విజయ్ సాతా, టీవీ 9 క్రైమ్ బ్యూరో చీఫ్గా దీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. 15 ఏళ్లకుపైగా క్రైమ్ జర్నలిజంలో తన ప్రయాణం కొనసాగిస్తూ అనేక సంఘటనలను కవర్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో విజయ్ సాతా మొదటి ప్లేస్ లో ఉంటారు అనడానికి అయన చేసిన సెన్సేషనల్ స్టోరీలే ఉదాహరణ.
దేశాన్ని వణికించిన నిర్భయ సంఘటన నుండి గోవాలో డ్రగ్ మాఫియా పై స్ట్రింగ్ ఆపరేషన్ వరకు, అంతే కాకుండా అనేక కుంభకోణాలు, నేరాలు, చీకటి కోణాలు వెలుగు లోకి తెచ్చి ఎన్నో సంచలనాలు సృష్టించారు. ఎవరూ సాహసించని ప్రాంతాల్లో కూడా రిపోర్టింగ్ చేసి విజయ్ సాతా ధైర్యాన్ని ప్రదర్శించారు. స్వయంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో పర్యటించి మావోయిస్టుల సమాచారం తో పాటు, ఎన్నో ఎన్ కౌంటర్ వార్తలను కవర్ చేశారు. ముఖ్యంగా పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులు, మోస్ట్ వాంటెడ్ నేరస్తులతో చేసిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలతో ఆయన ప్రజలందరిని ఆశ్చర్యపరిచారు.
గ్రౌండ్ రిపోర్టింగ్ చేయడమే కాకుండా, సమాజం లో కొత్త నేరాలను గుర్తించి ప్రజలను అవగాహన పరిచే కథనాలు అందించడంలో ఆయన ప్రత్యేకం. అయన అందించే డిజిటల్ కథనాలు సరికొత్త స్టైల్ లో ఉండటమే కాకుండా, మీ రోజూ వారి జీవనంలో మీకు ఉపయోగపడే ఎన్నో విషయాలు అందిస్తాయి.
Diabetes Medicine Price: షుగర్ పేషెంట్లకు గుడ్ న్యూస్.. ఖరీదైన ‘సెమాగ్లుటైడ్’ మందుల ధరలు ఢమాల్!
బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ పేషెంట్లకు ఊరట కలిగించే గుడ్ న్యూస్ వచ్చింది. ఇప్పటి వరకు ఖరీదైనదిగా భావించిన ‘సెమాగ్లుటైడ్’ మందుల ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోవడంతో సాధారణ ప్రజలకు కూడా ఇవి అందుబాటులోకి రానున్నాయి. షుగర్ కంట్రోల్ చేయడం, బరువు తగ్గడం ఈ రోజుల్లో చాలామందికి పెద్ద సవాల్గా మారిన నేపథ్యంలో, ఈ పరిణామం ఆరోగ్య రంగంలో కీలక మార్పుగా భావిస్తున్నారు..
- Vijay Saatha
- Updated on: Mar 25, 2026
- 12:46 pm
ఎట్టిపరిస్థితుల్లోనూ ChatGPTతో మీ పర్సనల్ విషయాలు చెప్పకండి.. హద్దుదాటారో అంతే సంగతి!
ప్రస్తుతం యువత జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తోంది. ఆఫీస్లో బాస్తో గొడవ వచ్చినా, జీతం పెంచమని ఎలా అడగాలో తెలియకపోయినా, వ్యక్తిగత సంబంధాల్లో సమస్యలు వచ్చినా… వెంటనే చాలామంది ఆశ్రయిస్తున్నది ‘చాట్ జీపీటీ’నే. రోజుకు కోట్ల సంఖ్యలో ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఈ AI చాట్బాట్ వేగంగా ప్రజల్లోకి చేరిపోయింది. అంచనాల ప్రకారం రోజుకు దాదాపు 250 కోట్ల ప్రశ్నలకు స్పందిస్తోంది..
