విజయ్ సాతా, టీవీ 9 క్రైమ్ బ్యూరో చీఫ్గా దీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. 15 ఏళ్లకుపైగా క్రైమ్ జర్నలిజంలో తన ప్రయాణం కొనసాగిస్తూ అనేక సంఘటనలను కవర్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో విజయ్ సాతా మొదటి ప్లేస్ లో ఉంటారు అనడానికి అయన చేసిన సెన్సేషనల్ స్టోరీలే ఉదాహరణ.
దేశాన్ని వణికించిన నిర్భయ సంఘటన నుండి గోవాలో డ్రగ్ మాఫియా పై స్ట్రింగ్ ఆపరేషన్ వరకు, అంతే కాకుండా అనేక కుంభకోణాలు, నేరాలు, చీకటి కోణాలు వెలుగు లోకి తెచ్చి ఎన్నో సంచలనాలు సృష్టించారు. ఎవరూ సాహసించని ప్రాంతాల్లో కూడా రిపోర్టింగ్ చేసి విజయ్ సాతా ధైర్యాన్ని ప్రదర్శించారు. స్వయంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో పర్యటించి మావోయిస్టుల సమాచారం తో పాటు, ఎన్నో ఎన్ కౌంటర్ వార్తలను కవర్ చేశారు. ముఖ్యంగా పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులు, మోస్ట్ వాంటెడ్ నేరస్తులతో చేసిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలతో ఆయన ప్రజలందరిని ఆశ్చర్యపరిచారు.
గ్రౌండ్ రిపోర్టింగ్ చేయడమే కాకుండా, సమాజం లో కొత్త నేరాలను గుర్తించి ప్రజలను అవగాహన పరిచే కథనాలు అందించడంలో ఆయన ప్రత్యేకం. అయన అందించే డిజిటల్ కథనాలు సరికొత్త స్టైల్ లో ఉండటమే కాకుండా, మీ రోజూ వారి జీవనంలో మీకు ఉపయోగపడే ఎన్నో విషయాలు అందిస్తాయి.
ఆధార్లో పేరు మార్చుకుని 14 ఏళ్లుగా పరారీలోనే.. చివరకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ కిల్లర్!
దశాబ్దానికి పైగా పోలీసులకు చిక్కకుండా తిరిగిన రౌడీ షీటర్ను సుల్తాన్ బజార్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. హత్య సహా 21 కేసుల్లో నిందితుడైన విష్ణవ్ కిషన్ దాస్ అలియాస్ గణేష్ మహరాజ్ మలక్పేటలో దొరికాడు. గుర్తింపు మార్చుకుని పరారీలో ఉన్న అతడిని ప్రత్యేక బృందం చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది..
- Vijay Saatha
- Updated on: May 29, 2026
- 8:44 am
Telangana: అవినీతి తిమింగలాలు @రూ.100 కోట్లు.. ACB దాడుల్లో షాకింగ్ విషయాలు
Telangana ACB Raids: తెలంగాణలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ(ACB) ప్రత్యేక ఫోకస్ పెట్టింది. గత ఏడాది కాలంగా ఆదాయానికి మించిన ఆస్తులు, అక్రమ సంపాదనలు, లంచాల వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఏసీబీ.. వరుస దాడులతో సంచలన విషయాలను వెలికితీస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా పలువురు అధికారులపై నమోదైన అక్రమాస్తుల కేసులు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు లక్షల్లో ఉండే ఒక్కో అవినీతి అధికారి అక్రమాస్తుల లెక్కలు.. ఇప్పుడు ఏకంగా రూ.100 కోట్ల మార్క్ను దాటుతుండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
- Vijay Saatha
- Updated on: May 28, 2026
- 6:54 pm
Online Fraud: ప్రజలకు బిగ్ అలర్ట్.. సోషల్ మీడియాలో వచ్చే ఈ యాడ్స్ నమ్మారంటే నట్టేట మునిగినట్టే!
