మెల్లగా తెలుగు సినిమాలు తగ్గించేసిన మలయాళ ముద్దుగుమ్మ మడోన్నా 

22 December 2025

Pic credit - Instagram

Rajeev 

అందాల భామ మడోన్నా సెబాస్టియన్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. 

నాగ చైతన్య నటించిన ప్రేమమ్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ అందాల ముద్దుగుమ్మ. 

ఈ అమ్మడు మొదట మలయాళంలో విడుదలైన ఒక మ్యూజిక్ షోలో యాంకర్‌గా పని చేసింది. ఈ షో ద్వారా ఫేమస్ అయ్యింది. 

మలయాళంలో అల్ఫోన్స్ దర్శకత్వంలో నివిన్ పౌలీ, సాయి పల్లవి, మడోనా, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన "ప్రేమమ్" లో మెరిసింది. 

ఆతర్వాత తెలుగులో నటించింది. మలయాళంలోనే కాకుండా తమిళం, తెలుగు భాషల్లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తమిళ్ లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సరసన నటించే అవకాశం అందుకుంది. వాలంతుమ్ పార్థియం మూవీలో నటించింది. 

శ్యామ్ సింగరాయ్ లో కనిపించింది. ఆ తర్వాత తెలుగులో సినిమా చేయలేదు మడోన్నా. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు.