AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Saatha

Vijay Saatha

Crime Bureau Chief - TV9 Telugu

vijaykumar.satha@tv9.com

విజయ్ సాతా, టీవీ 9 క్రైమ్ బ్యూరో చీఫ్‌గా దీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. 15 ఏళ్లకుపైగా క్రైమ్ జర్నలిజంలో తన ప్రయాణం కొనసాగిస్తూ అనేక సంఘటనలను కవర్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో విజయ్ సాతా మొదటి ప్లేస్ లో ఉంటారు అనడానికి అయన చేసిన సెన్సేషనల్ స్టోరీలే ఉదాహరణ.

దేశాన్ని వణికించిన నిర్భయ సంఘటన నుండి గోవాలో డ్రగ్ మాఫియా పై స్ట్రింగ్ ఆపరేషన్ వరకు, అంతే కాకుండా అనేక కుంభకోణాలు, నేరాలు, చీకటి కోణాలు వెలుగు లోకి తెచ్చి ఎన్నో సంచలనాలు సృష్టించారు. ఎవరూ సాహసించని ప్రాంతాల్లో కూడా రిపోర్టింగ్ చేసి విజయ్ సాతా ధైర్యాన్ని ప్రదర్శించారు. స్వయంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో పర్యటించి మావోయిస్టుల సమాచారం తో పాటు, ఎన్నో ఎన్ కౌంటర్ వార్తలను కవర్ చేశారు. ముఖ్యంగా పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులు, మోస్ట్ వాంటెడ్ నేరస్తులతో చేసిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలతో ఆయన ప్రజలందరిని ఆశ్చర్యపరిచారు.

గ్రౌండ్ రిపోర్టింగ్ చేయడమే కాకుండా, సమాజం లో కొత్త నేరాలను గుర్తించి ప్రజలను అవగాహన పరిచే కథనాలు అందించడంలో ఆయన ప్రత్యేకం. అయన అందించే డిజిటల్ కథనాలు సరికొత్త స్టైల్ లో ఉండటమే కాకుండా, మీ రోజూ వారి జీవనంలో మీకు ఉపయోగపడే ఎన్నో విషయాలు అందిస్తాయి.

Read More
Follow On:
తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక సమీక్ష.. నేడు కాంగ్రెస్ ముఖ్య నేతలతో మీనాక్షి నటరాజన్ జూమ్ సమావేశం

తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక సమీక్ష.. నేడు కాంగ్రెస్ ముఖ్య నేతలతో మీనాక్షి నటరాజన్ జూమ్ సమావేశం

తెలంగాణ కాంగ్రెస్‌లో పార్టీ కార్యక్రమాల అమలు, సంస్థాగత వ్యవహారాలపై కీలక సమీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, పీఏసీ సభ్యులు, ముఖ్య నేతలతో జూమ్ సమావేశం నిర్వహించనున్నారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమం అమలు, నాయకుల పనితీరు, పార్టీ సమన్వయం, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

వరంగల్ రాజకీయాల్లో మరోసారి రగడ.. కడియం టార్గెట్‌గా కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..!

వరంగల్ రాజకీయాల్లో మరోసారి రగడ.. కడియం టార్గెట్‌గా కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..!

మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కడియం శ్రీహరి తనను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. తన శాఖకు సంబంధించిన అంశాలపై జరుగుతున్న వివాదంపై స్పందించిన మంత్రి, ప్రోటోకాల్ ఉల్లంఘనల అంశాన్నే తాను ప్రస్తావించానని స్పష్టం చేశారు.

Business Idea: లో ఇన్వెస్ట్‌మెంట్.. హై ఫ్రాఫిట్.. మార్కెట్లో ఎప్పటికీ డిమాండ్ తగ్గని 5 బిజినెస్‌లు ఇవే!

Business Idea: లో ఇన్వెస్ట్‌మెంట్.. హై ఫ్రాఫిట్.. మార్కెట్లో ఎప్పటికీ డిమాండ్ తగ్గని 5 బిజినెస్‌లు ఇవే!

ఉద్యోగాల కంటే సొంత వ్యాపారాల వైపు యువత ఎక్కువగా ఆసక్తి చూపుతున్న కాలమిది. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించి స్థిరమైన ఆదాయం వచ్చే తయారీ రంగం వ్యాపారాలకు మంచి డిమాండ్ పెరుగుతోంది. రోజువారీ వినియోగ వస్తువులు, ఈ-కామర్స్ విస్తరణ, ఫుడ్ డెలివరీ సేవలు, నిర్మాణ రంగం అభివృద్ధి వంటి అంశాలు ఈ వ్యాపారాలకు ఊతమిస్తున్నాయి. సరైన ప్రణాళిక, నాణ్యత, మార్కెటింగ్ ఉంటే ఈ బిజినెస్‌ల ద్వారా నెలకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని వ్యాపార నిపుణులు చెబుతున్నారు.

Alluri Sitharama Raju District: పాస్టర్‌ ఘాతుకం..గిరిజన బాలికకు వాతలు

Alluri Sitharama Raju District: పాస్టర్‌ ఘాతుకం..గిరిజన బాలికకు వాతలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో దొంగతనం అనుమానంతో ఎనిమిదేళ్ల గిరిజన బాలికను ఇంట్లో నిర్బంధించి వేడి అట్లకాడతో కాల్చిన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. రూ.10 వేల నగదు పోయిందన్న అనుమానంతో బాలికను హింసించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులపై దర్యాప్తు ముమ్మరం చేశారు.

