విజయ్ సాతా, టీవీ 9 క్రైమ్ బ్యూరో చీఫ్గా దీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. 15 ఏళ్లకుపైగా క్రైమ్ జర్నలిజంలో తన ప్రయాణం కొనసాగిస్తూ అనేక సంఘటనలను కవర్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో విజయ్ సాతా మొదటి ప్లేస్ లో ఉంటారు అనడానికి అయన చేసిన సెన్సేషనల్ స్టోరీలే ఉదాహరణ.
దేశాన్ని వణికించిన నిర్భయ సంఘటన నుండి గోవాలో డ్రగ్ మాఫియా పై స్ట్రింగ్ ఆపరేషన్ వరకు, అంతే కాకుండా అనేక కుంభకోణాలు, నేరాలు, చీకటి కోణాలు వెలుగు లోకి తెచ్చి ఎన్నో సంచలనాలు సృష్టించారు. ఎవరూ సాహసించని ప్రాంతాల్లో కూడా రిపోర్టింగ్ చేసి విజయ్ సాతా ధైర్యాన్ని ప్రదర్శించారు. స్వయంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో పర్యటించి మావోయిస్టుల సమాచారం తో పాటు, ఎన్నో ఎన్ కౌంటర్ వార్తలను కవర్ చేశారు. ముఖ్యంగా పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులు, మోస్ట్ వాంటెడ్ నేరస్తులతో చేసిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలతో ఆయన ప్రజలందరిని ఆశ్చర్యపరిచారు.
గ్రౌండ్ రిపోర్టింగ్ చేయడమే కాకుండా, సమాజం లో కొత్త నేరాలను గుర్తించి ప్రజలను అవగాహన పరిచే కథనాలు అందించడంలో ఆయన ప్రత్యేకం. అయన అందించే డిజిటల్ కథనాలు సరికొత్త స్టైల్ లో ఉండటమే కాకుండా, మీ రోజూ వారి జీవనంలో మీకు ఉపయోగపడే ఎన్నో విషయాలు అందిస్తాయి.
పోలీస్ జాగిలాల పెరేడ్ సందడి.. ఈ ప్రత్యేక బ్రీడ్ త్వరలోనే డిపార్ట్మెంట్లో విధుల్లోకి…
హైదరాబాద్లోని IITA మొయినాబాద్లో 25వ బ్యాచ్ పోలీసు జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. నేర పరిశోధన, శాంతిభద్రతల పరిరక్షణకు 76 కొత్త జాగిలాలు విధుల్లోకి చేరనున్నాయి. ఈ బ్యాచ్లో తెలంగాణ, బీహార్, CISF నుండి కుక్కలు శిక్షణ పొందాయి. పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాల గుర్తింపు, నిందితుల పట్టివేతలో ఇవి కీలకంగా వ్యవహరిస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా నేర నిరోధక చర్యలు మరింత వేగవంతం కానున్నాయి.
- Vijay Saatha
- Updated on: Feb 17, 2026
- 11:11 am
హైదరాబాద్ HCUలో భారీ దొంగతనం బట్టబయలు.. 60 ల్యాప్టాప్లు స్వాధీనం, ముగ్గురు అరెస్ట్..
గచ్చిబౌలి పోలీసులు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లోని సీఆర్ రావు ప్రాంగణం నుండి దొంగిలించబడిన 60 ల్యాప్టాప్ల కేసును ఛేదించారు. ముగ్గురు నిందితులను, వీరిలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు ఉన్నారు, అరెస్టు చేసి, దొంగిలించిన ల్యాప్టాప్లతో పాటు నేరానికి ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన వెంటనే ప్రత్యేక బృందాలు సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకుని జ్యుడీషియల్ రిమాండ్కు తరలించాయి.
- Vijay Saatha
- Updated on: Feb 17, 2026
- 10:50 am
Watch: వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
హైదరాబాద్లో వాహన చోరీలు విపరీతంగా పెరుగుతున్నాయి. దొంగలు రోజురోజుకు మరింత అప్డేట్ అవుతున్నారు. తాజాగా బాలాపూర్ ఎక్స్ రోడ్ వద్ద కేవలం 15 నుండి 20 సెకన్లలో ఒక ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
- Vijay Saatha
- Updated on: Jan 31, 2026
- 6:23 pm
Medaram Jatara 2026: మేడారంలో వెలసిన సెల్ఫోన్ ఛార్జింగ్ పాయింట్లు
మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం సెల్ఫోన్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రయాణంలో ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఇబ్బంది పడే భక్తులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంది. కేవలం 50 రూపాయలకే ఫోన్కు 100% ఛార్జింగ్ అందిస్తున్నారు. ఇది భక్తులకు, చిన్న వ్యాపారులకు కూడా లాభదాయకంగా మారింది.
- Vijay Saatha
- Updated on: Jan 31, 2026
- 11:44 am
మేడారం జాతరలో డిజిపి పర్యటన.. గవర్నర్, మంత్రి సీతక్క లతో దర్శనం
మేడారం జాతరలో భద్రతా ఏర్పాట్లను డీజీపీ స్వయంగా పర్యవేక్షించారు. 'మేడారం 2.0' కింద AI డ్రోన్లు, ఫేషియల్ రికగ్నిషన్, QR కోడ్ రిస్ట్ బ్యాండ్స్ వంటి అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. 13 వేల మంది పోలీసులు, 450 సీసీటీవీలు, 37 పార్కింగ్ ప్రదేశాలు, 3800 ఆర్టీసీ బస్సులతో భక్తుల భద్రత, సౌకర్యాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది జాతర చరిత్రలో విప్లవాత్మక మార్పు.
- Vijay Saatha
- Updated on: Jan 30, 2026
- 10:19 pm
Hyderabad: పార్క్ చేసిన 15 సెకనల్లోనే స్కూటీ చోరీ.. బైక్ కొన్న 3వ రోజే..
షాప్ ముందు పార్క్ చేసిన కొత్త ఆక్టివా కేవలం 15–20 సెకన్లలోనే మాయమైంది. బాలాపూర్ ఎక్స్రోడ్లో జరిగిన ఈ దొంగతన ఘటనలో, మద్యం మత్తులో ఉన్న దొంగ వాహనం ఎత్తుకెళ్లినట్లు సీసీ ఫుటేజ్లో తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
- Vijay Saatha
- Updated on: Jan 30, 2026
- 4:55 pm
Hyderabad: కూకట్పల్లిలో వీధి.. వీధి జల్లెడ పడుతున్న పోలీసులు.. ఎందుకంటే..?
నిషేధిత చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై కూకట్పల్లి జోన్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన చైనా మాంజాపై ఉక్కుపాదం మోపుతూ 56 షాపులపై తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. ..
- Vijay Saatha
- Updated on: Jan 30, 2026
- 3:20 pm
Injection Crimes: ప్రాణాలు నిలిపేందుకు వాడే సిరంజీలతో ఇలా చేయడం ఇప్పుడు కొత్త ట్రెండ్…
ప్రాణాలు కాపాడాల్సిన సిరంజీలు నేడు నేరస్తుల చేతుల్లో ప్రాణాలు తీసే ఆయుధాలుగా మారుతున్నాయి. ఆధారాలు దొరకవన్న భ్రమతో ఇంజక్షన్ల ద్వారా హత్యలు, మత్తు నేరాలు పెరుగుతున్నాయన్న ఆందోళనకర వాస్తవాన్ని వికారాబాద్, కర్నూలు, హైదరాబాద్ ఘటనలు బట్టబయలు చేస్తున్నాయి. పూర్తి వివరాలు కథనం లోపల...
- Vijay Saatha
- Updated on: Jan 30, 2026
- 3:09 pm
Medaram Jatara 2026: తప్పిపోయిన ఇద్దరు చిన్నారుల ఆచూకీ గంటల్లోనే లభ్యం.. దానితోనే సాధ్యం
మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర–2026 సందర్భంగా చిన్నారుల భద్రత కోసం తెలంగాణ పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్ వ్యవస్థ సత్ఫలితాలను ఇస్తోంది. ఈ విధానంతో ఇప్పటికే తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను గంటల వ్యవధిలోనే గుర్తించి, వారి కుటుంబ సభ్యుల వద్దకు సురక్షితంగా చేర్చారు.
- Vijay Saatha
- Updated on: Jan 30, 2026
- 2:32 pm
Telangana: వాళ్ల పేరిట కోట్ల ఆస్తులు.. ఈడీ దర్యాప్తుతో నయూం కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు.. ఛార్జ్షీట్లో 10మంది..
తెలంగాణలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన గ్యాంగ్స్టర్ నయీం కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. నయీం మరణించిన ఏళ్ల తర్వాత కూడా ఆయన అక్రమ సామ్రాజ్యంపై ఈడీ తన పట్టు బిగిస్తోంది. తాజాగా పదిమంది నిందితులపై ఈడీ చార్జ్షీట్ దాఖలు చేయడంతో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.ఈడీ సేకరించిన పక్కా ఆధారాలు ఇప్పుడు నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
- Vijay Saatha
- Updated on: Jan 29, 2026
- 8:01 pm
Telangana: తెలంగాణలో మూగజీవాల మారణకాండ.. 100 కుక్కలను చంపి పూడ్చిపెట్టిన..
మనిషికి నమ్మకమైన నేస్తాలుగా ఉండే మూగజీవాల పట్ల ఇంతటి క్రూరత్వమా? అనిపించేలా రాష్ట్రంలో దారుణమైన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. నాగర్కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో వీధి కుక్కలను ఊచకోత కోసిన వైనం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఒక్క నాగర్కర్నూల్లోనే దాదాపు 100 కుక్కలను విష ప్రయోగంతో హతమార్చడం, మరోచోట 50కి పైగా కుక్కలను అక్రమంగా తరలించడం జంతు ప్రేమికులను కలచివేస్తోంది.
- Vijay Saatha
- Updated on: Jan 29, 2026
- 7:05 pm
Hyderabad: చిన్నారులపై కుక్కలు దాడులు చేస్తుంటే.. మీరేం చేస్తున్నారు?.. అధికారులపై HRC సిరియస్
ఖైరతాబాద్లో చిన్నారిపై వీధి కుక్క దాడి ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. ఘటనపై సుమోటోగా విచారణ చేపట్టింది. పిల్లల భద్రత, జీవించే హక్కును కాపాడాలని పేర్కొంది. వీధి కుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తు ప్రణాళికలపై సమగ్ర నివేదిక సమర్పించాలని GHMCకి ఆదేశాలు జారీ చేసింది. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
- Vijay Saatha
- Updated on: Jan 28, 2026
- 7:16 pm