విజయ్ సాతా, టీవీ 9 క్రైమ్ బ్యూరో చీఫ్గా దీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. 15 ఏళ్లకుపైగా క్రైమ్ జర్నలిజంలో తన ప్రయాణం కొనసాగిస్తూ అనేక సంఘటనలను కవర్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో విజయ్ సాతా మొదటి ప్లేస్ లో ఉంటారు అనడానికి అయన చేసిన సెన్సేషనల్ స్టోరీలే ఉదాహరణ.
దేశాన్ని వణికించిన నిర్భయ సంఘటన నుండి గోవాలో డ్రగ్ మాఫియా పై స్ట్రింగ్ ఆపరేషన్ వరకు, అంతే కాకుండా అనేక కుంభకోణాలు, నేరాలు, చీకటి కోణాలు వెలుగు లోకి తెచ్చి ఎన్నో సంచలనాలు సృష్టించారు. ఎవరూ సాహసించని ప్రాంతాల్లో కూడా రిపోర్టింగ్ చేసి విజయ్ సాతా ధైర్యాన్ని ప్రదర్శించారు. స్వయంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో పర్యటించి మావోయిస్టుల సమాచారం తో పాటు, ఎన్నో ఎన్ కౌంటర్ వార్తలను కవర్ చేశారు. ముఖ్యంగా పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులు, మోస్ట్ వాంటెడ్ నేరస్తులతో చేసిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలతో ఆయన ప్రజలందరిని ఆశ్చర్యపరిచారు.
గ్రౌండ్ రిపోర్టింగ్ చేయడమే కాకుండా, సమాజం లో కొత్త నేరాలను గుర్తించి ప్రజలను అవగాహన పరిచే కథనాలు అందించడంలో ఆయన ప్రత్యేకం. అయన అందించే డిజిటల్ కథనాలు సరికొత్త స్టైల్ లో ఉండటమే కాకుండా, మీ రోజూ వారి జీవనంలో మీకు ఉపయోగపడే ఎన్నో విషయాలు అందిస్తాయి.
Telangana: వాళ్ల పేరిట కోట్ల ఆస్తులు.. ఈడీ దర్యాప్తుతో నయూం కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు.. ఛార్జ్షీట్లో 10మంది..
తెలంగాణలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన గ్యాంగ్స్టర్ నయీం కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. నయీం మరణించిన ఏళ్ల తర్వాత కూడా ఆయన అక్రమ సామ్రాజ్యంపై ఈడీ తన పట్టు బిగిస్తోంది. తాజాగా పదిమంది నిందితులపై ఈడీ చార్జ్షీట్ దాఖలు చేయడంతో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.ఈడీ సేకరించిన పక్కా ఆధారాలు ఇప్పుడు నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
- Vijay Saatha
- Updated on: Jan 29, 2026
- 8:01 pm
Telangana: తెలంగాణలో మూగజీవాల మారణకాండ.. 100 కుక్కలను చంపి పూడ్చిపెట్టిన..
మనిషికి నమ్మకమైన నేస్తాలుగా ఉండే మూగజీవాల పట్ల ఇంతటి క్రూరత్వమా? అనిపించేలా రాష్ట్రంలో దారుణమైన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. నాగర్కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో వీధి కుక్కలను ఊచకోత కోసిన వైనం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఒక్క నాగర్కర్నూల్లోనే దాదాపు 100 కుక్కలను విష ప్రయోగంతో హతమార్చడం, మరోచోట 50కి పైగా కుక్కలను అక్రమంగా తరలించడం జంతు ప్రేమికులను కలచివేస్తోంది.
- Vijay Saatha
- Updated on: Jan 29, 2026
- 7:05 pm
Hyderabad: చిన్నారులపై కుక్కలు దాడులు చేస్తుంటే.. మీరేం చేస్తున్నారు?.. అధికారులపై HRC సిరియస్
ఖైరతాబాద్లో చిన్నారిపై వీధి కుక్క దాడి ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. ఘటనపై సుమోటోగా విచారణ చేపట్టింది. పిల్లల భద్రత, జీవించే హక్కును కాపాడాలని పేర్కొంది. వీధి కుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తు ప్రణాళికలపై సమగ్ర నివేదిక సమర్పించాలని GHMCకి ఆదేశాలు జారీ చేసింది. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
- Vijay Saatha
- Updated on: Jan 28, 2026
- 7:16 pm
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ఏరియాల్లో మంచినీళ్లు తాగే ముందు జాగ్రత్త.. ఎందుకంటే..
హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో నీరు తాగి చాలామంది ప్రజలు అస్వస్థత బారిన పడుతున్నారు. ముఖ్యంగా నాగోల్ పరిధిలోని శ్రీలక్ష్మీనగర్, శ్రీనివాస్నగర్, విశాలాంధ్ర కాలనీ ప్రాంతాల్లో కలుషిత తాగునీరు సరఫరా అవుతుందని.. పలువురు అనారోగ్యం బారిన పడ్డారని.. స్థానికులు చెప్పడం కలకలం రేపుతుంది.
- Vijay Saatha
- Updated on: Jan 28, 2026
- 5:39 pm
వనదేవతల జాతరలో చిన్నారులు, దివ్యాంగులకు పోలీస్ ‘రిస్ట్ బ్యాండ్లు’.. ఎందుకో తెలుసా..?