తీగలాగితే డొంక కదలడం అంటే ఇదే… ఒక్క బైక్‌ కోసం వెళితే ఏకంగా

తీగలాగితే డొంక కదలడం అంటే ఇదే… ఒక్క బైక్‌ కోసం వెళితే ఏకంగా

కర్నూలు జిల్లా ఆదోనిలో ఒక బైక్ చోరీ ఫిర్యాదుతో ప్రారంభమైన పోలీసుల విచారణ భారీ టూ వీలర్ దొంగతనాల ముఠాను బయటపెట్టింది. నిందితుడు మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా 35 బైకులు దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. అతడి సమాచారం మేరకు పోలీసులు వివిధ ప్రాంతాల్లో విక్రయించిన వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Packaged Food: ప్యాకేజ్డ్ ఫుడ్స్ వెనుక అసలు నిజాలు.. కొనే ముందు ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి

Packaged Food: ప్యాకేజ్డ్ ఫుడ్స్ వెనుక అసలు నిజాలు.. కొనే ముందు ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి

ఈ ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది ప్యాకేజ్డ్ ఫుడ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వాటిని కొనే ముందు ఆహార లేబుల్‌ను తప్పక చదవాలని... పోషక విలువలు, చక్కెర, ఉప్పు, కొవ్వు శాతం కచ్చితంగా తెలుసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే సమస్యలను కొని తెచ్చుకున్నట్టేనని చెబుతున్నారు.

Dr Jagannath Nayak: డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం.

Dr Jagannath Nayak: డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం.

భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీఓ)లో కీలక నియామకం చోటుచేసుకుంది. డీఆర్‌డీఓ డైరెక్టర్ జనరల్ గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జగన్నాథ్ నాయక్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. పదవీ విరమణ చేసిన యు. రాజా బాబు స్థానంలో నియమితులైన ఈయన, బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం డీఆర్‌డీఓకు చెందిన సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (CHESS) డైరెక్టర్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ విధులు నిర్వహిస్తున్నారు.

Hyderabad: కబ్జాదారులపై ఉక్కుపాదం.. 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..

Hyderabad: కబ్జాదారులపై ఉక్కుపాదం.. 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..

హైడ్రా అంటే కేవలం ఆక్రమలను కూల్చడం మాత్రమే కాదని.. అక్రమార్కులను నుంచి ప్రభుత్వ భూములను రక్షించడంలోనూ అండగా నిలుస్తోంది. తాజాగా హైదరాబాద్ శివారులోని బోడుప్పల్, మల్కాజిగిరి పరిధిలో పార్కు స్థలాలను ఆక్రమించేందుకు ప్రయత్నించిన కబ్జా కోరుల నుంచి సుమారు 1166 గజాల స్థలాన్ని కాపాడింది.

Amrabad Tigers: అమ్రాబాద్‌లో రికార్డు స్థాయిలో పులుల గుర్తింపు.. అడ పులులదే రాజ్యం.. 90 రోజుల పాటు అటవీ ప్రాంతం మూసివేత

Amrabad Tigers: అమ్రాబాద్‌లో రికార్డు స్థాయిలో పులుల గుర్తింపు.. అడ పులులదే రాజ్యం.. 90 రోజుల పాటు అటవీ ప్రాంతం మూసివేత

Amrabad Tigers: అక్కడ రికార్డు స్థాయిలో పులుల గుర్తింపు.. ఆడ పులులదే రాజ్యం. అమ్రాబాద్‌లో రికార్డు స్థాయిలో పులులను గుర్తించారు అటవీ శాఖ అధికారులు. కానీ 90 రోజుల పాటు అటవీ ప్రాంతాన్ని మూసివేయనున్నారు. గత నవంబర్‌ 2025 నుంచి జూన్‌..

Hyderabad: స్నాప్‌లో పులిహోర కలిపి అమ్మాయిలను రూమ్‌కి పిలుస్తాడు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్..

Hyderabad: స్నాప్‌లో పులిహోర కలిపి అమ్మాయిలను రూమ్‌కి పిలుస్తాడు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్..

సోషల్ మీడియా ద్వారా మహిళలతో పరిచయం పెంచుకుని, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి ..

Telangana: తెలంగాణలో వీఐపీల సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం.. 100మందికి పైగా ప్రముఖులకు..

Telangana: తెలంగాణలో వీఐపీల సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం.. 100మందికి పైగా ప్రముఖులకు..

తెలంగాణలో ప్రముఖుల భద్రతపై ఇంటెలిజెన్స్ విభాగం అత్యంత సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గతంతో పోలిస్తే నక్సల్స్, తీవ్రవాద కార్యకలాపాల ప్రభావం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో.. వీఐపీల సెక్యూరిటీని తగ్గించింది. వంద మందికి పైగా ప్రముఖుల గన్‌మెన్లను, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తొలగిస్తూ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

కేతన్ కేస్ లో ప్రజాగ్రహం.. అమ్మాయి, ఆమె ప్రియుడిని శిక్షించాలంటూ భారీ క్యాండిల్ ర్యాలీ!

కేతన్ కేస్ లో ప్రజాగ్రహం.. అమ్మాయి, ఆమె ప్రియుడిని శిక్షించాలంటూ భారీ క్యాండిల్ ర్యాలీ!

పుణెలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ మరణంపై న్యాయం చేయాలంటూ ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. నిందితులైన సదరు అమ్మాయిని, ఆమె ప్రియుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో బాధితుడి కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. జస్టిస్ ఫర్ కేతన్ ప్లకార్డులతో శాంతియుతంగా నిరసన తెలుపుతూ, కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను కోరారు. ఇటు సోషల్ మీడియాలోనూ #JusticeForKetan హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.