AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఉమ్మి వేసేందుకు రన్నింగ్​లో ఉన్న కారు డోర్​ తీసిన ఓనర్.. క్షణకాలంలో

కారు రన్నింగ్​లో ఉండగా.. ఉమ్మి వేసేందుకు యజమాని ఎల్లయ్య అకస్మాత్తుగా కారు డోర్​ తీశాడు. దీంతో ఊహించని విషాదం చోటుచేసుకుంది.

Hyderabad: ఉమ్మి వేసేందుకు రన్నింగ్​లో ఉన్న కారు డోర్​ తీసిన ఓనర్.. క్షణకాలంలో
Road Accident
Ram Naramaneni
|

Updated on: May 28, 2022 | 7:30 PM

Share

Road Accident: రోడ్డుపై మనం సక్రమంగానే వెళ్తూ ఉండవచ్చు.. కానీ ఎదురుగా వచ్చేవాళ్లు.. పక్కనుంచి వెళ్లేవారు ఎలా ప్రయాణిస్తున్నారో మనం చెప్పలేం. మన తప్పు లేకపోయినా విధి ఆడే వింత నాటకంలో బలి కావొచ్చు. వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే రెప్పపాటులో చేసే చిన్న మిస్టేక్.. మన ప్రాణాలకో.. ఎదుటి వారి ప్రాణాలకో ముప్పు తెస్తుంది. తాజాగా ఓ కారు నడుపుతున్న వ్యక్తి చేసిన తప్పిదం.. ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. రంగారెడ్డి జిల్లా( rangareddy district) నార్సింగి( narsingi) అప్పా జంక్షన్​ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు రన్నింగ్​లో ఉండగానే.. ఉమ్మి వేసేందుకు ఓనర్ ఎల్లయ్య అకస్మాత్తుగా కారు డోర్​ తీశాడు. ఇది గమనించని బైక్‌పై పక్కనే వస్తున్న వ్యక్తి ఒక్కసారిగా కారు డోర్​కు తగిలి గాల్లోకి ఎగిరి అవతలి వైపు రోడ్డుపై పడ్డాడు. అదే క్రమంలో అటుగా వస్తున్న భారీ వాహనం.. అతనిపై నుంచి దూసుకెళ్లడంతో బాధితుడు స్పాట్‌లోనే మృతి చెందాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుడు ఏపీకి చెందిన మేస్త్రిగా గుర్తించారు. నిర్లక్ష్యంగా కారు నడిపిపన ఎల్లయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి