AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిగాచిలో పేలుడుకు కారణమేంటి..? NDMA అధ్యయనం.. ఇంకా లభించని 8 మంది ఆచూకీ..

సిగాచి పేలుడు ఘటనపై ఓ వైపు రెస్క్యూ ఆపరేషన్... మరో వైపు NDMA ఎంక్వైరీ కొనసాగుతోంది. భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ విషాదంలో మరణించిన వారి సంఖ్య 44కు చేరింది. రోజులు గడుస్తున్నా 8మంది ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనలు ఎక్కువయ్యాయి.

సిగాచిలో పేలుడుకు కారణమేంటి..? NDMA అధ్యయనం.. ఇంకా లభించని 8 మంది ఆచూకీ..
Sigachi Factory Blast
Shaik Madar Saheb
|

Updated on: Jul 08, 2025 | 8:44 PM

Share

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమను నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బృందం పరిశీలించింది. సుమారు నాలుగు గంటల పాటు NDMA అధికారులు పరిశ్రమలో విచారణ జరిపారు.పేలుడులో కూలిన భవనం, దెబ్బతిన్న పరికరాలు పరిశీలించారు. సేఫ్టీకి సంబంధించి ఫ్యాక్టరీలో పాటిస్తున్న ప్రమాణాల గురించి కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే సమావేశం నిర్వహించి నిర్వహణ లోపాలపై సిగాచీ యాజమాన్యంపై ఎన్‌డీఎంఏ ప్రశ్నలు సంధించింది. ఈ అధ్యయనంలో గుర్తించిన అంశాలపై నివేదిక రెడీ చేసి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు ఇవ్వనుంది.

మరోవైపు పాశమైలారంలోని ఈ ఘటనలో మరో 8 మంది కార్మికుల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. వారి కోసం అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, పోలీసు బృందాలు శిథిలాల కింద గాలింపు చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. గల్లంతైన తమ వారి కోసం బాధితుల కుటుంబాలు సహాయ కేంద్రం దగ్గర ఆందోళనతో ఎదురుచూస్తున్నాయి. ఐలాలోని హెల్ప్ డెస్క్ దగ్గర అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ బాధితుల కుటుంబాలతో మాట్లాడారు.

సిగాచి పరిశ్రమలో పేలుడు దుర్ఘటన జరిగి 9 రోజులవున్నా.. తమ వారి ఆచూకీ ఇంకా దొరకడం లేదని గల్లంతైన కార్మికుల కుటుంబీకులు గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో బాధితులను పరామర్శించి.. ఆఖరి వ్యక్తి జాడ తెలిసే వరకు సహాయక చర్యలు కొనసాగుతాయని ఆడిషినల్ కలెక్టర్ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు.

భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ విషాదంలో మరణించిన వారి సంఖ్య 44కు చేరింది. సంగారెడ్డిలోని ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అఖలేశ్వర్, బీరంగూడ సమీపంలోని పనీషియా మెరిడియన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆరిఫ్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పేలుడు తర్వాత ఆసుపత్రుల్లో చేరిన వారిలో గత వారం రోజుల్లో ఇప్పటివరకు 8 మంది మరణించారు. ప్రస్తుతం మరో 16 మంది కార్మికులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె
ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె
శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..
శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..
స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..
స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..
750 ఎకరాల్లో రూ.6వేల కోట్లతో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్..
750 ఎకరాల్లో రూ.6వేల కోట్లతో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్..
రోహిత్ రిటైర్మెంట్‌పై కైఫ్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ రిటైర్మెంట్‌పై కైఫ్ సంచలన వ్యాఖ్యలు
గురు మౌఢ్య త్యాగంతో ఆ రాశులకు మహర్దశ.. వారికి ఆకస్మిక ధనలాభం
గురు మౌఢ్య త్యాగంతో ఆ రాశులకు మహర్దశ.. వారికి ఆకస్మిక ధనలాభం
NEET UG 2026లో OMR షీట్ల వివాదం..సుప్రీం తలుపుతట్టిన విద్యార్ధులు
NEET UG 2026లో OMR షీట్ల వివాదం..సుప్రీం తలుపుతట్టిన విద్యార్ధులు
ఎర్ర ఇటుక, సిమెంట్ ఇటుక, ఫ్లైయాష్ బ్రిక్.. ఏది మంచిది?
ఎర్ర ఇటుక, సిమెంట్ ఇటుక, ఫ్లైయాష్ బ్రిక్.. ఏది మంచిది?
రెండు దశాబ్దాల తర్వాత ఆర్బీఐ ఊహించని డెసిషన్.. వాటికి లైసెన్సులు
రెండు దశాబ్దాల తర్వాత ఆర్బీఐ ఊహించని డెసిషన్.. వాటికి లైసెన్సులు
'దండుపాళ్యం' తరహా ముఠా..? వామ్మో.. వీళ్ల చోరీలు చూస్తే..
'దండుపాళ్యం' తరహా ముఠా..? వామ్మో.. వీళ్ల చోరీలు చూస్తే..