Vijay Saatha

Vijay Saatha

Bureau Chief - TV9 Telugu

vijaykumar.satha@tv9.com

టీవీ9 తెలుగు నెట్వర్క్ లో క్రైమ్ బ్యూరో చీఫ్ గా బాధ్యతలు. 15 ఏళ్ల జర్నలిజం కెరియర్ లో ఎన్నో సంచలన కథనాలు, క్రైమ్ వరల్డ్ లో ఎన్నో ఎన్కౌంటర్ రిపోర్టింగ్ కవరేజ్ లు , గోవా డ్రగ్ డెన్ పై స్టింగ్ ఆపరేషన్ చేసిన ఏకైక తెలుగు క్రైమ్ రిపోర్టర్ గా గుర్తింపు.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల క్రైమ్ విభాగానికి బ్యూరో ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Read More
Follow On:
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ సంచలన విషయాలు వెల్లడి..

Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ సంచలన విషయాలు వెల్లడి..

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన నిందితులు సమాజం మొత్తానికి హాని కలిగించేలా ప్రవర్తించారన్నారు హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి. ఇప్పటి వరకు ఫోన్ టాపింగ్ కేసులో నలుగురు అరెస్ట్ అయ్యారు. ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధా కిషన్ రావులను ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణకు వచ్చిన వీరు ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారని పోలీస్ కమిషనర్ తెలిపారు.

హైదరాబాద్‎లో గన్స్ డిపాజిట్ చేయని సెలబ్రిటీలపై పోలీసుల సీరియస్..

హైదరాబాద్‎లో గన్స్ డిపాజిట్ చేయని సెలబ్రిటీలపై పోలీసుల సీరియస్..

పార్లమెంట్ ఎన్నికల కోడ్‎లో భాగంగా గన్ లైసెన్స్ ఉన్న హోల్డర్లు ఆయుధాలను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల సందర్భంగా డిపాజిట్ చేయాల్సిన గన్స్ ఇంకా చాలామంది డిపాజిట్ చేయలేదన్నారు పోలీసులు. హైదరాబాదులో మొత్తం 8 వేల మందికి పైగా గన్ లైసెన్స్ హోల్డర్లు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు కేవలం 3000 మంది మాత్రమే తమ గన్స్‎ను డిపాజిట్ చేశారు.

Lok Sabha Election: లోక్‌సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత.. గీత దాటితే వేటు తప్పదుః సీపీ అవినాష్ మహంతి

Lok Sabha Election: లోక్‌సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత.. గీత దాటితే వేటు తప్పదుః సీపీ అవినాష్ మహంతి

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేపడుతోంది పోలీస్ శాఖ. పోలింగ్ సందర్భంగా క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లను, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ అవినాష్ మహంతి సమీక్షించారు.

Delhi: ప్రతి ఒక్కరి గుట్టును బయటపెట్టే టెక్నాలజీ.. తమ అరచేతిలో పెట్టుకున్న ఈ సంస్థలు..

Delhi: ప్రతి ఒక్కరి గుట్టును బయటపెట్టే టెక్నాలజీ.. తమ అరచేతిలో పెట్టుకున్న ఈ సంస్థలు..

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఫోన్ టాపింగ్‎పై చర్చ నడుస్తుంది. అటు రాష్ట్రంలోనూ ఇటు దేశవ్యాప్తంగాను మా ఫోన్లు ట్యాప్ చేశారనీ పలువు రాజకీయ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే సాధారణంగా రాజకీయ నాయకులు ఎక్కువ శాతం ఐఫోన్లను మాత్రమే వినియోగిస్తారు. ఈ ఐఫోన్‎లను ట్రాక్, ట్యాప్ చేయడం అంత ఈజీ కాదు. ఇతరులతో మాట్లాడిన సందర్భాల్లోనూ ఎక్కువ శాతం ఐఫోన్‎లోని ఫేస్ టైం ఉపయోగిస్తుంటారు చాలామంది ప్రముఖులు.

Telangana: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వం దూకుడు.. ప్రత్యేక పీపీ నియామకం అందుకేనా..

Telangana: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వం దూకుడు.. ప్రత్యేక పీపీ నియామకం అందుకేనా..

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న తెలంగాణ ఫోన్ టైపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఫోన్ టాపింగ్ వ్యవహారంలో నలుగురిని అరెస్ట్ చేశారు దర్యాప్తు అధికారులు. అయితే వీరిలో ప్రస్తుతం ఇద్దరు నిందితులు నాంపల్లి కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు.

Hyderabad: మా అయ్య ఎమ్మెల్యే.. పోలీసులకు దొరక్కుండా దుబాయ్‎లోనే మకాం.. కట్ చేస్తే కటకటాల్లోకి..

Hyderabad: మా అయ్య ఎమ్మెల్యే.. పోలీసులకు దొరక్కుండా దుబాయ్‎లోనే మకాం.. కట్ చేస్తే కటకటాల్లోకి..

పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ఏడాది డిసెంబర్‎లో ప్రజా భవన్ ముందు ఉన్న భారీ కేట్లు ఢీ కొట్టిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహేల్‎ను పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది డిసెంబర్ 24న ఘటన జరిగిన తర్వాత దుబాయ్ పారిపోయాడు ఎమ్మెల్యే కొడుకు. అయితే అప్పటినుండి అతడి అరెస్టు కోసం పంజాగుట్ట పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు.

Telangana: “కేసు నా మీద కాదు పోలీసుల మీద పెట్టండి”.. హైకోర్ట్‌లో మాజీ ఎమ్మెల్యే కొడుకు కీలక వాదన

Telangana: “కేసు నా మీద కాదు పోలీసుల మీద పెట్టండి”.. హైకోర్ట్‌లో మాజీ ఎమ్మెల్యే కొడుకు కీలక వాదన

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాగుట్ట రాష్ డ్రైవింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన తర్వాత తనకు బదులుగా తన డ్రైవర్‌ను పోలీసుల ముందు లొంగిపోమని చెప్పి ఆ తర్వాత దుబాయ్ పారిపోయాడు.

Phone Tapping: మా ఫోన్లు ట్యాప్ చేశారు మహాప్రభో.. పోలీసులకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

Phone Tapping: మా ఫోన్లు ట్యాప్ చేశారు మహాప్రభో.. పోలీసులకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

రాష్ట్రవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేక కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు అడిషనల్ ఎస్పీలను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే వీరిలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాదాకిషన్ రావు తోపాటు భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావులను ప్రత్యేక బృందం అరెస్టు చేసింది. అయితే ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రాష్ట్రమంతా వ్యాపించడంతో పలువురు నేరస్తులు సైతం పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

Phone Tapping: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ రాజకీయ ప్రకంపనలు.. తెరపైకి వస్తున్న అసలు సూత్రధారులు

Phone Tapping: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ రాజకీయ ప్రకంపనలు.. తెరపైకి వస్తున్న అసలు సూత్రధారులు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత ప్రభుత్వ పెద్దలను కుదిపేస్తుంది. ఇప్పటివరకు కేవలం పోలీసులపై ఫోకస్ చేసిన స్పెషల్ టీం త్వరలోనే రాజకీయ నాయకుల వెంట పడబోతుంది. నేతలు చెబితేనే ప్రత్యర్ధుల ఫోన్లు టాప్ చేశామని ఇప్పటికే అరెస్ట్ అయిన అధికారులు వాంగ్మూలం ఇస్తున్నారు. వీటితోపాటు ప్రత్యక్షంగా పలువురు నేతలు తమ ఫోన్లను టాప్ చేశారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.

Telangana: పోలీసులే నిందితులైన వేళ.. సస్పెన్షన్‌లతో సతమతమవుతున్న డిపార్ట్‌మెంట్..!

Telangana: పోలీసులే నిందితులైన వేళ.. సస్పెన్షన్‌లతో సతమతమవుతున్న డిపార్ట్‌మెంట్..!

తెలంగాణ పోలీస్ శాఖకు గ్రహణం పట్టింది. రక్షించాల్సిన పోలీసులే రాంగ్ రూట్​లోకి వెళుతున్నారు. రకరకాల కారణాలతో వివిధ హోదాల్లో ఉన్న పోలీసులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. యువతిపై అత్యాచారం, ప్రజాప్రతినిధి కుమారుడిని తప్పిన కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, విధినిర్వహణలో అలసత్వం ఇలా తెలంగాణ పోలీస్ శాఖకు చెరగని మచ్చ తెచ్చిపెట్టాయి. మామూలు పోలీస్ నుంచి ఉన్నతాధికారుల వరకు సస్పెండ్, అరెస్టులు, ఏకంగా జైలు పాలవుతున్నారు.

Telangana: వార్నీ వేషాలో..  గోల్డ్ లోన్ ఇచ్చే బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన దంపతులు..!

Telangana: వార్నీ వేషాలో.. గోల్డ్ లోన్ ఇచ్చే బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన దంపతులు..!

గోల్డ్ లోన్ ఇచ్చే బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టారు భార్యాభర్తలు. బంగారాన్ని కుదవ పెట్టి ఆ బంగారాన్ని విడిపించడానికి మరో బ్యాంక్‌లో డబ్బును తీసుకున్నారు. ఇలా ఏకంగా 51 లక్షల రూపాయలను కొట్టేశారు ఈ ఇద్దరు.. హైదరాబాద్ మహానగరంలో వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

Viral: పెళ్లిచూపులకు ఖాకీ డ్రెస్‌లో దర్శనమిచ్చిన యువతి.. కట్ చేస్తే.. వెలుగులోకి షాకింగ్ నిజం.!

Viral: పెళ్లిచూపులకు ఖాకీ డ్రెస్‌లో దర్శనమిచ్చిన యువతి.. కట్ చేస్తే.. వెలుగులోకి షాకింగ్ నిజం.!

నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన ఒక అమ్మాయిని పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే ఎస్ఐనని చెప్పుకుంటూ చెలామణి అవుతున్న మాళవిక అనే యువతి బండారాన్ని బట్టబయలు చేశారు రైల్వే పోలీసులు. నార్కెట్‌పల్లికి చెందిన మాళవిక నిజాం కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేసింది.