Hyderabad: హైదరాబాద్ రోడ్లపై సడెన్గా ప్రత్యక్షమైన జింక.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
హైదరాబాద్ గచ్చిబౌలి-లింగంపల్లి ఓల్డ్ ముంబై జాతీయ రహదారిపై షాకింగ్ ఘటన వెలుగు చూసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) అటవి ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఓ జింక రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జింక గాయపడింది. సమాచారం అందుకున్న HCU యానిమల్ ప్రొటెక్షన్ టీమ్ వెంటనే ఘటనాస్థలికి చేరుకొని, గాయపడిన జీంకను వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు.
- Sravan Kumar B
- Updated on: Jan 4, 2026
- 2:27 pm
Hyderabad: వందే భారత్ రైళ్లపై పెరిగిన రాళ్ల దాడులు.. ఆమె సెల్ఫీ తీసుకుంటూ పడింది.. కానీ..
ఈ ఏడాది వందే భారత్ రైళ్లపై రాళ్లు రువ్వడం పెరిగిందని జీఆర్పీ ఎస్పీ చందనాదీప్తీ పేర్కొన్నారు. రైల్వే వార్షిక మీడియా సమావేశంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వందే భారత్ రైళ్లపై రాళ్ల రువ్వడం పెరిగినా, 2025లో రైల్వే నేరాల సంఖ్య మొత్తంగా తగ్గినట్లు తెలిపారు. GRP సికింద్రాబాద్ పరిధిలో వివిధ నేరాలు, రక్షణ చర్యలు, సాంకేతిక ప్రయోగాలపై వివరాలను వెల్లడించారు.
- Sravan Kumar B
- Updated on: Dec 31, 2025
- 6:16 pm
డేంజర్ మాంజా.. ప్రాణాలు తీస్తున్న చైనా దారం.. కనిపిస్తే పోలీసులకు చెప్పండి..
బ్యాన్ చేసినా చైనా మాంజా అమ్మకాలు ఆగడం లేదు.. ఎక్కడికక్కడ గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు జరుగుతూ.. వాహనదారుల ప్రాణాలు తీస్తున్నాయి.. తాజాగా.. హైదరాబాద్ దిల్సూఖ్నగర్లో చైనా మంజా తగిలి యువకుడు గొంతు కోసుకున్న సంఘటన కలకలం రేపింది.. ఇలాంటి ప్రమాదాలు తెలంగాణలో తరచూ సంభవిస్తున్నా.. అమ్మకాలు మాత్రం ఆగడం లేదు..
- Sravan Kumar B
- Updated on: Dec 31, 2025
- 3:26 pm
Hyderabad: డోర్ ఓపెన్ చేసి ఉండటంతో లిఫ్ట్ వచ్చిందేమో అని కాలు పెట్టింది.. అంతే..
రంగారెడ్డి జిల్లాలో అపార్ట్మెంట్ లిఫ్ట్ నిర్లక్ష్యం ప్రాణం తీసింది. లిఫ్ట్ డోర్ ఓపెన్గా ఉండటంతో లిఫ్ట్ వచ్చిందని భావించి అడుగు వేసిన 60 ఏళ్ల మహిళ లిఫ్ట్ గుంతలో పడిపోయి మృతి చెందింది. మెయింటెనెన్స్ లోపాలు, సెన్సార్ వైఫల్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు.
- Sravan Kumar B
- Updated on: Dec 31, 2025
- 1:12 pm
ఎయిర్పోర్టులో అనుమానంగా కనిపించిన వ్యక్తి.. ఆపి చెక్ చేయగా..
ఒడిశాలోని భువనేశ్వర్ విమానాశ్రయంలో DRI అధికారులు భారీ ఎత్తున్న హైడ్రోపోనిక్ గాంజాను పట్టుకున్నారు. బ్యాంకాక్ నుండి వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీలో 3.93 కిలోల నిషేధిత మత్తు పదార్థాన్ని గుర్తించారు. ఈ పట్టుబడిన గంజా విలువ మార్కెట్లో సుమారు రూ.4 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని డ్రగ్ మూలం, సరఫరా మార్గాలపై దర్యాప్తు చేస్తున్నారు.
- Sravan Kumar B
- Updated on: Dec 31, 2025
- 1:09 pm
మిసెస్ ఇండియా 2025 గ్లోబల్ అంబాసిడర్గా హైదరాబాద్ యువతీ
మధ్యప్రదేశ్లోని హృదయ నాగరి హర్డా నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిలైన లయన్ మితాలి అగర్వాల్ (కావ్య) 'మిసెస్ ఇండియా 2025 – గ్లోబల్ అంబాసిడర్', 'మిసెస్ ఇండియా కాంజెనియాలిటీ 2025' టైటిల్స్ గెలుచుకున్నారు. రాజస్థాన్లోని జైపూర్లో జైబాగ్ ప్యాలెస్లో డిసెంబర్ 18 నుంచి 22 వరకు జరిగిన ప్రతిష్ఠాత్మక Mrs India పేజెంట్లో మితాలి ఈ రెండూ టైటిల్స్ గెలుచుకున్నారు.
