AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Saatha

Vijay Saatha

Crime Bureau Chief - TV9 Telugu

vijaykumar.satha@tv9.com

విజయ్ సాతా, టీవీ 9 క్రైమ్ బ్యూరో చీఫ్‌గా దీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. 15 ఏళ్లకుపైగా క్రైమ్ జర్నలిజంలో తన ప్రయాణం కొనసాగిస్తూ అనేక సంఘటనలను కవర్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో విజయ్ సాతా మొదటి ప్లేస్ లో ఉంటారు అనడానికి అయన చేసిన సెన్సేషనల్ స్టోరీలే ఉదాహరణ.

దేశాన్ని వణికించిన నిర్భయ సంఘటన నుండి గోవాలో డ్రగ్ మాఫియా పై స్ట్రింగ్ ఆపరేషన్ వరకు, అంతే కాకుండా అనేక కుంభకోణాలు, నేరాలు, చీకటి కోణాలు వెలుగు లోకి తెచ్చి ఎన్నో సంచలనాలు సృష్టించారు. ఎవరూ సాహసించని ప్రాంతాల్లో కూడా రిపోర్టింగ్ చేసి విజయ్ సాతా ధైర్యాన్ని ప్రదర్శించారు. స్వయంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో పర్యటించి మావోయిస్టుల సమాచారం తో పాటు, ఎన్నో ఎన్ కౌంటర్ వార్తలను కవర్ చేశారు. ముఖ్యంగా పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులు, మోస్ట్ వాంటెడ్ నేరస్తులతో చేసిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలతో ఆయన ప్రజలందరిని ఆశ్చర్యపరిచారు.

గ్రౌండ్ రిపోర్టింగ్ చేయడమే కాకుండా, సమాజం లో కొత్త నేరాలను గుర్తించి ప్రజలను అవగాహన పరిచే కథనాలు అందించడంలో ఆయన ప్రత్యేకం. అయన అందించే డిజిటల్ కథనాలు సరికొత్త స్టైల్ లో ఉండటమే కాకుండా, మీ రోజూ వారి జీవనంలో మీకు ఉపయోగపడే ఎన్నో విషయాలు అందిస్తాయి.

Read More
Follow On:
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావుకు బిగ్‌ రిలీఫ్!

Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావుకు బిగ్‌ రిలీఫ్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుఇంది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసుపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది.

Sanju Samson: సంజూ శాంసన్ రేంజే వేరు భయ్యో.. కేరళతోపాటు సౌత్‌లో ఆస్తులు చూస్తే పరేషానే..!

Sanju Samson: సంజూ శాంసన్ రేంజే వేరు భయ్యో.. కేరళతోపాటు సౌత్‌లో ఆస్తులు చూస్తే పరేషానే..!

Team India Player Sanju samson Net Worth: టీమిండియా యంగ్ ప్లేయర్ సంజూ శాంసన్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాడు. దీంతో ఎక్కడ చూసినా అతని గురించే మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో శాంసన్ ఆస్తులు తెలుసుకోవాలని ఫ్యాన్స్ గూగుల్‌లో వెతకడం మొదలుపెట్టారు.

ప్రజల ఆరోగ్య రక్షణ కోసం తెలంగాణ సర్కార్‌ సరికొత్త సిస్టమ్.. మెడికల్ షాపులు, ఫార్మా కంపెనీలకు హెచ్చరికలు..

ప్రజల ఆరోగ్య రక్షణ కోసం తెలంగాణ సర్కార్‌ సరికొత్త సిస్టమ్.. మెడికల్ షాపులు, ఫార్మా కంపెనీలకు హెచ్చరికలు..

తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) నాణ్యత లేని (NSQ) మందుల గుర్తింపుపై రాష్ట్రవ్యాప్తంగా బల్క్ SMS అలర్ట్ సిస్టమ్‌ను ప్రారంభించింది. ఇది మెడికల్ షాపులు, తయారీదారులు, పంపిణీదారులకు తక్షణమే హెచ్చరికలను చేరవేస్తుంది, గతంలో ఉన్న 15-20 రోజుల ఆలస్యాన్ని తగ్గిస్తుంది. ఈ డిజిటల్ విధానం ప్రజల ఆరోగ్య రక్షణకు, అనర్హ మందులు మార్కెట్‌లోకి చేరకుండా అడ్డుకోవడానికి తోడ్పడుతుంది. DCA ల్యాబ్‌ల విస్తరణకు కూడా ప్రణాళికలు రూపొందించింది.

Telangana: పిలవని పెళ్లి భోజనానికి వెళ్తున్నారా.? దొరికితే శిక్ష ఎంత పడుతుందో తెల్సా..

Telangana: పిలవని పెళ్లి భోజనానికి వెళ్తున్నారా.? దొరికితే శిక్ష ఎంత పడుతుందో తెల్సా..

ఆహ్వానం లేకుండా పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లి భోజనం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. ఐపీసీ సెక్షన్ 441 ప్రకారం, అనుమతి లేకుండా ఇతరుల ప్రైవేటు ఆస్తిలోకి ప్రవేశించినందుకు మూడు నెలల జైలుశిక్షతో పాటు 5000 రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. ఇలాంటి చర్యల పట్ల జాగ్రత్త వహించాలని సూచన.

TVK చీఫ్ విజయ్‌కు మళ్లీ సీబీఐ నోటీసులు.. విచారణకు హాజరు కావాలని ఆదేశం

TVK చీఫ్ విజయ్‌కు మళ్లీ సీబీఐ నోటీసులు.. విచారణకు హాజరు కావాలని ఆదేశం

సినీ నటుడు విజయ్‌కు మరో షాక్ తగిలింది. ,ఇటీవలే ఆయన భార్య విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేసింది.

డీజీపీ చేతిలో మోస్ట్ వాంటెడ్ ‘సెవెన్’.. వారితోనే కామ్రేడ్ల శకానికి క్లయిమాక్స్ ముడిపడి ఉందా?

డీజీపీ చేతిలో మోస్ట్ వాంటెడ్ ‘సెవెన్’.. వారితోనే కామ్రేడ్ల శకానికి క్లయిమాక్స్ ముడిపడి ఉందా?

మార్చి 7న మొత్తం 4 బస్సుల్లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు వచ్చి, 124 ఆయుధాలను పోలీసుల చేతికి ఇచ్చి, ఏకంగా 130 మంది మావోయిస్టులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సరెండర్ అయ్యారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు.. శనివారం నాటి చరిత్రాత్మక సందర్భం అది. కానీ, ఒక్కటి మిగిలింది అంటోంది తెలంగాణ సర్కార్. ఒక్కరు కాదు ఏడుగురు కావాలి అని ఆర్డర్ వేసింది కేంద్ర హోంశాఖ. ఎవరా ఏడుగురు? ఎక్కడున్నట్టు? ఆ ఏడుగురితోనే కామ్రేడ్ల శకానికి క్లయిమాక్స్ ముడిపడి ఉందా?

VC Sajjanar: రిటైర్ అవుతున్న పోలీస్ సిబ్బందికి వీసీ సజ్జనార్ స్వీట్ అడ్వైస్.. ఏం చెప్పారంటే?

VC Sajjanar: రిటైర్ అవుతున్న పోలీస్ సిబ్బందికి వీసీ సజ్జనార్ స్వీట్ అడ్వైస్.. ఏం చెప్పారంటే?

హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్ నుండి పదవీ విరమణ పొందుతున్న 19 మంది అధికారులకు సీపీ వి.సి. సజ్జనార్ ఘనంగా వీడ్కోలు పలికారు. సుదీర్ఘ సేవలందించిన వారిని కొనియాడుతూ, ఆరోగ్యకరమైన, చురుకైన శేష జీవితాన్ని గడపాలని సూచించారు. ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వ బ్యాంకులలో భద్రపరచుకోవాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కుటుంబ సభ్యులు విశ్రాంత అధికారులకు మద్దతు ఇవ్వాలని కోరారు.

Telangana: షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు గడియ వేసి..

Telangana: షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు గడియ వేసి..

మేడ్చల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈఎంఐ కట్టలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. బైక్ లోన్ చెల్లింపుల విషయంలో ఫైనాన్సర్ల వేధింపులు తట్టుకోలేక 34 ఏళ్ల సుమన్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

Hyderabad: జైలులో స్నేహం చేశాడని.. బయటికి రాగానే హత్య! అసలు మ్యాటరేంటంటే?

Hyderabad: జైలులో స్నేహం చేశాడని.. బయటికి రాగానే హత్య! అసలు మ్యాటరేంటంటే?

హైదరాబాద్ నగరంలోని మంగళ్‌హాట్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన రుషబ్ అగర్వాల్ హత్య కేసును పోలీసులు చేదించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లు, రెండు యాక్టివా బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 27న మధ్యాహ్నం ప్రత్యేక బృందాలు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

Hyderabad: ఐటీ ఉద్యోగులతో మాట్లాడాలని ఉంది..! మాజీ మావోయిస్ట్ చీప్ దేవ్‌జీ ఆసక్తికర వ్యాఖ్యలు!

Hyderabad: ఐటీ ఉద్యోగులతో మాట్లాడాలని ఉంది..! మాజీ మావోయిస్ట్ చీప్ దేవ్‌జీ ఆసక్తికర వ్యాఖ్యలు!

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా మావోయిస్ట్‌లు తమ ఆయుధాలను విడిచిపెట్టి లొంగిపోతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్ట్ ఛీఫ్ దేవ్ జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు హైటెక్ సిటీకెళ్లి అక్కడ పనిచేసే ఐటీ ఉద్యోగులతో చర్చించాలని ఉందని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఇంతకు ఆయన ఐటీ ఉద్యోగులతో ఏం మాట్లాడాలి అనుకుంటాన్నారనే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

జూబ్లీహిల్స్‌లో ఫెరారీ బీభత్సం.. తుక్కుతుక్కైన మూడు కార్లు

జూబ్లీహిల్స్‌లో ఫెరారీ బీభత్సం.. తుక్కుతుక్కైన మూడు కార్లు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 వద్ద మూడున్నర కోట్ల విలువైన ఫెరారీ కారు ప్రమాదానికి గురైంది. డివైడర్‌ను ఢీకొని అవతలి రోడ్డులోకి దూసుకెళ్లిన కారు మరో కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మొత్తం నాలుగు వాహనాలకు నష్టం జరగగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ బ్రేక్ ఫెయిల్ అని చెబుతుండగా, సీసీటీవీ ఫుటేజ్ అధిక వేగాన్ని సూచిస్తోంది.

Maoist Leaders Surrender: ఇకపై రాజకీయ జీవితం కొనసాగిస్తా.. మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ ఏమన్నారంటే..

Maoist Leaders Surrender: ఇకపై రాజకీయ జీవితం కొనసాగిస్తా.. మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ ఏమన్నారంటే..

ఆపరేషన్‌ కగార్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణలో మావోయిస్ట్ ఉద్యమం దాదాపు ముగిసింది. మావోయిస్ట్ ఉద్యమంలో కీలకంగా ఉన్న అగ్రనేతలు దేవ్‌జీ అలియాస్ తిప్పిరితిరుపతి, మల్లా రాజిరెడ్డి, చొక్కారావు అలియాస్‌ దామోదర్‌, నున్నె నరసింహారెడ్డి పోలీసుల ముందు లొంగిపోయారు. కీలక నేతలతో పాటు మరో 15 మంది మావోయిస్టులు లొంగిపోయారు.