Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Saatha

Vijay Saatha

Crime Bureau Chief - TV9 Telugu

vijaykumar.satha@tv9.com

విజయ్ సాతా, టీవీ 9 క్రైమ్ బ్యూరో చీఫ్‌గా దీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. 15 ఏళ్లకుపైగా క్రైమ్ జర్నలిజంలో తన ప్రయాణం కొనసాగిస్తూ అనేక సంఘటనలను కవర్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో విజయ్ సాతా మొదటి ప్లేస్ లో ఉంటారు అనడానికి అయన చేసిన సెన్సేషనల్ స్టోరీలే ఉదాహరణ.

దేశాన్ని వణికించిన నిర్భయ సంఘటన నుండి గోవాలో డ్రగ్ మాఫియా పై స్ట్రింగ్ ఆపరేషన్ వరకు, అంతే కాకుండా అనేక కుంభకోణాలు, నేరాలు, చీకటి కోణాలు వెలుగు లోకి తెచ్చి ఎన్నో సంచలనాలు సృష్టించారు. ఎవరూ సాహసించని ప్రాంతాల్లో కూడా రిపోర్టింగ్ చేసి విజయ్ సాతా ధైర్యాన్ని ప్రదర్శించారు. స్వయంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో పర్యటించి మావోయిస్టుల సమాచారం తో పాటు, ఎన్నో ఎన్ కౌంటర్ వార్తలను కవర్ చేశారు. ముఖ్యంగా పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులు, మోస్ట్ వాంటెడ్ నేరస్తులతో చేసిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలతో ఆయన ప్రజలందరిని ఆశ్చర్యపరిచారు.

గ్రౌండ్ రిపోర్టింగ్ చేయడమే కాకుండా, సమాజం లో కొత్త నేరాలను గుర్తించి ప్రజలను అవగాహన పరిచే కథనాలు అందించడంలో ఆయన ప్రత్యేకం. అయన అందించే డిజిటల్ కథనాలు సరికొత్త స్టైల్ లో ఉండటమే కాకుండా, మీ రోజూ వారి జీవనంలో మీకు ఉపయోగపడే ఎన్నో విషయాలు అందిస్తాయి.

Read More
Follow On:
Hyderabad: క్రికెట్ బెట్టింగ్‌కు మరో ప్రాణం బలి.. డబ్బులు నష్టపోయి ఎంసెట్ విద్యార్థి ఆత్మహత్య

Hyderabad: క్రికెట్ బెట్టింగ్‌కు మరో ప్రాణం బలి.. డబ్బులు నష్టపోయి ఎంసెట్ విద్యార్థి ఆత్మహత్య

క్రికెట్ బెట్టింగ్ కు హైదరాబాద్‌లో మరొక విద్యార్థి బలయ్యాడు. జేఎన్‌టీయూ హెచ్‌కి చెందిన మొదటి సంవత్సరం ఎం‌టెక్ విద్యార్థి పవన్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో భారీగా డబ్బులు కోల్పోయిన అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం 7 గంటలకు.. ఆ వివరాలు

Hyderabad: పైకి చూస్తే సాదాసీదా ఎలక్ట్రీషియన్ అనుకునేరు.. మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాంకే

Hyderabad: పైకి చూస్తే సాదాసీదా ఎలక్ట్రీషియన్ అనుకునేరు.. మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాంకే

దేశవ్యాప్తంగా 30 సైబర్ నేరాలకు పాల్పడిన ఒక ఎలక్ట్రీషియన్‌ను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. 30 సైబర్ క్రైమ్ కేసుల్లో అతని పాత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. యూపీకి చెందిన ఆకాష్ వర్మ విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాడు. ఇతడు సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో బయటపడింది.

సీబీఐ దర్యాప్తులో కొత్త కోణం.. ఇన్‌కమ్ ట్యాక్స్, కస్టమ్స్ అధికారుల అరెస్ట్..!

సీబీఐ దర్యాప్తులో కొత్త కోణం.. ఇన్‌కమ్ ట్యాక్స్, కస్టమ్స్ అధికారుల అరెస్ట్..!

