AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sravan Kumar B

Sravan Kumar B

Correspondent - TV9 Telugu

sravan.boinepally@tv9.com
Follow On:
తెలంగాణ ఎక్సైజ్ దాడులు: ఒకవైపు కల్తీ మద్యం కాటు… మరోవైపు కాస్ట్లీ బ్రాండ్ల అక్రమ రవాణా!

తెలంగాణ ఎక్సైజ్ దాడులు: ఒకవైపు కల్తీ మద్యం కాటు… మరోవైపు కాస్ట్లీ బ్రాండ్ల అక్రమ రవాణా!

తెలంగాణ ఎక్సైజ్ STF రెండు వేర్వేరు దాడులలో భారీగా అక్రమ మద్యాన్ని పట్టుకుంది. పహాడ్ షరీఫ్‌లో 141 గోవా, ఇతర రాష్ట్రాల మద్యం బాటిళ్లు, శంషాబాద్ గండిగూడలో 4 లీటర్ల మద్యం, బీర్ స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయం గుండా అక్రమంగా తరలిస్తున్న నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ (NDPL) వలన రాష్ట్ర ఆదాయానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అక్రమ ముఠాలపై ఎక్సైజ్ బృందాలు నిఘా పెంచాయి.

Hyderabad: ప్రతిరోజూ అర్ధరాత్రి ఒకే టైమ్‌కు.. ఒకే ఇంటి ముందు.. సీసీటీవీలో షాకింగ్ విజువల్స్..

Hyderabad: ప్రతిరోజూ అర్ధరాత్రి ఒకే టైమ్‌కు.. ఒకే ఇంటి ముందు.. సీసీటీవీలో షాకింగ్ విజువల్స్..

అర్ధరాత్రి 12 గంటలు.. కాలనీ అంతా గాఢ నిద్రలో ఉంది. హఠాత్తుగా టపాసుల మోత.. పండగ కాదు.. కనీసం ఎవరి పుట్టినరోజు కూడా కాదు.. మరి ఈ టపాసుల హంగామా ఏంటి? ప్రతిరోజూ కరెక్ట్‌గా అదే సమయానికి.. అదే ఇంటి ముందు.. ఎవరు ఈ పని చేస్తున్నారు..? మీర్‌పేట్ జైల్ కాలనీని భయపెడుతున్న ఈ టపాసుల కలకలం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి?

ఆ ఫ్యాక్టరీలో జోరుగా గంజాయి అమ్మకాలు.. కూలీలు, ఉద్యోగులే టార్గెట్‌..! కట్‌ చేస్తే..

ఆ ఫ్యాక్టరీలో జోరుగా గంజాయి అమ్మకాలు.. కూలీలు, ఉద్యోగులే టార్గెట్‌..! కట్‌ చేస్తే..

తెలంగాణ వికారాబాద్‌లోని పరిగి సుగుణ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద ఎక్సైజ్ పోలీసులు 1 కేజీ 50 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బీహార్, ఒడిస్సా నుంచి వచ్చిన నితీష్ రఝాక్, సూరజ్ కుమార్‌లను అరెస్టు చేశారు. తోటి లేబర్లకు గంజాయి విక్రయిస్తుండగా పక్కా సమాచారంతో దాడి చేశారు. వీరిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. తెలంగాణలో గంజాయి అక్రమ రవాణా పెరుగుతుందని ఎక్సైజ్ హెచ్చరించింది.

ఆయన అన్నం పెట్టాడు.. ఆవిడ కన్నం వేసింది..! కట్‌చేస్తే..36 గంటల్లోనే

ఆయన అన్నం పెట్టాడు.. ఆవిడ కన్నం వేసింది..! కట్‌చేస్తే..36 గంటల్లోనే

హైదరాబాద్ హబ్సిగూడలోని రిటైర్డ్ సైంటిస్ట్ ఇంట్లో జరిగిన 9 తులాల బంగారు దొంగతనాన్ని ఓయూ పోలీసులు కేవలం 36 గంటల్లో ఛేదించారు. పని మనిషి అల్లం తేజస్విని ఆర్థిక ఇబ్బందులతో చోరీకి పాల్పడగా, పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. వేగవంతమైన దర్యాప్తుకు ఓయూ ఏసీపీ జగన్ సిబ్బందిని అభినందించారు. పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే తెలియజేయాలని సూచించారు.

