AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మేం దావత్ చేసుకోవాలే.. మీరు ఇళ్లకు పోండి.. స్టూడెంట్స్ కి షాకిచ్చిన 80 మంది టీచర్లు.. కట్‌చేస్తే

స్కూల్ లో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన 80 మంది ఉపాధ్యాయులు దావత్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం ఏకంగా స్కూల్‌నే మూసేసి విద్యార్థుల్ని ఇళ్లకు పంపించేశారు. ఉదయం స్కూల్‌కి వచ్చిన పిల్లల్ని మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటించి ఇళ్లకు పంపించేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విషయం జిల్లా కలెక్టర్‌కి చేరింది.

Hyderabad: మేం దావత్ చేసుకోవాలే.. మీరు ఇళ్లకు పోండి.. స్టూడెంట్స్ కి షాకిచ్చిన 80 మంది టీచర్లు.. కట్‌చేస్తే
Teachers For Closing School
Jyothi Gadda
|

Updated on: Dec 18, 2024 | 10:23 AM

Share

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ది చేసి, నాణ్యమైన విద్యను అందించాలని సర్కార్‌ యోచిస్తోంది. కానీ, సంబంధిత అధికారులు, సిబ్బంది మాత్రం అడుగు ముందుకు పడకుండా చేస్తున్నారు. గవర్నమెంట్‌ సూల్స్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలకు మరింత బలాన్నిచ్చేలా కొందరు ప్రభుత్వ పాఠశాల సిబ్బంది ప్రవర్తిస్తున్నారు. కానీ, అలాంటి వారిని ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఉన్నతాధికారులు. తాజాగా హైదరాబాద్‌ జిల్లాలోని షేక్‌పేట్‌ మండల పరిధిలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది.

హైదరాబాద్‌ జిల్లా షేక్‌పేట్‌ మండల పరిధిలోని 20 ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు చేసిన పని సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఈ 20స్కూళ్లకు సంబంధించిన దాదాపు 80 మంది ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ వేటు పడింది. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన సమయంలో 80 మంది ఉపాధ్యాయులు దావత్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం ఏకంగా స్కూల్‌నే మూసేసి విద్యార్థుల్ని ఇళ్లకు పంపించేశారు. ఉదయం స్కూల్‌కి వచ్చిన పిల్లల్ని మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటించి ఇళ్లకు పంపించేశారు. టీచర్లంతా మస్త్‌గా దావత్‌కు హాజరై భోజనాలు ఆరగించారు. దీనిపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం తెలిసి కంగుతిన్నారు.

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విషయం జిల్లా కలెక్టర్‌కి చేరింది. ఘటనపై కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి విచారణ చేపట్టి బాధ్యులైన డీఐఓఎస్‌ యాదగిరిని సస్పెండ్‌ చేశారు. విందులో పాల్గొన్న మిగతా టీచర్లందరికీ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటన డిసెంబర్‌ 13న జరిగినట్టుగా తెలిసింది. విధులు నిర్వహిస్తున్న 80 మంది సెకెండ్‌ గ్రేడ్‌ టీచర్లు, ప్రధానోపాధ్యాయులతోపాటు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌(డీఐఓఎస్‌) యాదగిరి కలిసి దావత్‌ చేసుకునేందుకు బంజారాహిల్స్‌లోని ప్రభుత్వ పాఠశాలను వేధిక చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో విద్యార్థులను మధ్యాహ్న భోజనం అనంతరం ఇళ్లకు పంపించేశారు. అనంతరం బడులకు తాళాలు వేసి బంజారాహిల్స్‌లోని పాఠశాలకు చేరుకొని విందు భోజనం చేశారు. మధ్యాహ్నమే పిల్లలంతా ఇళ్లకు రావడంతో అనుమానం వచ్చిన కొందరు తల్లిదండ్రులు ఏం జరిగిందని ఆరా తీయగా విషయం తెలిసింది. కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తీవ్రంగా పరిగణించి డీఐఓఎస్‌ను సస్పెండ్‌ చేయడంతోపాటు ఉపాధ్యాయులకు తాఖీదులు జారీ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఒంటిచేత్తో రన్నింగ్ క్యాచ్.. బౌండరీ లైన్‌లో షాకింగ్ ఫీల్డింగ్
ఒంటిచేత్తో రన్నింగ్ క్యాచ్.. బౌండరీ లైన్‌లో షాకింగ్ ఫీల్డింగ్
జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి కారణం అతనే
జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి కారణం అతనే
ద్వారకా తిరుమలలో నకిలీ టిక్కెట్ల కేటుగాళ్ల గుట్టురట్టు
ద్వారకా తిరుమలలో నకిలీ టిక్కెట్ల కేటుగాళ్ల గుట్టురట్టు
ప్రెషర్ కుక్కర్ నుంచి వాటర్ లీకైనా.. విజిల్ రాకపోయినా ఇలా చేస్తే
ప్రెషర్ కుక్కర్ నుంచి వాటర్ లీకైనా.. విజిల్ రాకపోయినా ఇలా చేస్తే
నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్
నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం
ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం
లక్షల్లో లాభాలు తెచ్చే తేనెటీగల పెంపకం.. తక్కువ పెట్టుబడితో..
లక్షల్లో లాభాలు తెచ్చే తేనెటీగల పెంపకం.. తక్కువ పెట్టుబడితో..
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్‌
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్‌
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు
ద్వారకా తిరుమలలో నకిలీ టిక్కెట్ల కేటుగాళ్ల గుట్టురట్టు
ద్వారకా తిరుమలలో నకిలీ టిక్కెట్ల కేటుగాళ్ల గుట్టురట్టు
నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్
నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం
ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్‌
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్‌
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు
ర్యాగింగ్ కలకలం.. సీనియర్ల రాక్షసానందం.. ఏం చేశారంటే
ర్యాగింగ్ కలకలం.. సీనియర్ల రాక్షసానందం.. ఏం చేశారంటే
పట్టపగలు దొంగల బీభత్సం.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్
పట్టపగలు దొంగల బీభత్సం.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్
పల్లె దాటని కథలు.. పొలిమేర దాటని సినిమాలు
పల్లె దాటని కథలు.. పొలిమేర దాటని సినిమాలు
టాలీవుడ్‌లో నెం.1 హీరోయిన్ కుర్చీ ఖాళీ: టాప్ స్థానం ఎవరిది
టాలీవుడ్‌లో నెం.1 హీరోయిన్ కుర్చీ ఖాళీ: టాప్ స్థానం ఎవరిది