AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Saatha

Vijay Saatha

Crime Bureau Chief - TV9 Telugu

vijaykumar.satha@tv9.com

విజయ్ సాతా, టీవీ 9 క్రైమ్ బ్యూరో చీఫ్‌గా దీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. 15 ఏళ్లకుపైగా క్రైమ్ జర్నలిజంలో తన ప్రయాణం కొనసాగిస్తూ అనేక సంఘటనలను కవర్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో విజయ్ సాతా మొదటి ప్లేస్ లో ఉంటారు అనడానికి అయన చేసిన సెన్సేషనల్ స్టోరీలే ఉదాహరణ.

దేశాన్ని వణికించిన నిర్భయ సంఘటన నుండి గోవాలో డ్రగ్ మాఫియా పై స్ట్రింగ్ ఆపరేషన్ వరకు, అంతే కాకుండా అనేక కుంభకోణాలు, నేరాలు, చీకటి కోణాలు వెలుగు లోకి తెచ్చి ఎన్నో సంచలనాలు సృష్టించారు. ఎవరూ సాహసించని ప్రాంతాల్లో కూడా రిపోర్టింగ్ చేసి విజయ్ సాతా ధైర్యాన్ని ప్రదర్శించారు. స్వయంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో పర్యటించి మావోయిస్టుల సమాచారం తో పాటు, ఎన్నో ఎన్ కౌంటర్ వార్తలను కవర్ చేశారు. ముఖ్యంగా పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులు, మోస్ట్ వాంటెడ్ నేరస్తులతో చేసిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలతో ఆయన ప్రజలందరిని ఆశ్చర్యపరిచారు.

గ్రౌండ్ రిపోర్టింగ్ చేయడమే కాకుండా, సమాజం లో కొత్త నేరాలను గుర్తించి ప్రజలను అవగాహన పరిచే కథనాలు అందించడంలో ఆయన ప్రత్యేకం. అయన అందించే డిజిటల్ కథనాలు సరికొత్త స్టైల్ లో ఉండటమే కాకుండా, మీ రోజూ వారి జీవనంలో మీకు ఉపయోగపడే ఎన్నో విషయాలు అందిస్తాయి.

Read More
Follow On:
Hyderabad: జూబ్లీహిల్స్ మైనర్ల ట్రాప్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. వీడి తెలివితేటలు మామూలుగా లేవుగా!

Hyderabad: జూబ్లీహిల్స్ మైనర్ల ట్రాప్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. వీడి తెలివితేటలు మామూలుగా లేవుగా!

జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికలను టార్గెట్ చేసి, ట్రాప్ చేసిన కేసులో ప్రధాన నిందితుడు అర్జున్ కోడూరి సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకున్నట్టు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మైనర్ అమ్మాయిలను వలలో వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు TV9 చేతికి అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌కు సంబంధించిన కీలక వివరాలు చిక్కాయి..

Andhra News: దేశంలోనే ఆ కేసుల్లో ఏపీ టాప్‌లో ఉంది.. NCRB నివేదికలో షాకింగ్ నిజాలు

Andhra News: దేశంలోనే ఆ కేసుల్లో ఏపీ టాప్‌లో ఉంది.. NCRB నివేదికలో షాకింగ్ నిజాలు

ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఫేక్ ప్రచారం ఆందోళన కలిగించే స్థాయికి చేరిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2024 నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా నమోదైన ఫేక్ న్యూస్ కేసుల్లో దాదాపు 40 శాతం కేసులు ఏపీలోనే నమోదవడం సంచలనంగా మారింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ఫేక్ ప్రచారం విపరీతంగా పెరిగిందని NCRB స్పష్టం చేసింది.

బాధితులకు రూ. 32,600 కోట్లు తిరిగిచ్చిన ఈడీ

బాధితులకు రూ. 32,600 కోట్లు తిరిగిచ్చిన ఈడీ

దేశవ్యాప్తంగా ఆర్థిక మోసాలకు గురైన బాధితులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ భారీ ఊరటనిచ్చింది. రికార్డు స్థాయిలో రూ.32,600 కోట్లకు పైగా విలువైన ఆస్తులను తిరిగి అప్పగిస్తూ చరిత్ర సృష్టించింది. మనీలాండరింగ్ కేసుల్లో జప్తు చేసిన ఆస్తులను బ్యాంకులు, పెట్టుబడిదారులకు వేగంగా బదిలీ చేస్తూ నమ్మకం పెంచుతోంది.

