఏపీలో ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా తనపైనే ఉందని గుర్తు చేశారు.

ఇకపై తెలంగాణకు ప్రతి 15 రోజులకొకసారి వస్తానని చంద్రబాబు కార్యకర్తలకు చెప్పారు. అందరి కలిసి అభిప్రాయాలు తీసుకుంటానని.. అందరి నిర్ణయాల మేరకే పార్టీలో నిర్ణయాలుంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..