- Vijay Saatha
- Updated on: Mar 25, 2026
- 12:37 pm
ఎల్బీనగర్లో హుక్కా సెంటర్పై పోలీసుల దాడి
హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో సెహరీ కేఫ్ అనే అక్రమ హుక్కా సెంటర్పై పోలీసులు దాడి చేశారు. అనుమతులు లేకుండా నడుపుతున్న ఈ కేఫ్ను సీజ్ చేసి, 20 మంది నిర్వాహకులను, వినియోగదారులను అరెస్ట్ చేశారు. 15 వాహనాలు, మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ హుక్కా సెంటర్లపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.
- Vijay Saatha
- Updated on: Mar 21, 2026
- 4:41 pm
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? అడవి నుండి జనారణ్యంలోకి.. దేవుజీ ఇంటర్వ్యూలో విస్తుపోయే నిజాలు!
మావోయిస్ట్ అగ్రనేత దేవుజీ టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం సృష్టిస్తోంది. సాయుధ పోరాటం నుండి ప్రజాస్వామ్య వేదికల వైపు పార్టీ మళ్లుతోందనే సంకేతాలను ఆయన ఇచ్చారు. ముఖ్యంగా 'ఆపరేషన్ కగార్' ఒత్తిడి, క్షేత్రస్థాయిలో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో అడవిని వదిలి జనారణ్యంలోకి, మైదాన ప్రాంతాల సమస్యలపై చట్టబద్ధమైన పోరాటం చేస్తామని ఆయన ప్రకటించడం ఒక భారీ వ్యూహ మార్పు. 'లొంగుబాటు' అనే పదాన్ని తిరస్కరిస్తూనే, తెలంగాణ పోలీసుల తీరుపై సానుకూలత వ్యక్తం చేయడం గమనార్హం. భవిష్యత్తులో మావోయిస్ట్ పార్టీ ఒక రాజకీయ విభాగంగా రూపాంతరం చెంది, భూమి, ఉపాధి వంటి మౌలిక సమస్యలపై 'లీగల్ ఫ్రేమ్వర్క్'లో పోరాడే అవకాశం ఉందని దేవుజీ వెల్లడించిన నిజాలు ఉద్యమ భవిష్యత్తుపై కొత్త చర్చకు తెరలేపాయి.
- Vijay Saatha
- Updated on: Mar 14, 2026
- 9:19 pm
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావుకు బిగ్ రిలీఫ్!
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుఇంది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసుపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది.
- Vijay Saatha
- Updated on: Mar 10, 2026
- 3:23 pm
Sanju Samson: సంజూ శాంసన్ రేంజే వేరు భయ్యో.. కేరళతోపాటు సౌత్లో ఆస్తులు చూస్తే పరేషానే..!
Team India Player Sanju samson Net Worth: టీమిండియా యంగ్ ప్లేయర్ సంజూ శాంసన్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాడు. దీంతో ఎక్కడ చూసినా అతని గురించే మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో శాంసన్ ఆస్తులు తెలుసుకోవాలని ఫ్యాన్స్ గూగుల్లో వెతకడం మొదలుపెట్టారు.
- Vijay Saatha
- Updated on: Mar 10, 2026
- 11:02 am
ప్రజల ఆరోగ్య రక్షణ కోసం తెలంగాణ సర్కార్ సరికొత్త సిస్టమ్.. మెడికల్ షాపులు, ఫార్మా కంపెనీలకు హెచ్చరికలు..
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) నాణ్యత లేని (NSQ) మందుల గుర్తింపుపై రాష్ట్రవ్యాప్తంగా బల్క్ SMS అలర్ట్ సిస్టమ్ను ప్రారంభించింది. ఇది మెడికల్ షాపులు, తయారీదారులు, పంపిణీదారులకు తక్షణమే హెచ్చరికలను చేరవేస్తుంది, గతంలో ఉన్న 15-20 రోజుల ఆలస్యాన్ని తగ్గిస్తుంది. ఈ డిజిటల్ విధానం ప్రజల ఆరోగ్య రక్షణకు, అనర్హ మందులు మార్కెట్లోకి చేరకుండా అడ్డుకోవడానికి తోడ్పడుతుంది. DCA ల్యాబ్ల విస్తరణకు కూడా ప్రణాళికలు రూపొందించింది.
