విజయ్ సాతా, టీవీ 9 క్రైమ్ బ్యూరో చీఫ్గా దీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. 15 ఏళ్లకుపైగా క్రైమ్ జర్నలిజంలో తన ప్రయాణం కొనసాగిస్తూ అనేక సంఘటనలను కవర్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో విజయ్ సాతా మొదటి ప్లేస్ లో ఉంటారు అనడానికి అయన చేసిన సెన్సేషనల్ స్టోరీలే ఉదాహరణ.
దేశాన్ని వణికించిన నిర్భయ సంఘటన నుండి గోవాలో డ్రగ్ మాఫియా పై స్ట్రింగ్ ఆపరేషన్ వరకు, అంతే కాకుండా అనేక కుంభకోణాలు, నేరాలు, చీకటి కోణాలు వెలుగు లోకి తెచ్చి ఎన్నో సంచలనాలు సృష్టించారు. ఎవరూ సాహసించని ప్రాంతాల్లో కూడా రిపోర్టింగ్ చేసి విజయ్ సాతా ధైర్యాన్ని ప్రదర్శించారు. స్వయంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో పర్యటించి మావోయిస్టుల సమాచారం తో పాటు, ఎన్నో ఎన్ కౌంటర్ వార్తలను కవర్ చేశారు. ముఖ్యంగా పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులు, మోస్ట్ వాంటెడ్ నేరస్తులతో చేసిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలతో ఆయన ప్రజలందరిని ఆశ్చర్యపరిచారు.
గ్రౌండ్ రిపోర్టింగ్ చేయడమే కాకుండా, సమాజం లో కొత్త నేరాలను గుర్తించి ప్రజలను అవగాహన పరిచే కథనాలు అందించడంలో ఆయన ప్రత్యేకం. అయన అందించే డిజిటల్ కథనాలు సరికొత్త స్టైల్ లో ఉండటమే కాకుండా, మీ రోజూ వారి జీవనంలో మీకు ఉపయోగపడే ఎన్నో విషయాలు అందిస్తాయి.
125 ఏళ్ల క్రితం హైదరాబాద్లో జనాభా లెక్కలు ఎలా తీశారో తెలుసా? ఈ రంగుల రహస్యం వింటే షాకవుతారు!
నేటి ఆధునిక యుగంలో జనగణన (Census) అనగానే మనకు కంప్యూటర్లు, ఆన్లైన్ ఫారాలు, డిజిటల్ డేటా బేస్లు గుర్తుకు వస్తాయి. కానీ, ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం, సదుపాయాలు లేని కాలంలోనే హైదరాబాద్ సంస్థానంలో జనాభాను లెక్కించడానికి ఒక వినూత్నమైన, అద్భుతమైన పద్ధతిని ఉపయోగించారంటే నమ్మడం కష్టం. 125 ఏళ్ల క్రితం, అంటే 1901లో హైదరాబాద్లో నిర్వహించిన జనాభా లెక్కల సేకరణ విధానం అప్పటి పాలనా వ్యవస్థ దూరదృష్టికి నిదర్శనంగా నిలిచింది.
- Vijay Saatha
- Updated on: Jun 19, 2026
- 8:31 pm
పింక్ బూట్ల వెనుక ఇదే రహస్యం.. ఫుట్బాల్ ప్రపంచంలో కొత్త ట్రెండ్కు కారణమేంటి?
Football Pink Boots Trend: ఫుట్బాల్ మ్యాచ్లు చూస్తున్న అభిమానులకు ఇటీవల ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రధాన టోర్నమెంట్లలో పలువురు స్టార్ ప్లేయర్లు ప్రకాశవంతమైన పింక్ రంగు బూట్లతో మైదానంలోకి దిగుతున్నారు. ఇది కేవలం ఫ్యాషన్ కోసమో, స్టైల్ స్టేట్మెంట్ కోసమో కాదని ఫుట్వేర్ తయారీ సంస్థలు చెబుతున్నాయి.
- Vijay Saatha
- Updated on: Jun 19, 2026
- 7:45 pm
కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకపై పడే ప్రభావం ఇదే!
సాఫ్ట్వేర్, ఐటీ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, ఎక్కువసేపు కంప్యూటర్ల ముందు కూర్చునే వారు, మొబైల్ ఫోన్ల వినియోగం అధికంగా ఉండేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు.వెన్నెముకలోని డిస్క్లు బలహీనపడటం లేదా బయటకు ఉబ్బిపోవడం వల్ల డిస్క్ బల్జ్ సమస్య ఏర్పడుతుంది. ఇది నరాలపై ఒత్తిడి పెంచి తీవ్ర నొప్పికి దారితీస్తుంది.
- Vijay Saatha
- Updated on: Jun 19, 2026
- 7:04 pm
నాంపల్లి కోర్ట్ తీర్పు తరువాత తెలంగాణకు మీనాక్షి నటరాజన్
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు చేపట్టనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి పార్టీ సంస్థాగత బలోపేతం, ఎన్నికల సన్నద్ధత, క్షేత్రస్థాయి కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించనున్నారు.
- Vijay Saatha
- Updated on: Jun 16, 2026
- 8:53 pm
వాహనదారులకు బిగ్ అలర్ట్..! వెంటనే VAHANలో ఈ వివరాలు అప్డేట్ చేయకపోతే ఇబ్బందులే!