- Sravan Kumar B
- Updated on: Dec 31, 2025
- 11:20 am
Big Alert: మిత్రమా బిగ్ అలర్ట్.. మరికొన్ని గంటలే ఛాన్స్.. లేకుంటే రూ.1000 ఫైన్ చెల్లించాల్సిందే!
Big Alert: వినియోగదారులకు బిగ్ అలర్ట్.. మరి కొన్ని గంటలే ఛాన్స్ ఉంది. ఎందుకంటే డిసెంబర్ 31తో గడువు ముగియనుంది. లేకుంటే వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే ఏ మాత్రం ఆలస్యం, నినర్లక్ష్యం చేయకుండా ఈ పని చేయని వారు వెంటనే చేయడం మంచిది. లేకుంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఉంటుందని గుర్తించుకోండి..
- Sravan Kumar B
- Updated on: Dec 31, 2025
- 12:09 pm
Telangana: అయ్యో బిడ్డా.. ఎంత పనిచేశావ్.. యువకుడి ఆత్మహత్య.. సెల్ఫీ వీడియోలో ఏం చెప్పాడంటే..?
ఆన్లైన్ గేమింగ్ యువత ప్రాణాలను బలిగొంటోంది. ఎంతోమంది అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తెలంగాణలో నెల రోజుల్లో ఏడుగురు మరణించడం దీని తీవ్రతను తెలుపుతోంది. చిన్న లాభాలతో ఆశపెట్టి, ఆ తర్వాత పెద్ద నష్టాలను మిగిల్చే ఈ గేమింగ్పై ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. తాజాగా మరో ప్రాణం ఈ వ్యసనానికి బలైంది.
- Sravan Kumar B
- Updated on: Dec 27, 2025
- 7:40 pm
Viral Video: ఎరక్కపోయి, ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో.. పాపం బైక్ దొంగిలిద్దామని వెళ్లి..
ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అనే సమెతను మీరు వినే ఉంటారు.. అచ్చం అలాంటి ఘటనే ఇప్పుడు హైదరాబాద్లో వెలుగు చూసింది. బైక్ దొంగతనానికని వెళ్లిన ఒక దొంగకు ఊహించని పరిణామం ఎదురైంది. బైక్ తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా యజమాని అప్రమత్తం కావడంతో అడ్డంగా బుక్కయాడు.
- Sravan Kumar B
- Updated on: Dec 27, 2025
- 12:07 pm
Telangana: ఆటోలో గోల్డ్ బ్యాగ్ వదిలేసిన ప్యాసింజర్.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ ఇది
ఆటో ఓ వ్యక్తి తన ఇంటికి బయల్దేరాడు. ఇల్లు వచ్చింది.. డ్రైవర్ కు డబ్బులు ఇచ్చి.. దిగిపోయాడు. ఇంటి లోపలికి ఇలా అడుగుపెట్టాడో లేదో.. ఆటోలో బ్యాగ్ మర్చిపోయానని గుర్తొచ్చింది. వెనక్కి తిరిగి చూస్తే అటో లేదు. ఆ తర్వాత జరిగిన సీన్ ఇది.
- Sravan Kumar B
- Updated on: Dec 24, 2025
- 11:17 am
మూడేళ్లుగా మూత పడిన కంపెనీలో కోట్ల విలవైన మెషినరీ మాయం.. ఇంతకీ ఎవరి పని..?
జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మూతపడిన సూపర్ మ్యాక్స్ బ్లేడ్ కంపెనీలో భారీ చోరీ జరిగింది. మూడు కోట్లకు పైగా విలువ చేసే మిషనరీ, ఇతర సామాగ్రి మాయం అయినట్టుగా కంపెనీ ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న సూపర్ మ్యాక్స్ బ్లేడ్ తయారీ యూనిట్ గత మూడేళ్లుగా మూతపడి ఉంది.
- Sravan Kumar B
- Updated on: Dec 20, 2025
- 10:51 pm
Hyderabad: డియర్ పొలీస్.. కొంచెం కమ్యూనికేషన్ పంచుకోండయ్యా..!
9 ఏళ్ల బాలిక మిస్సింగ్ కేసులో రెండు పోలీస్ స్టేషన్ల మధ్య సమన్వయ లోపం వెలుగులోకి వచ్చింది. అత్తాపూర్ పరిధిలో తప్పిపోయిన శివాని నాలుగు రోజుల తర్వాత కుటుంబానికి చేరడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి ..
- Sravan Kumar B
- Updated on: Dec 20, 2025
- 9:23 pm