- Vijay Saatha
- Updated on: Mar 9, 2026
- 6:50 pm
Telangana: పిలవని పెళ్లి భోజనానికి వెళ్తున్నారా.? దొరికితే శిక్ష ఎంత పడుతుందో తెల్సా..
ఆహ్వానం లేకుండా పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లి భోజనం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. ఐపీసీ సెక్షన్ 441 ప్రకారం, అనుమతి లేకుండా ఇతరుల ప్రైవేటు ఆస్తిలోకి ప్రవేశించినందుకు మూడు నెలల జైలుశిక్షతో పాటు 5000 రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. ఇలాంటి చర్యల పట్ల జాగ్రత్త వహించాలని సూచన.
- Vijay Saatha
- Updated on: Mar 9, 2026
- 5:09 pm
TVK చీఫ్ విజయ్కు మళ్లీ సీబీఐ నోటీసులు.. విచారణకు హాజరు కావాలని ఆదేశం
సినీ నటుడు విజయ్కు మరో షాక్ తగిలింది. ,ఇటీవలే ఆయన భార్య విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు విజయ్కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేసింది.
- Vijay Saatha
- Updated on: Mar 9, 2026
- 2:07 pm
డీజీపీ చేతిలో మోస్ట్ వాంటెడ్ ‘సెవెన్’.. వారితోనే కామ్రేడ్ల శకానికి క్లయిమాక్స్ ముడిపడి ఉందా?
మార్చి 7న మొత్తం 4 బస్సుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కు వచ్చి, 124 ఆయుధాలను పోలీసుల చేతికి ఇచ్చి, ఏకంగా 130 మంది మావోయిస్టులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సరెండర్ అయ్యారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు.. శనివారం నాటి చరిత్రాత్మక సందర్భం అది. కానీ, ఒక్కటి మిగిలింది అంటోంది తెలంగాణ సర్కార్. ఒక్కరు కాదు ఏడుగురు కావాలి అని ఆర్డర్ వేసింది కేంద్ర హోంశాఖ. ఎవరా ఏడుగురు? ఎక్కడున్నట్టు? ఆ ఏడుగురితోనే కామ్రేడ్ల శకానికి క్లయిమాక్స్ ముడిపడి ఉందా?
- Vijay Saatha
- Updated on: Mar 8, 2026
- 8:09 pm
VC Sajjanar: రిటైర్ అవుతున్న పోలీస్ సిబ్బందికి వీసీ సజ్జనార్ స్వీట్ అడ్వైస్.. ఏం చెప్పారంటే?
హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్ నుండి పదవీ విరమణ పొందుతున్న 19 మంది అధికారులకు సీపీ వి.సి. సజ్జనార్ ఘనంగా వీడ్కోలు పలికారు. సుదీర్ఘ సేవలందించిన వారిని కొనియాడుతూ, ఆరోగ్యకరమైన, చురుకైన శేష జీవితాన్ని గడపాలని సూచించారు. ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వ బ్యాంకులలో భద్రపరచుకోవాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కుటుంబ సభ్యులు విశ్రాంత అధికారులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
- Vijay Saatha
- Updated on: Feb 28, 2026
- 7:49 pm
Telangana: షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్కు గడియ వేసి..
మేడ్చల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈఎంఐ కట్టలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. బైక్ లోన్ చెల్లింపుల విషయంలో ఫైనాన్సర్ల వేధింపులు తట్టుకోలేక 34 ఏళ్ల సుమన్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
- Vijay Saatha
- Updated on: Feb 28, 2026
- 6:29 pm