CBI దర్యాప్తు ఫలితంగా ఐదుగురు ఐటీ అధికారులు, ఒక చార్టెడ్ అకౌంటెంట్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. అదనంగా, RGIA కస్టమ్స్ అధికారులు కూడా విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి లంచాలు తీసుకున్నట్లు తేలింది. GST అధికారులు కూడా వివిధ ప్రాంతాలలో వ్యాపారుల వద్ద లంచం కోసం ఒత్తిడి చేసినట్లు నిర్ధారణ అయింది.

HCU లో ప్రతి ఏడాది జింకలు మృతికి కారణం ఇదేనా..! వెలుగులోకి అసలు వాస్తవాలు!

HCU లో ప్రతి ఏడాది జింకలు మృతికి కారణం ఇదేనా..! వెలుగులోకి అసలు వాస్తవాలు!

దేశవ్యాప్తంగా కంచె గచ్చిబౌలి వివాదం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక జింకపై కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడికి జింక మృతి చెందింది. జింకను గమనించిన సెక్యూరిటీ అధికారులు హాస్పిటల్‌కు తరలించే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Hyderabad: హైదరాబాద్ ఫేమస్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య

Hyderabad: హైదరాబాద్ ఫేమస్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య

రాజేంద్రనగర్, అత్తాపూర్‌ లో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియవచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డీటేల్స్ ఇలా...

Hyderabad: మొగుడు, పెళ్లాం కలిసి భలే యాపారం సెట్ చేశారు.. అడ్డంగా బుక్కయ్యారు

Hyderabad: మొగుడు, పెళ్లాం కలిసి భలే యాపారం సెట్ చేశారు.. అడ్డంగా బుక్కయ్యారు

హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్‌లో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. మాడిశెట్టి అజయ్, అతని భార్య సంధ్య కలిసి మూడు క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ద్వారా భారీ స్థాయిలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అజయ్ గతంలోనే నాలుగు సార్లు క్రికెట్ బెట్టింగ్ కేసుల్లో పట్టుబడినట్లు సమాచారం.

Hyderabad: టెంపరరీ స్టే కోసం హోటల్ రూమ్‌కు వెళ్ళిన ఎయిర్ హోస్టస్‌.. అనుకోని ఘటనతో షాక్!

Hyderabad: టెంపరరీ స్టే కోసం హోటల్ రూమ్‌కు వెళ్ళిన ఎయిర్ హోస్టస్‌.. అనుకోని ఘటనతో షాక్!

ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్న ఒక ఎయిర్ హోస్టస్‌ను ఉప్పల్‌కు చెందిన ఒక యువకుడు వేధింపులకు పాల్పడ్డాడు. యువతి ఫిర్యాదుతో ఎస్ ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమీర్‌పేటలోని గ్రీన్‌ల్యాండ్ హోటల్‌లో ఈ ఘటన జరిగింది. టెంపరరీ స్టే కోసం రూమ్‌ను ఎయిర్ హోస్టస్‌ బుక్ చేసుకుంది. అదే హోటల్‌లోని రెస్టారెంట్‌లో మార్చి 25న డిన్నర్ చేసి తిరిగి తన రూ‌మ్‌కు వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

Hyderabad: కుల్ఫీ ఐస్క్రీమ్‌లు, బర్ఫీ స్వీట్లు.. ఇవి తింటే పక్కాగా పోతారు.. పోలీసులు చూడగా

Hyderabad: కుల్ఫీ ఐస్క్రీమ్‌లు, బర్ఫీ స్వీట్లు.. ఇవి తింటే పక్కాగా పోతారు.. పోలీసులు చూడగా

భాగ్యనగరంలో ఓ పక్కన అందరూ హోళీ జరుపుకుంటుంటే.. మరో పక్క ధూల్‌పేట్‌లో చిత్రవిచిత్రమైన వ్యవహారాలు జరుగుతున్నాయి. ఆ వివరాలు ఏంటో.? ఇప్పుడు.? ఓసారి ఈ స్టోరీలో తెలుసుకుందామా..? లేట్ ఎందుకు ఒకసారి లుక్కేయండి. పోలీసులు వెళ్లి చూడటంతో.. అంతా షాక్ అయ్యారు.

