ఛీఛీ ఇదేం కక్కుర్తి.. ఫేమస్ రెస్టారెంట్లని వెళ్తున్నారా.. ఫుడ్ చూస్తే వామ్టింగ్ చేసుకోవాల్సిందే..
హైదరాబాద్లో ఫేమస్ రెస్టారెంట్ రాయలసీమ రుచులపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. భారీగా కల్తీ పదార్థాలు ఉన్నట్టు గుర్తించారు. మైదా పిండిపై పురుగులు భారీగా ఉండటాన్ని చూసి 20 కేజీల మైదా పిండిని అధికారులు సీజ్ చేశారు. పక్కనే ఉన్న పెద్ద డబ్బాను తెరిచి చూశారు. అందులో ఉన్న రెండు కేజీల చింతపండుపై పురుగులు పడి ఉండటాన్ని గుర్తించారు. దీంతో రెండు కేజీల చింతపండును సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్లో ఫేమస్ రెస్టారెంట్ రాయలసీమ రుచులపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. భారీగా కల్తీ పదార్థాలు ఉన్నట్టు గుర్తించారు. మైదా పిండిపై పురుగులు భారీగా ఉండటాన్ని చూసి 20 కేజీల మైదా పిండిని అధికారులు సీజ్ చేశారు. పక్కనే ఉన్న పెద్ద డబ్బాను తెరిచి చూశారు. అందులో ఉన్న రెండు కేజీల చింతపండుపై పురుగులు పడి ఉండటాన్ని గుర్తించారు. దీంతో రెండు కేజీల చింతపండును సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు ఫ్రిజర్లో ఉన్న పాల ప్యాకెట్లను పరిశీలించారు. వీటిపై డేట్ ఎక్సపెయిరీ అయినట్టు గుర్తించారు.
షా గౌస్ రెస్టారెంట్లోను భారీగా కల్తీ ఆహారం..
హైదరాబాద్లోని షాగౌస్ బిర్యానికి మంచి డిమాండ్ ఉంది. అక్కడ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. వీటిలోను నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాలను ఫీజ్లో స్టోర్ చేసి ఉండటాన్ని గుర్తించారు. షా గౌస్ హోటల్లోని రికార్డ్స్ని సైతం అధికారులు పరిశీలించారు. వీటిలోనూ నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం వ్యవహరించినట్టు అధికారుల తనిఖీల్లో బయటపడింది. పరిశుభ్రతతో పాటు నీటి శుభ్రతపైన అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. షా గౌస్ హోటల్లో శాంపుల్స్ను సేకరించిన అధికారులు లాబ్స్కు పంపించారు. ఈ తనిఖీల్లో 168 గోలీ సోడా బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇది అమ్మడానికి ఎలాంటి అనుమతులు లేవని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఇండియన్ వాటితో పాటు డ్రై ఫ్రూట్స్పైన ఎలాంటి రేట్లు లేకుండా విక్రయాలు జరుపుతున్నట్లు తనిఖీల్లో వెలుగులోకి వచ్చాయి. రూ.11 వేల రూపాయల విలువైన డ్రై ఫ్రూట్స్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వీటితో పాటు నిబంధనలకు విరుద్ధంగా కొన్ని పరిశుభ్రతకు సంబంధించిన వాటిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝుళిపించారు.
కొద్దిరోజుల క్రితం ఖైరతాబాద్లోని కామత్ హోటల్పైన తనిఖీలు నిర్వహించిన అధికారులు.. నూడుల్స్తో పాటు టీ పౌడర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్స్ లేకుండానే ఫుడ్ హ్యాండ్లర్స్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పక్కనే ఉన్న సుఖ్ సాగర్లో సైతం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ఎలాంటి లేబుల్ లేకుండా పుట్టగొడుగులు అమ్ముతున్నట్టు గుర్తించారు. స్పాట్లోనే వాటిని బయటపడేశారు. ఇలా హైదరాబాద్ లోని పలు ప్రముఖ రెస్టారెంట్లలో మెరుపుదాడులు నిర్వహించి పలు ఆహార పదార్ధాలను సీజ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