ముగిసిన నక్సల్స్ వేట.. గ్రేహౌండ్స్ కమెండోలకు కొత్త బాధ్యతలు.. పోలీస్ కొత్త వ్యూహం ఇదేనా!

ముగిసిన నక్సల్స్ వేట.. గ్రేహౌండ్స్ కమెండోలకు కొత్త బాధ్యతలు.. పోలీస్ కొత్త వ్యూహం ఇదేనా!

తెలంగాణలో మావోయిస్టుల ప్రాబల్యం గణనీయంగా తగ్గడంతో, రాష్ట్ర పోలీస్ శాఖ తన వ్యూహాలను మారుస్తోంది. ఒకప్పుడు మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పనిచేసిన గ్రేహౌండ్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) విభాగాల్లో భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. రాష్ట్రం మావోయిస్టు రహితంగా మారుతున్న తరుణంలో, ఈ విభాగాల్లోని నిపుణులైన సిబ్బందిని ఇతర కీలక విభాగాలకు మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీ లిక్కర్ స్కామ్‌లో విస్తుపోయే వాస్తవాలు.. మద్యం మాఫియా మైండ్ బ్లాక్.. రంగంలోకి ఐటీ!

ఏపీ లిక్కర్ స్కామ్‌లో విస్తుపోయే వాస్తవాలు.. మద్యం మాఫియా మైండ్ బ్లాక్.. రంగంలోకి ఐటీ!

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు, ఈడీ (ED), ఎస్‌ఎఫ్‌ఐఓ (SFIO) విచారణల తర్వాత ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ (IT) రంగంలోకి దిగడంతో ప్రకంపనలు మొదలయ్యాయి. భారీ స్థాయిలో పన్ను ఎగవేత, నగదు అక్రమ మళ్లింపు జరిగిందన్న పక్కా సమాచారంతో అధికారులు లోతైన విచారణ ప్రారంభించారు.

Road Accidents: ORR మృత్యుఘోష.. మూడేళ్లలో ఔటర్‌పై భారీగా పెరిగిన రోడ్డు ప్రమాదాలు..!

Road Accidents: ORR మృత్యుఘోష.. మూడేళ్లలో ఔటర్‌పై భారీగా పెరిగిన రోడ్డు ప్రమాదాలు..!

ORR Road Accidents: ఔటర్ రింగ్ రోడ్డు లు యమలోకానికి దారులుగా మారుతున్నాయి. ఎన్ని అవగాహన లు కల్పించినా ఈ దారుల్లో ప్రమాదం ఆపడం అంత ఈజీ కానే కాదంటున్నారు అధికారులు. కిలోమీటర్ల పొడవు, రైలింగ్, క్లియర్ గా లేన్ ల ఏర్పాటు, స్పీడ్ గన్ లు ఉన్నప్పటికీ వందల మంది ఈ ORR లలో ప్రాణాలు కోల్పోతున్నారు..

Groundwater Crisis: భూమిలోకి కుంగుతున్న భారీ నగరాలు.. కారణం ఇదే..!

Groundwater Crisis: భూమిలోకి కుంగుతున్న భారీ నగరాలు.. కారణం ఇదే..!

Groundwater Crisis: పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల భూమి పొరల్లో వస్తున్న మార్పులు మానవాళికి గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేస్తే భవిష్యత్తులో ఇలాంటి కుంగుబాట్లు మరిన్ని నగరాల్లో సంభవించే ప్రమాదం ఉంది. తక్షణమే మేల్కొని తగిన..

మన MPలు, MLAలు, సర్పంచ్‌లు, MPTCల నెల జీతం ఎంతో తెలుసా..?

మన MPలు, MLAలు, సర్పంచ్‌లు, MPTCల నెల జీతం ఎంతో తెలుసా..?

