AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బుట్టల్లో చాటుమాటుగా యవ్వారం.. పోలీసుల కంట పడటంతో బట్టబయలు!

హైదరాబాద్‌ పాతబస్తీలో అరుదైన అలెగ్జాండ్రిన్ చిలకలు అమ్మతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి మొత్తం110 అలెగ్జాండ్రిన్ చిలుకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో జత చిలకను రూ.1000 అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు మెరుపుదాడి చేసి నిందితుడిని కటకటాల్లో వేశారు..

Noor Mohammed Shaik
| Edited By: Srilakshmi C|

Updated on: Jan 22, 2025 | 11:14 AM

Share

హైదరాబాద్‌, జనవరి 22: అలెగ్జాండ్రిన్ చిలకలు అనే పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? బహుశా విని ఉండరు కానీ.. ఖచ్చితంగా చూసే ఉంటారు. అసలే పోనుపోను చెట్లతో పాటు కొన్ని పక్షులు, జంతువుల జాతులు కూడా అంతరించిపోతున్నాయి. అయితే.. ఉన్నవాటిని అయినా కాపాడుకునే అవసరం ఇప్పుడు మనకు ఎంతైనా ఉంది. అయితే అలెగ్జాండ్రిన్ చిలకలను ఓ వ్యక్తి అమ్ముతూ పట్టుబడ్డాడు. దీంతో సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

హైదరాబాద్ నగరం పాతబస్తీలో మహ్మద్ ఫారూఖ్ అనే వ్యక్తి ఏకంగా 110 అలెగ్జాండ్రిన్ చిలుకలను అమ్ముతూ పట్టుబడ్డాడు. ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఈ చిలుకలు చాలావరకు తగ్గిపోయాయి. అరుదుగా కనపడుతుంటాయి. ఇక హైదరాబాద్ వంటి నగరాల్లో అయితే కొన్ని ప్రాంతాల్లో తప్ప ఆసలు కనపడడం లేదు. ఈ క్రమంలోనే పాతబస్తీలో మహ్మద్ ఫారూఖ్ అనే వ్యక్తి ఏకంగా 110 అలెగ్జాండ్రిన్ చిలుకలను అమ్మడం తీవ్ర కలకలం రేపింది. సమాచారం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫారూఖ్ ని పట్టుకొని అటవీ అధికారులకు అప్పగించారు.

అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 110 అలెగ్జాండ్రిన్‌ చిలుకలను అటవీ అధికారులు జూపార్కుకు తరలించారు. ఈ ఘటనపై తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) ఆర్ఎం డోబ్రియల్ మాట్లాడుతూ.. అలెగ్జాండ్రిన్‌ చిలుకలను అక్రమంగా అమ్ముతున్న మహ్మద్ ఫారూఖ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. వన్యప్రాణి చట్టం ప్రకారం చిలుకలను వేటాడటం నేరం అని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.