Hyderabad: అనుమానాస్పదంగా ఫుడ్ డెలివరీ బాయ్.. డౌట్ వచ్చి.. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా

Hyderabad: అనుమానాస్పదంగా ఫుడ్ డెలివరీ బాయ్.. డౌట్ వచ్చి.. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా

ర్యాపిడో ఫుడ్ డెలివరీ బాయ్.. ఓ వీధిలో ఆర్డర్‌లు లేకపోయినా.. అటువైపే తిరుగుతూ ఉన్నాడు. అనుమానమొచ్చి చూడగా.. అతడు ఆ తర్వాత చేసిన పనికి అందరూ షాక్ అయ్యాడు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే.? ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఇప్పుడు తెలుసుకుందామా..

Hyderabad: భారీ భద్రత నడుమ హైదరాబాద్‌లో హోలీ వేడుకలు

Hyderabad: భారీ భద్రత నడుమ హైదరాబాద్‌లో హోలీ వేడుకలు

సంతోషాల కేళి.. సంబరాల హోలీ.. ఏటా దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు హోలీ పండుగను జరుపుకుంటాం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు రంగులు పూసుకుని ఎంతో ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారు. జీవితాల్లో ఆనందాన్ని నింపడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. రంగులతోనే కాకుండా డీజే పాటలు, రెయిన్ డ్యాన్స్‌లతో ఎంజాయ్ చేస్తున్నారు. హోలీ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Gold Smuggling: దుబాయ్ నుండి వచ్చిన హీరోయిన్ రన్యా రావ్ ఎలా దొరికిందంటే..!

Gold Smuggling: దుబాయ్ నుండి వచ్చిన హీరోయిన్ రన్యా రావ్ ఎలా దొరికిందంటే..!

రన్యా రావు 27 సార్లు దుబాయ్‌కు వెళ్లారని వెల్లడించారు DRI అధికారులు. ప్రతి సారి ఒకే డ్రెస్‌ తోనే దుబాయ్‌ వెళ్లారని, అందులోనే గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేశారని తెలిపారు. కిలో బంగారం స్మగ్లింగ్‌కు నాలుగు లక్షల రూపాయల చొప్పున ఆమె వసూలు చేసినట్టు చెబుతున్నారు. ప్రతి ట్రిప్‌కు 50 లక్షల రూపాయల వరకు రన్యా రావు సంపాదించినట్టు చెబుతున్నారు. ఇక కస్టడీలో ఎలాంటి విషయాలు రన్యారావు చెబుతారన్నదీ సంచలనంగా మారింది.

Hyderabad: హైటెక్ సిటీ నుంచి అమెరికా పౌరులకు వల.. కాల్ సెంటర్ తో విదేశీయుల బ్యాంక్ ఖాతా హ్యాక్

Hyderabad: హైటెక్ సిటీ నుంచి అమెరికా పౌరులకు వల.. కాల్ సెంటర్ తో విదేశీయుల బ్యాంక్ ఖాతా హ్యాక్

ఎక్కడో విదేశాల్లో ఉన్నవారిని సైతం మోసగించి హైదరాబాద్ నుంచి ఆన్లైన్లో వారి దగ్గర డబ్బులు కాజేస్తున్నారు. హైదరాబాద్ లో వెలుగు చూసిన ఫేక్ కాల్ సెంటర్ బాగోతాన్ని సైబర్ సెక్యూరిటీ పోలీసుల బట్టబయలు చేశారు. ఏకంగా 63 మందిని ఈ కేసులో అరెస్టు చేశారు. పేపాల్ అనే లావాదేవీల సంస్థకు సంబంధించిన కాల్ సెంటర్ గా చెప్పుకుంటూ యూఎస్ సిటిజెన్స్ ను మోసం చేస్తున్న కాల్ సెంటర్ ను సైబర్ సెక్యూరిటీ పోలీసులు క్లోజ్ చేయించారు.