Hyderabad: పట్టపగలే ఇలా తయారయ్యారు ఏంట్రా బాబు…
కార్వాన్లో రెక్కీ చేసి బైకులను టార్గెట్ చేసిన దొంగలు ట్రాలీ ఆటోతోనే అపహరణకు పాల్పడ్డారు. రెండు గంటల ప్లానింగ్ తర్వాత అవెంజర్, యాక్టివా వాహనాలను ఎత్తుకెళ్లిన ఘటన సీసీటీవీలో బహిర్గతమైంది. నగరంలో పెరుగుతున్న వాహన దొంగతనాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. .. ..
- Sravan Kumar B
- Updated on: Mar 31, 2026
- 7:56 pm
ఎయిర్పోర్ట్లో ప్రయాణికుడి సూట్కేస్ ఓపెన్ చేయగా షాక్..
బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చిన ఇద్దరు ప్రయాణికులు భారీ డ్రగ్స్తో పట్టుబడటం సంచలనం రేపింది. 24.45 కేజీల హైడ్రోపోనిక్ గాంజాను లగేజీలో దాచిన వీరిని DRI అధికారులు అరెస్ట్ చేశారు. రూ.8.9 కోట్ల విలువైన ఈ మాదకద్రవ్యం కేసు… హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్పై నిఘా మరింత కఠినమైందనే సంకేతంగా నిలిచింది.
- Sravan Kumar B
- Updated on: Mar 31, 2026
- 7:49 pm
ఎన్ని గుండెలురా వీళ్లవి.! ఏకంగా పోలీసులతోనే ఫైట్కి దిగారు.. కట్ చేస్తే
హైదరాబాద్ మెహదీపట్నం మాసబ్ ట్యాంక్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులు (అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ అలీ ఖాద్రి) పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాత్రి సమయంలో పోలీసులపైనే దాడి జరగడం ప్రజల భద్రతపై తీవ్ర ఆందోళనలు లేవనెత్తుతోంది. అదనపు భద్రతా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
- Sravan Kumar B
- Updated on: Mar 31, 2026
- 4:53 pm
Hyderabad: దేవుడా! బయట ఏదైనా కొనాలంటేనే భయమేస్తోందిగా! ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్ విషయాలు
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బయట ఏదైనా కొనాలన్నా, తినాలన్నా భయమేస్తోంది. కారణం కల్తీ. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి చిన్న బడ్డీ కొట్టు దాకా.. అన్నింటిలోనూ కల్తీనే రాజ్యమేలుతోంది. తాజాగా రాజేంద్రనగర్ లోని కొన్ని కిరాణా షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- Sravan Kumar B
- Updated on: Mar 30, 2026
- 8:33 pm
Hyderabad: గ్యాస్ దొరకడం లేదని ఆటో డ్రైవర్ల నిరసన.. సెల్ టవర్ ఎక్కి మరీ..
గ్యాస్ దొరడకం లేదని ఆటో డ్రైవర్లు వినూత్న నిరసన చేపట్టారు. సెల్ టవర్ ఎక్కి ఆందోళనలు చేపట్టారు. హైదరాబాద్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎల్పీజీ ఆటో గ్యాస్ దొరకడం లేదని డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.
- Sravan Kumar B
- Updated on: Mar 30, 2026
- 7:35 pm
హైదరాబాద్ అంతటా గుప్పుమంటున్న హుక్కా స్మెల్.. అంతుచూస్తున్న పోలీసులు
హైదరాబాద్ నగరంలో హుక్కా సెంటర్లపై పోలీసుల చర్యలు తీవ్రతరం అవుతున్నాయి. హుక్కా సెంటర్లపై దాడులు చేసి నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నారు. హుక్కా సెంటర్లలోని హుక్కా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా హుక్కా సెంటర్లు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
- Sravan Kumar B
- Updated on: Mar 23, 2026
- 10:49 pm
Telangana: ఇంటికి తాళం వేసి ఫంక్షన్కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి చూసేసరికి ఊహించని సీన్.. వీడియో వైరల్..
మీరు ఇంటికి తాళం వేసి అలా బయటికి వెళ్లారో లేదో.. ఇలా గంట వ్యవధిలోనే పని కానిచ్చేశారు.. అల్మరాలు పగలగొట్టారు.. కష్టపడి దాచుకున్న నగదు, నగలను ఊడ్చేశారు. అత్తాపూర్ జలాల్ బాబా నగర్లో ఓ వ్యాపారి ఇంట్లో కేవలం గంటలోనే 20 లక్షల నగదు, బంగారం మాయమయ్యాయి.
- Sravan Kumar B
- Updated on: Mar 23, 2026
- 10:06 pm
ఫామ్ హౌస్ కాల్పుల వెనుక ఏం జరిగింది
మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. నిందితుల కస్టడీ కోసం ప్రయత్నిస్తోంది. ఈ హై-ప్రొఫైల్ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలు, డ్రగ్స్ సంబంధాలపై సిట్ దృష్టి సారించింది. రాజకీయంగానూ ఈ వ్యవహారం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలకు దారి తీసింది.
- Sravan Kumar B
- Updated on: Mar 21, 2026
- 4:42 pm
ఏసి మెకానిక్ అంటూ వచ్చి ఇల్లు మొత్తం దోచేశాడు
ఎల్బీనగర్ రాక్ హిల్స్ కాలనీలో ఏసీ మెకానిక్గా నటించిన దుండగుడు ఇంట్లోకి చొరబడి మహిళను సుత్తితో కొట్టి మంగళసూత్రాన్ని దోచుకెళ్లాడు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు అబ్రార్ అహ్మద్ను పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
- Sravan Kumar B
- Updated on: Mar 21, 2026
- 4:38 pm
IT Corridor: పోచారం IT కారిడార్లో దొంగతనం.. బాయ్స్ హాస్టల్లో ల్యాప్టాప్, మొబైల్స్ మాయం!
Pocharam IT Corridor: పోచారం IT కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ బాయ్స్ హాస్టల్లో గురువారం రాత్రి దొంగతనం జరిగింది. హాస్టల్ నివాసి జీవన్ (పేరు మార్చాము) గదిలో ఉంచిన తన ల్యాప్టాప్తో పాటు రెండు మొబైల్ ఫోన్లు మాయమయ్యాయి..
- Sravan Kumar B
- Updated on: Mar 20, 2026
- 9:23 pm
అమ్మవారి మహిమ.. పండగ పూట పోచమ్మ తల్లి ఆలయంలో నాగు పాము అద్భుత దర్శనం
Bandlaguda Pochamma Temple: హైదరాబాద్ శివారు ప్రాంతం బండ్ల గూడలోని ప్రసిద్ధ పోచమ్మ తల్లి ఆలయంలో పండగ సందర్భంగా అమ్మవారి అద్భుత మహిమ మరోసారి ప్రత్యక్షమైంది. అమ్మవారి విగ్రహం ముందు నాగు పాము కనిపించి, నాలుగు గంటల వరకు భక్తులకు దర్శనం ఇచ్చింది. ఈ అపురూప దృశ్యాన్ని చూడడానికి వేలాది భక్తులు ఆలయానికి చేరుకున్నారు.
- Sravan Kumar B
- Updated on: Mar 20, 2026
- 9:15 pm
Rain Alert: నిప్పుల వర్షం కురవాల్సిన మిడ్ మార్చి.. వేసవిలో వడగండ్ల వర్షం ఎందుకో తెలుసా?
మార్చి 2026 రెండవ, మూడో వారాల్లో తెలంగాణలో అసాధారణ వర్షాలు, ఉరుములు, మెరుపులు, వడగళ్లు పడ్డాయి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం ఇబ్రహీంపూర్, గడిసింగపూర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం, వడగళ్ల వాన నమోదయ్యాయి. మరో నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వానలే వానలు అంటోంది వాతావరణ శాఖ.
- Sravan Kumar B
- Updated on: Mar 19, 2026
- 8:34 pm