ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోండి- భట్టి
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి లేఖ రాశారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీలు మారారని.. అటువంటి ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సమావేశంలో రాజ్యాంగ స్ఫూర్తికి సీఎం కేసీఆర్ తూట్లు పొడిచారని మండిపడ్డారు. స్పీకర్ని కలిసి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశామన్న భట్టి.. పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు […]
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి లేఖ రాశారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీలు మారారని.. అటువంటి ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సమావేశంలో రాజ్యాంగ స్ఫూర్తికి సీఎం కేసీఆర్ తూట్లు పొడిచారని మండిపడ్డారు. స్పీకర్ని కలిసి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశామన్న భట్టి.. పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలని ఫిర్యాదు చేశామన్నారు. పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలు.. రేగా కాంతారావు, ఆత్రం సక్కు, సుధీర్ రెడ్డి, వనామా వెంకటేశ్వర్లు, సబితా ఇంద్రారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన మిగతా ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేస్తూ మరో లేఖ రాయనున్నట్టు వెల్లడించారు. లేఖతో పాటు 125 పేజీల పిటిషన్ ప్రతులను స్పీకర్కి అందించారు. త్వరలోనే చిరుమర్తి లింగయ్య, హరిప్రియ నాయక్, సురేందర్, ఉపేందర్ రెడ్డిపై మరోసారి ఫిర్యాదు చేస్తామన్నారు.