AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సత్తుపల్లి అడవుల్లో ‘వైల్డ్’ లైఫ్ సందడి.. ట్రాప్ కెమెరాల్లో అద్భుత దృశ్యాలు..!

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి అటవీ డివిజన్ పరిధిలో ప్రకృతి ప్రేమికులను, వన్యప్రాణి విభాగం అధికారులను ఉత్సాహపరిచే అరుదైన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. తల్లాడ, కల్లూరు, పెనుబల్లి మండలాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న కనకగిరి (పులిగుండాల) అడవుల్లో రెండు చిరుత పులులు స్వేచ్ఛగా సంచరిస్తూ కెమెరాకు చిక్కాయి.

Telangana: సత్తుపల్లి అడవుల్లో ‘వైల్డ్’ లైఫ్ సందడి.. ట్రాప్ కెమెరాల్లో అద్భుత దృశ్యాలు..!
Kanakagiri Puligundala Eco Tourism
N Narayana Rao
| Edited By: |

Updated on: Apr 26, 2026 | 12:59 PM

Share

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి అటవీ డివిజన్ పరిధిలో ప్రకృతి ప్రేమికులను, వన్యప్రాణి విభాగం అధికారులను ఉత్సాహపరిచే అరుదైన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. తల్లాడ, కల్లూరు, పెనుబల్లి మండలాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న కనకగిరి (పులిగుండాల) అడవుల్లో రెండు చిరుత పులులు స్వేచ్ఛగా సంచరిస్తూ కెమెరాకు చిక్కాయి.

వన్యప్రాణుల కదలికలను గమనించేందుకు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలలో ఈ చిరుతల దృశ్యాలు రికార్డయ్యాయి. ఒక జంతువు కళేబరం చుట్టూ ఈ రెండు చిరుతలు తిరుగుతూ భుజిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గత నెలలో కూడా ఒక చిరుత తన పిల్లలతో ఆడుకుంటున్న వీడియోను అధికారులు విడుదల చేశారు. వరుసగా చిరుతల ఉనికి కనిపిస్తుండటంతో ఈ ప్రాంతం వన్యప్రాణుల మనుగడకు అత్యంత అనుకూలంగా మారిందని స్పష్టమవుతోంది.

సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు అటవీ ప్రాంతాల్లో ప్రస్తుతం జీవవైవిధ్యం వెల్లివిరుస్తోంది. ఈ అడవుల్లో కేవలం చిరుతలే కాకుండా.. జింకలు, దుప్పులు, అడవి దున్నలు, అరుదైన పక్షులు ఇలా ఎన్నో రకాల జాతులు ఇక్కడ నివసిస్తున్నాయి. క్రూర మృగాలతో పాటు వాటికి ఆహారంగా లభించే శాకాహార జంతువులు కూడా సమృద్ధిగా ఉండటం ఇక్కడి పర్యావరణ సమతుల్యతకు నిదర్శనం.

ఈ పరిణామంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారి (DFO) సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. “ఒకే ఆవాసంలో వేర్వేరు జాతుల జంతువులు సంచరించడం అనేది ఆరోగ్యవంతమైన అడవికి సంకేతం. కనకగిరి అడవుల్లో ఉష్ణోగ్రత, నీటి వసతి, ఆహారం వన్యప్రాణులకు అనువుగా ఉన్నాయి. అడవులను, వన్యప్రాణులను రక్షించుకోవడం మన బాధ్యత, ఎందుకంటే అవి ఉంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుంది” అని ఆయన పేర్కొన్నారు.

పులిగుండాల ఎకో టూరిజం ప్రాంతంలో ఈ చిరుతల సంచారం పర్యావరణవేత్తల్లో ఆశలు రేకెత్తిస్తోంది. పచ్చని అడవులు, పెరిగిన జంతువుల సంఖ్య సత్తుపల్లి అటవీ ప్రాంతాన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా తీర్చిదిద్దేలా కనిపిస్తున్నాయి. అటవీ సంపదను కాపాడుకుంటూ, వన్యప్రాణులకు హాని కలిగించకుండా చూడాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి…

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
అఖిల్‌ను టార్గెట్ చేసిన రామ్ చరణ్‌..!
అఖిల్‌ను టార్గెట్ చేసిన రామ్ చరణ్‌..!
భగ్గుమంటున్న భారత్‌..ఏపీకి రెడ్‌ అలర్ట్‌.. తెలంగాణకు వర్ష సూచన
భగ్గుమంటున్న భారత్‌..ఏపీకి రెడ్‌ అలర్ట్‌.. తెలంగాణకు వర్ష సూచన
రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు
రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు
ధురంధర్‌ జోరుకు బ్రేక్‌ వేసిందెవరు..?
ధురంధర్‌ జోరుకు బ్రేక్‌ వేసిందెవరు..?
చిన్న సినిమాలకే పరిమితమవుతున్న తెలుగమ్మాయిలు
చిన్న సినిమాలకే పరిమితమవుతున్న తెలుగమ్మాయిలు
క్లాస్‌ టు మాస్‌.. మాస్‌ టు క్లాస్‌ రూటు మారుస్తున్న టాప్‌ స్టార్
క్లాస్‌ టు మాస్‌.. మాస్‌ టు క్లాస్‌ రూటు మారుస్తున్న టాప్‌ స్టార్
కాంగ్రెస్ పార్టీ వీడడానికి కారణం ఇదే.. అసలు విషయం బయటపెట్టిన..
కాంగ్రెస్ పార్టీ వీడడానికి కారణం ఇదే.. అసలు విషయం బయటపెట్టిన..
బీఆర్ఎస్‌లో చేరికపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
బీఆర్ఎస్‌లో చేరికపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
కేసీఆర్ చేసిందే కరెక్ట్.. కాళేశ్వరం ప్రాజెక్టుపై TV9 క్రాస్ ఫైర్‌
కేసీఆర్ చేసిందే కరెక్ట్.. కాళేశ్వరం ప్రాజెక్టుపై TV9 క్రాస్ ఫైర్‌
బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలన దారుణంగా ఉంది: జీవన్ రెడ్డి
బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలన దారుణంగా ఉంది: జీవన్ రెడ్డి