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర ప్రసిద్ధి చెందింది. మహా జాతరకు వచ్చే భక్తుల భద్రతకు తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, దివ్యాంగుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పిల్లలు, దివ్యాంగులు తప్పిపోతే వారి ఆచూకీని తక్షణమే కనిపెట్టేందుకు కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టారు.
- Vijay Saatha
- Updated on: Jan 24, 2026
- 9:11 pm
Hyderabad: రోడ్లపై కంటికి కనిపించని మృత్యువు..! అలర్ట్గా లేకపోతే అంతే సంగతులు!
సంక్రాంతి వచ్చిందంటే చాలా జనాల ప్రాణాలు తీసేందుకు కాచుకు కూర్చుంటుంది చైనా మాంజా. ఇక ఈసారైతే సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే రాష్ట్రంలో వీటి దాడులు మొదలయ్యాయి. ఆకాశంలో ఎగిరే గాలిపటం ఆనంద హేతువైతే, అదే రోడ్డుపై పడే మాంజా దారం మానవుల మృత్యవకు కారణం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ కంటికి కనిపించని మృత్యువు పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
- Vijay Saatha
- Updated on: Jan 2, 2026
- 8:39 pm
Hyderabad: సీపీ సజ్జనార్ పర్సనల్, ప్రొఫెషనల్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటో తెలుసా..?
నూతన సంవత్సరం సందర్భంగా తన ప్రొఫెషనల్, పర్సనల్ సంకల్పాలను ప్రజలతో పంచుకున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్… నగరాన్ని మరింత సేఫ్గా తీర్చిదిద్దడమే తన ప్రాధాన్యమని స్పష్టం చేశారు. సైబర్ క్రైమ్పై కఠిన చర్యలు, పోలీస్ సిబ్బంది సంక్షేమం, ఫిట్నెస్పై ఫోకస్తో 2026కి కొత్త కమిట్మెంట్ తీసుకున్నారు.
- Vijay Saatha
- Updated on: Jan 2, 2026
- 4:41 pm
Maoist Surrender: మావోయిస్ట్ పార్టీకి బిగ్షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్!
మావోయిస్టు పార్టీకి మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. మావోయిస్ట్ పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (GLA) చీఫ్గా ఉన్న బరిసె దేవా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోనున్నారు. శనివారం డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో అధికారికంగా లొంగిపోనున్నారు. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమానికి తీవ్ర ఎదురుదెబ్బగా భద్రతా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
- Vijay Saatha
- Updated on: Jan 2, 2026
- 4:25 pm
Telangana: తెలంగాణలో అవినీతి అధికారులు ఆ శాఖల్లోనే అధికం..
తెలంగాణలో అవినీతిపై ఏసీబీ ఉక్కుపాదం మోపుతోంది. ఈ ఏడాది 220కి పైగా కేసులు, 150 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగుల అరెస్టులతో రికార్డు స్థాయి చర్యలు చేపట్టింది. ట్రాప్ కేసుల సంఖ్య పెరగడమే కాదు, కీలక శాఖల్లోని అవినీతి అధికారులపై దాడుల తీవ్రత మరింత పెరిగింది.
- Vijay Saatha
- Updated on: Dec 31, 2025
- 9:12 am
Telangana: మహిళలకు గుడ్ న్యూస్.. ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం.. మిస్ అవ్వకండి..
హైదరాబాద్ మహిళలకు గుడ్ న్యూస్. జనవరి 3న అంబర్పేట్లో ప్రత్యేక డ్రైవర్ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. బైక్, ఈ-ఆటో డ్రైవింగ్లో ఆసక్తి ఉన్న 21-45 ఏళ్ల మహిళలకు ఉచిత శిక్షణ, డ్రైవింగ్ లైసెన్స్ సహాయం, 100శాతం ఉద్యోగ హామీ వంటివి కల్పించనున్నారు.
- Vijay Saatha
- Updated on: Dec 29, 2025
- 5:33 pm
Telangana: ఏంది బై.. ఆయన ఏదో అన్నాడని.. అమ్మానాన్నలు వదిలేసి పోయినవ్..
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం గోపులారం గ్రామంలో ఓటు వేయలేదని మందలించడంతో మనస్థాపానికి గురైన యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కావలి అనిల్ కుమార్ (25) మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ..
- Vijay Saatha
- Updated on: Dec 25, 2025
- 10:54 am
Hyderabad: సాఫ్ట్వేర్ గర్ల్ ఫ్రెండ్.. బద్మాష్ బాయ్ ఫ్రెండ్.. ఇద్దరు కలిసి ఏం చేశారో తెలుసా..
ఆమె ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి.. కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్న ఆమె లగ్జరీ జీవనశైలికి అలవాటు పడింది. ఆఫీస్లో వచ్చే సాలరీ సరిపోకపోవడంతో.. అడ్డదారిలో డబ్బు సంపాదనకు ప్లాన్ చేసింది. బాయ్ ఫ్రెండ్తో కలిసి.. డ్రగ్స్ దందా మొదటుపెట్టింది. చివరకు డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు పట్టుపడింది. దీంతో యవతితో పాటు ఆమె భాయ్ ప్రెండ్, మరో ఇద్దరి అరెస్ట్ చేశారు పోలీసులు.
- Vijay Saatha
- Updated on: Dec 24, 2025
- 3:37 pm