AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీవన్ రెడ్డి: బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలన దారుణంగా ఉంది - కీలక ఇంటర్వ్యూ

జీవన్ రెడ్డి: బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలన దారుణంగా ఉంది – కీలక ఇంటర్వ్యూ

Rajashekher G
|

Updated on: Apr 25, 2026 | 9:03 PM

Share

Jeevan Reddy: మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలన గత బీఆర్ఎస్ పాలన కంటే దారుణంగా ఉందని ఆయన అన్నారు. తన రాజకీయ మార్పు, గత వ్యాఖ్యలు, మహా మహాలక్ష్మి పథకం అమలు తీరుపై క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు, తెలంగాణ రాజకీయాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.

మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత రాజినీకాంత్ వెల్లలచెరువు నిర్వహించిన క్రాస్ ఫైర్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో తెలంగాణ రాజకీయాలపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన తర్వాత ఆయన ఇచ్చిన ఈ తొలి ఇంటర్వ్యూ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గత బీఆర్ఎస్ పాలన కంటే దారుణంగా ఉందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో తాను కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పాలనను ఎండగట్టిన మాట వాస్తవమేనని, అయితే తాను గతంలో కాంగ్రెస్ పాలన కంటే బీఆర్ఎస్ పాలన దారుణం అనలేదని, గత బీఆర్ఎస్ పాలన కొంత మెరుగైనదని తాను అంటున్నానని వివరించారు. తన 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవిత అనుభవంలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 100 రోజుల్లో ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను పూర్తిగా అమలు చేసిన దాఖలాలు లేవని జీవన్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను ఇంటర్వ్యూయర్ గుర్తు చేశారు.

దీనిపై స్పందిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహా మహాలక్ష్మి పథకం ఉదాహరణను ప్రస్తావించారు. ఈ పథకం కింద మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం 100 రోజుల్లో అమలులోకి వచ్చినప్పటికీ, ఈ పథకానికి అవసరమైన నిధులను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, దీనితో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని జీవన్ రెడ్డి అన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుందని, అప్పుల పాలు చేసిందని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు ఇంటర్వ్యూయర్ ప్రస్తావించగా, తాను బీఆర్ఎస్ దోచుకుందని ఎన్నడూ అనలేదని జీవన్ రెడ్డి ఖండించారు. అయితే, రాష్ట్రం అప్పుల పాలు అయిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిందని తాను వ్యాఖ్యానించిన మాట వాస్తవమేనని అంగీకరించారు. మేడిగడ్డ కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల సమీకరణ కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, వివిధ జాతీయ బ్యాంకుల నుండి నిధులు సేకరించడం జరిగిందని, దీన్ని దోపిడీ అనడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.

Published on: Apr 25, 2026 08:30 PM
Follow Us