బేసిక్ జీతం కంటే అలవెన్సులే ఎక్కువగా అందుకుంటున్న ప్రజాప్రతినిధుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో ఎమ్మెల్యేలకు నెలకు రూ.20 వేలే బేసిక్ జీతం ఉన్నా, వివిధ భత్యాలతో మొత్తం ఆదాయం రూ.2.50 లక్షలకు చేరుతోంది. ఎంపీలు కూడా జీతం కంటే అలవెన్సుల ద్వారానే ఎక్కువగా పొందుతున్నారు.

పచ్చని అడవుల్లో కుప్పలు తెప్పలుగా గోల్డ్ కాయిన్స్.. ఇంతకూ అక్కడికెలా వచ్చాయంటే?

పచ్చని అడవుల్లో కుప్పలు తెప్పలుగా గోల్డ్ కాయిన్స్.. ఇంతకూ అక్కడికెలా వచ్చాయంటే?

ఎప్పుడూ పచ్చని అడవల మధ్య తిరిగే మావోయిస్టులకు అన్ని ఆయుధాలు కొనుగోలు చేసేందుకు, వాళ్ల మనుగడకు డబ్బులు ఎలా వస్తాయనేది చాలా మందికి ఉన్న ఓ డౌట్.. కానీ తాజాగా పోలీసులు జరిపిన ఓ ఆపరేషన్‌లో ఈ విషయం బట్టబయలైంది. మావోయిస్టుల ఆర్థిక వనరులపై సంచలన వివరాలు బయటపడ్డాయి. వీరు కాంట్రాక్టర్ల ద్వారా నిధులను సేకరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

Telangana: మృతుడి వేలిముద్రతో ఫోన్ అన్‌లాక్.. ఓఆర్‌ఆర్ ప్రమాద బాధితులను పోలీసులు ఎలా గుర్తించారంటే..?

Telangana: మృతుడి వేలిముద్రతో ఫోన్ అన్‌లాక్.. ఓఆర్‌ఆర్ ప్రమాద బాధితులను పోలీసులు ఎలా గుర్తించారంటే..?

దేవుడి దర్శనం ముగించుకుని సంతోషంగా ఇంటికి వస్తున్న ఆ కుటుంబాన్ని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ధాటికి ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అయితే మృతదేహాల వద్ద ఎలాంటి ఆధారాలు లేని స్థితిలో.. పోలీసులు ఒక వేలిముద్ర సాయంతో మృతుల వివరాలను ఎలా ఛేదించారు? టెక్నాలజీని ఉపయోగించి కుటుంబ సభ్యులను ఎలా గుర్తించారు? అనేది తెలుసుకుందాం..

ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారికి గుడ్‌న్యూస్.. ఇక పార్కింగ్ కోసం వెయిట్ చేయొద్దు.. జస్ట్‌ ఇలా చేయండి

ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారికి గుడ్‌న్యూస్.. ఇక పార్కింగ్ కోసం వెయిట్ చేయొద్దు.. జస్ట్‌ ఇలా చేయండి

వాహనదారులకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం యాజమాన్యం సూపర్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎయిర్‌పోర్టుకు వచ్చే ప్రయాణికులకు మరో అనుకూలమైన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రయాణికులు ఇంటి నుంచే తమ పార్కింగ్ స్లాట్‌ను ముందుగానే బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. పార్క్ ఎన్ ఫ్లై పేరిట ఈ నూతన సేవను విమానాశ్రయం యాజమాన్యం ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

మరోసారి బయటపడ్డ సుకేష్ గుప్తా ‘గోల్డ్ మాల్’.. ఏకంగా నిజాం నగలకే ఎసరు..!

మరోసారి బయటపడ్డ సుకేష్ గుప్తా ‘గోల్డ్ మాల్’.. ఏకంగా నిజాం నగలకే ఎసరు..!

హైదరాబాద్ రాజసం, నిజాం నవాబుల కాలం నాటి అపారమైన సంపద చుట్టూ అల్లుకున్న ఒక భారీ మోసం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నిజాం నగల పేరిట ఏకంగా రూ. 50.8 కోట్ల మేర సాగిన ఈ చీటింగ్ ఉదంతం భాగ్యనగరంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, ఇప్పటికే పలు వివాదాల్లో ఉన్న సుకేష్ గుప్తా పేరు మరోసారి తెరపైకి రావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.