తెలంగాణలో వాహనదారులకు రవాణా శాఖ కీలక సూచనలు జారీ చేసింది. మీ వాహనానికి సంబంధించిన ట్రాఫిక్ ఉల్లంఘన ఈ-చలానాలు, నోటీసులు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని సకాలంలో అందుకోవాలంటే వెంటనే 'వాహన్' (VAHAN) పోర్టల్లో మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
- Vijay Saatha
- Updated on: Jun 16, 2026
- 4:45 pm
Telangana: తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్ బస్సులకు ఫిట్నెస్ టెస్ట్.. ఎన్ని సీజ్ చేశారంటే?
విద్యార్థుల భద్రతే లక్ష్యంగా తెలంగాణ రవాణా శాఖ ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఆర్టీఏ నిబంధనలు ఉల్లంఘించిన 245 వాహనాలను గుర్తించి, ఫిట్నెస్ లేని 60 స్కూల్ బస్సులను సీజ్ చేసింది. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. పిల్ల భద్రతపై తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- Vijay Saatha
- Updated on: Jun 16, 2026
- 3:10 pm
Elon Musk : ఎలాన్ మస్క్ ఖాతాలో మరో వరల్డ్ రికార్డ్.. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా..
అంతరిక్ష రంగంలో సరికొత్త విప్లవానికి తెరతీస్తూ, టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్న వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ ఆర్థిక రికార్డులను తిరగరాస్తూ, చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని మైలురాయిని అందుకున్నారు. ఇంతకూ మస్క్ సాధించింది ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- Vijay Saatha
- Updated on: Jun 13, 2026
- 9:36 pm
మీనాక్షి వివాదంలో కొత్త కోణం.. కేసు లీక్ చేసింది ఎవరు? అసలు డ్యామేజ్ చేసింది ఎవరు?
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో తాజాగా మరో కోణం వెలుగులోకి వచ్చింది. కేసు వివరాలు బయటకు ఎలా వచ్చాయన్న దానికంటే, ప్రారంభ దశలోనే సరైన న్యాయపరమైన వాదనలు వినిపించకపోవడమే మీనాక్షికి ఎక్కువ నష్టం కలిగించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాంపల్లి కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో మీనాక్షి నటరాజన్కు కొంత ఊరట లభించినప్పటికీ, ఆమె తరఫున వ్యవహరించిన న్యాయవాదుల పాత్రపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
- Vijay Saatha
- Updated on: Jun 13, 2026
- 12:04 pm
ఆధార్లో పేరు మార్చుకుని 14 ఏళ్లుగా పరారీలోనే.. చివరకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ కిల్లర్!
దశాబ్దానికి పైగా పోలీసులకు చిక్కకుండా తిరిగిన రౌడీ షీటర్ను సుల్తాన్ బజార్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. హత్య సహా 21 కేసుల్లో నిందితుడైన విష్ణవ్ కిషన్ దాస్ అలియాస్ గణేష్ మహరాజ్ మలక్పేటలో దొరికాడు. గుర్తింపు మార్చుకుని పరారీలో ఉన్న అతడిని ప్రత్యేక బృందం చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది..
- Vijay Saatha
- Updated on: May 29, 2026
- 8:44 am
Telangana: అవినీతి తిమింగలాలు @రూ.100 కోట్లు.. ACB దాడుల్లో షాకింగ్ విషయాలు
Telangana ACB Raids: తెలంగాణలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ(ACB) ప్రత్యేక ఫోకస్ పెట్టింది. గత ఏడాది కాలంగా ఆదాయానికి మించిన ఆస్తులు, అక్రమ సంపాదనలు, లంచాల వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఏసీబీ.. వరుస దాడులతో సంచలన విషయాలను వెలికితీస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా పలువురు అధికారులపై నమోదైన అక్రమాస్తుల కేసులు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు లక్షల్లో ఉండే ఒక్కో అవినీతి అధికారి అక్రమాస్తుల లెక్కలు.. ఇప్పుడు ఏకంగా రూ.100 కోట్ల మార్క్ను దాటుతుండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
- Vijay Saatha
- Updated on: May 28, 2026
- 6:54 pm
Online Fraud: ప్రజలకు బిగ్ అలర్ట్.. సోషల్ మీడియాలో వచ్చే ఈ యాడ్స్ నమ్మారంటే నట్టేట మునిగినట్టే!
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ పోలీసులకు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో జోతిష్యం, తంత్ర-మంత్ర సేవల పేరుతో వచ్చే ప్రకటనలు నమ్మవద్దని హెచ్చరించారు. అవన్నీ మీ నుంచి డబ్బులు కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు పన్నే పన్నాగాళ్లని.. వాటిని నమ్మి జనాలు డబ్బులు కోల్పోవద్దని తెలిపారు. ఎవరైనా ఈ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.
- Vijay Saatha
- Updated on: May 26, 2026
- 7:06 pm
మసాలా పొడిని డ్రగ్స్ అనుకున్న అధికారులు.. పాపం 57 రోజుల జైలు..
మధ్యప్రదేశ్లోని భోపాల్ విమానాశ్రయంలో మసాలా పొడి ప్యాకెట్లను మాదక ద్రవ్యాలుగా పొరబడటంతో ఓ వ్యాపారి 57 రోజులు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఆమ్చూర్, గరం మసాలా ప్యాకెట్లపై స్కానింగ్ యంత్రం హెచ్చరికలు ఇవ్వడంతో అధికారులు అతడిపై ఎన్డీపీఎస్ కేసు నమోదు చేశారు. అనంతరం ఫోరెన్సిక్ పరీక్షల్లో అవి కేవలం మసాలా దినుసులేనని తేలడంతో హైకోర్టు బాధితుడికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
- Vijay Saatha
- Updated on: May 25, 2026
- 8:15 pm