AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఫ్యాక్టరీలో జోరుగా గంజాయి అమ్మకాలు.. కూలీలు, ఉద్యోగులే టార్గెట్‌..! కట్‌ చేస్తే..

తెలంగాణ వికారాబాద్‌లోని పరిగి సుగుణ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద ఎక్సైజ్ పోలీసులు 1 కేజీ 50 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బీహార్, ఒడిస్సా నుంచి వచ్చిన నితీష్ రఝాక్, సూరజ్ కుమార్‌లను అరెస్టు చేశారు. తోటి లేబర్లకు గంజాయి విక్రయిస్తుండగా పక్కా సమాచారంతో దాడి చేశారు. వీరిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. తెలంగాణలో గంజాయి అక్రమ రవాణా పెరుగుతుందని ఎక్సైజ్ హెచ్చరించింది.

ఆ ఫ్యాక్టరీలో జోరుగా గంజాయి అమ్మకాలు.. కూలీలు, ఉద్యోగులే టార్గెట్‌..! కట్‌ చేస్తే..
Ganja Bust
Sravan Kumar B
| Edited By: |

Updated on: Feb 25, 2026 | 8:36 PM

Share

వికారాబాద్‌ జిల్లా పరిగి మండలంలో పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుబడింది. మండలంలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో ఎక్సైజ్ పోలీసులు 1 కేజీ 50 గ్రాముల గంజాయి సీజ్ చేశారు. బీహార్, ఒడిస్సా నుంచి వచ్చిన నితీష్ రఝాక్, సూరజ్ కుమార్‌లను అరెస్టు చేశారు. పరిగి మండలం సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసే లేబర్లకు గంజాయి విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎక్సైజ్ సీఐ నీరజాదేవి బృందం దాడి చేసింది. బీహార్ నుంచి గంజాయి తీసుకువచ్చిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు ఒడిస్సా ప్రాంతం నుంచి తీసుకువచ్చి తోటి లేబర్లకు అమ్ముతున్నట్లు ఒప్పుకున్నారు.

ఈ మేరకు ఇద్దరిపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ నీరజాదేవి తెలిపారు. ఫ్యాక్టరీలో పనిచేసే లేబర్ల మధ్య గంజాయి వ్యాపారం విస్తరిస్తోందని వివరించారు. ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకు తనిఖీలు పెంచామని చెప్పారు. 6 నెలల్లో తెలంగాణ వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ భారీగా గంజాయి సీజ్ చేసింది. ఖమ్మం, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో 100 కేజీలకు పైగా గంజాయి, హాషీష్ ఆయిల్ పట్టుకున్నారు. 2024లో ఎక్సైజ్ నేరాలు పెరిగి, గంజాయి విక్రయాలు జోరుగా సాగాయి. తెలంగాణకు ఎక్కువగా గంజాయి ఒడిస్సా, ఆంధ్ర ఉత్తరాంధ్ర అటవీ ప్రాంతాల నుంచి వస్తోంది. ఒడిస్సా సరిహద్దు గ్రామాల్లో పండించిన గంజాయిని బీహార్, ఇతర రాష్ట్రాల ద్వారా తెలంగాణలోకి తీసుకువస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us