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ పోలీసులకు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో జోతిష్యం, తంత్ర-మంత్ర సేవల పేరుతో వచ్చే ప్రకటనలు నమ్మవద్దని హెచ్చరించారు. అవన్నీ మీ నుంచి డబ్బులు కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు పన్నే పన్నాగాళ్లని.. వాటిని నమ్మి జనాలు డబ్బులు కోల్పోవద్దని తెలిపారు. ఎవరైనా ఈ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.
- Vijay Saatha
- Updated on: May 26, 2026
- 7:06 pm
మసాలా పొడిని డ్రగ్స్ అనుకున్న అధికారులు.. పాపం 57 రోజుల జైలు..
మధ్యప్రదేశ్లోని భోపాల్ విమానాశ్రయంలో మసాలా పొడి ప్యాకెట్లను మాదక ద్రవ్యాలుగా పొరబడటంతో ఓ వ్యాపారి 57 రోజులు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఆమ్చూర్, గరం మసాలా ప్యాకెట్లపై స్కానింగ్ యంత్రం హెచ్చరికలు ఇవ్వడంతో అధికారులు అతడిపై ఎన్డీపీఎస్ కేసు నమోదు చేశారు. అనంతరం ఫోరెన్సిక్ పరీక్షల్లో అవి కేవలం మసాలా దినుసులేనని తేలడంతో హైకోర్టు బాధితుడికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
- Vijay Saatha
- Updated on: May 25, 2026
- 8:15 pm
Hyderabad Police: భాషా సమస్యలకు చెక్.. ఏఐ కాప్రైటర్ యాప్తో హైదరాబాద్ పోలీసుల నూతన అడుగు
పోలీసు సేవల్లో సాంకేతికత వినియోగాన్ని మరింత విస్తరించే దిశగా హైదరాబాద్ పోలీసులు దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత కంప్లైంట్ రికార్డర్ యాప్ను ప్రారంభించారు. 10కిపైగా భాషల్లో ఫిర్యాదులను నమోదు చేసే ఈ “ఏఐ కాప్రైటర్” యాప్ ద్వారా బాధితుల మాటలను వెంటనే టెక్స్ట్గా మార్చి అనువదించే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మొదటి దశలో 80కిపైగా పోలీస్ స్టేషన్లలో ఈ యాప్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
- Vijay Saatha
- Updated on: May 25, 2026
- 8:05 pm
Maharashtra crime: భార్యతో చిన్నగా మొదలైన గొడవ.. చివరకు భర్త ఏం చేశాడో తెలిస్తే..
కుటుంబ కలహాలు ఎంతటి దారుణాలకు దారితీస్తాయో ఈ ఘటనే నిదర్శనం. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న గొడవ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో కోపాన్ని ఆపుకోలేని భర్త అమానుషంగా ప్రవర్తించాడు. విచక్షణ కోల్పోయి భార్యపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
- Vijay Saatha
- Updated on: May 25, 2026
- 2:15 pm
యూరప్ దేశాలను వణికిస్తున్న లైంగిక వ్యాధులు.. 300 శాతానికి పైగా పెరిగిన కేసులు.. కారణమేంటంటే
యూరప్ వాసులను లైంగిక సంక్రమణ వ్యాధులు వణికిస్తున్నాయి. ముఖ్యంగా 303 శాతం గోనేరియా కేసులు స్థానికంగా తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. సరైన నివారణ, పరీక్షలు లేకపోవడం, పాత చికిత్సా విధానాలు దీనికి కారణమని నివేదికలు చెబుతున్నాయి. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని, తక్షణమే పటిష్ట చర్యలు తీసుకోవాలని ECDC స్థానిక ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది.
- Vijay Saatha
- Updated on: May 22, 2026
- 1:53 pm
SOCEYE: శాంతి-భద్రతల పరిరక్షణలో సరికొత్త అస్త్రం ‘సాక్ఐ’.. AIతో సోషల్ మీడియాపై నిరంతర నిఘా
SOCEYE: హైదరాబాద్ సిటీ పోలీసులు సోషల్ మీడియాలో విద్వేషాలు, తప్పుడు ప్రచారాలను గుర్తించి అరికట్టేందుకు AI ఆధారిత “SOCEYE” అప్లికేషన్ను ప్రారంభించారు. ఈ వ్యవస్థ ద్వారా శాంతిభద్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలు, అసాంఘిక శక్తుల కదలికలను పోలీసులు సమర్థంగా పర్యవేక్షించనున్నారు. దీంతో పోలీసులకు నేరాలను అరికట్టేందుకు పోలీసులకు సరికొత్త అస్త్రం దొరికినట్లయింది.
- Vijay Saatha
- Updated on: May 18, 2026
- 8:08 pm
పోక్సో యాక్ట్.. అబ్బాయిలకూ రక్షణ కల్పిస్తుందా..? చట్టం ఏమంటోంది..?
తెలంగాణ రాజకీయాల్లో పోక్సో చట్టంపై చర్చలు తీవ్రంగా జరుగుతున్న వేళ, ఈ చట్టం అమ్మాయిలకే కాదు అబ్బాయిలకూ సమానంగా వర్తిస్తుందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బాధితుడు మైనర్ అయితే, నిందితుడు కూడా మైనర్ అయినా పోక్సో చట్టం అమలులోకి వస్తుందని వారు చెబుతున్నారు. పిల్లల రక్షణే ప్రధాన లక్ష్యంగా రూపొందిన ఈ చట్టంపై ప్రజల్లో మరింత అవగాహన అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
- Vijay Saatha
- Updated on: May 14, 2026
- 1:36 pm
ఇంటి కింద బంగారు ప్యాలెస్.. టీఎంసీ నేత రాజభోగాలు చూస్తే మైండ్ బ్లాంకే.. ఎలా బయటపడిందంటే..?
బయటకు చూస్తే ఒక సామాన్యమైన ఇల్లు.. కానీ లోపలికి వెళ్తే కళ్లు బైర్లు కమ్మే విలాసవంతమైన ప్యాలెస్.. పశ్చిమ బెంగాల్ టీఎంసీ నేత షమీమ్ అహ్మద్ నివాసంపై జరిగిన పోలీసుల దాడిలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భూగర్భంలో ఏర్పాటు చేసుకున్న రహస్య గదిలో ఏకంగా బంగారు మంచాన్ని చూసి పోలీసులు అవాక్కయ్యారు. అసలు ఈ అక్రమ సామ్రాజ్యం గుట్టు ఎలా రట్టయ్యిందో తెలుసుకుందాం..
- Vijay Saatha
- Updated on: May 14, 2026
- 1:29 pm
లాయర్గా మారిన దీదీ: కోర్టులో స్వయంగా వాదించిన మమత
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ లాయర్ దుస్తుల్లో కోల్కతా హైకోర్టులో వాదనలు వినిపించారన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎన్నికల అనంతర హింస కేసుల నేపథ్యంలో ఆమె న్యాయవాదిగా కోర్టులో హాజరయ్యారన్న వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ అంశంపై అధికారిక స్పష్టత కోసం రాజకీయ, న్యాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
- Vijay Saatha
- Updated on: May 14, 2026
- 1:23 pm
Hyderabad: జూబ్లీహిల్స్ మైనర్ల ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వీడి తెలివితేటలు మామూలుగా లేవుగా!
జూబ్లీహిల్స్లో మైనర్ బాలికలను టార్గెట్ చేసి, ట్రాప్ చేసిన కేసులో ప్రధాన నిందితుడు అర్జున్ కోడూరి సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకున్నట్టు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా మైనర్ అమ్మాయిలను వలలో వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు TV9 చేతికి అర్జున్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కు సంబంధించిన కీలక వివరాలు చిక్కాయి..
- Vijay Saatha
- Updated on: May 8, 2026
- 6:42 pm