Hyderabad: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. నేడు 34 MMTS రైళ్ల రద్దు.. పూర్తి వివరాలు..
Hyderabad: హైదరాబాద్లో పలు ప్రాంతాలను కలుపుతూ నడిచే MMTS రైళ్లను ప్రయాణికులు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటారు. తక్కువ సమయం, తక్కువ ధరలో గమ్య స్థానాలకు చేరుకుంటారు. ముఖ్యంగా...
Hyderabad: హైదరాబాద్లో పలు ప్రాంతాలను కలుపుతూ నడిచే MMTS రైళ్లను ప్రయాణికులు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటారు. తక్కువ సమయం, తక్కువ ధరలో గమ్య స్థానాలకు చేరుకుంటారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు ఈ సేవలను వినియోగించుకుంటారు. అలాగే వారాంతాల్లో కుటుంబాలతో కాలక్షేపం కోసం వెళ్లే వారు కూడ ఈ సేవలను ఉపయోగించుకుంటారు. అయితే ఈరోజు (మే 29) దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మొత్తం 34 MMTS రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి, ప్రత్యామ్నాయం సర్వీసులను ఎంచుకోవాలని సూచించారు.
రద్దైన రైళ్లు ఇవే..
* లింగంపల్లి-హైదరాబాద్ మధ్య నడిచే 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47138, 47139, 47140 నెంబర్ల రైళ్లు రద్దయ్యాయి.
* హైదరాబాద్ – లింగంపల్లి మధ్య 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120 సర్వీసులను రద్దు చేశారు.
* ఫలక్నూమా – లింగంపల్లి మధ్య 47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170 నెంబర్ల రైళ్లు నేడు అందుబాటులో ఉండవు.
* లింగంపల్లి – ఫలక్నూమా మధ్య 47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192 రైళ్లను రద్దు చేశారు.
* కింద్రాబాద్ – లింగంపల్లి మధ్య 47150 సర్వీసు నేడు అందుబాటులో ఉండదు.
* లింగంపల్లి – సికింద్రాబాద్ మధ్య 47195 సర్వీసును రద్దు చేశారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..