Basara: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మ హత్య

Basara: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మ హత్య

బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న వసంత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ సంఘటనపై పూర్తి వివరాలు, అధికారిక స్పందనల కోసం నివేదికను చూడండి. బాసర ట్రిపుల్ ఐటీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

ఇద్దరు యూట్యూబర్ల మధ్య లవ్.. కలిసిన రెండు రోజులకే కోమలి సూసైడ్.. అసలు ఆరోజు ఏం జరిగింది..?

ఇద్దరు యూట్యూబర్ల మధ్య లవ్.. కలిసిన రెండు రోజులకే కోమలి సూసైడ్.. అసలు ఆరోజు ఏం జరిగింది..?

Bsc చదువుతూ.. యూట్యూబర్‌గా రాణిస్తున్న కోమలి బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్ మహానగరం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్య చేసుకుంది. మూడు సంవత్సరాలు మరో యుట్యూబర్ తో ప్రేమలో ఉన్న కోమలి.. తీవ్ర మనస్థాపంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న పోలీసులు అనుమానిస్తున్నారు.

వికారాబాద్ ప్రమాదం: రంగాపూర్‌లో ఇన్నోవా బీభత్సం..ఒక కారు, బైకులు ధ్వంసం. .ఒకరు మృతి

వికారాబాద్ ప్రమాదం: రంగాపూర్‌లో ఇన్నోవా బీభత్సం..ఒక కారు, బైకులు ధ్వంసం. .ఒకరు మృతి

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్‌లో వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు బైకులను, మరో కారును ఢీకొట్టడంతో మాదారం గ్రామానికి చెందిన కాముని నర్సింలు (48) మరణించారు, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి అధిక వేగం కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు ఇరుకైన రహదారులు, ట్రాఫిక్ సమస్యలపై స్పీడ్ బ్రేకర్లు డిమాండ్ చేస్తున్నారు.

ల్యాండ్ మార్క్ హోటల్ యజమాని కుటుంబం ఆత్మహత్య

ల్యాండ్ మార్క్ హోటల్ యజమాని కుటుంబం ఆత్మహత్య

హైదరాబాద్ అంబర్‌పేట్‌లో ల్యాండ్‌మార్క్ హోటల్ యజమాని రామ్‌రాజ్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. మృతులు రామ్‌రాజ్, మాధవి, శశాంక్. సూసైడ్ నోట్‌లో ఆర్థిక ఇబ్బందులు కారణమని రామ్‌రాజ్ పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రామ్‌రాజ్ సోదరుడు ఆర్థిక సమస్యలను ఖండించారు. కూతురు అమూల్యకు ఆస్తులు రాసినట్లు తెలుస్తోంది.

Telangana: సమ్మర్ స్టార్టింగ్‌లో ఈ వర్షాలేంటి భయ్యా.! హైదరాబాద్‌లో అకాల వర్షాలు.. తాజా రిపోర్ట్

Telangana: సమ్మర్ స్టార్టింగ్‌లో ఈ వర్షాలేంటి భయ్యా.! హైదరాబాద్‌లో అకాల వర్షాలు.. తాజా రిపోర్ట్

ఎండలు ముదురుతున్న తరుణంలో తెలుగు రాష్ట్రాలను మరోసారి వరుణుడు పలకరించాడు. అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లోని LB నగర్, వనస్థలిపురం,హయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం రోడ్లను జలమయం చేసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమై ఉరుములు,మెరుపులతో వర్షం దంచికొట్టింది. దీంతో పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ప్రధాన రోడ్లు నీటమునిగాయి.

Gold: ధర తగ్గిందని బంగారం కొంటున్నారా..? ఈ జాగ్రత్తలు మస్ట్..

Gold: ధర తగ్గిందని బంగారం కొంటున్నారా..? ఈ జాగ్రత్తలు మస్ట్..

Gold Buying Tips: బంగారం కేవలం అలంకారం మాత్రమే కాదు, సురక్షితమైన పెట్టుబడి. అయితే, కొనుగోలులో అవగాహన లేకుంటే మోసపోయే ప్రమాదం ఉంది. హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ వంటి వివరాలను సరిచూసుకోవడం అత్యవసరం. స్వచ్ఛత, ఖర్చులను అర్థం చేసుకోవడం ద్వారా వినియోగదారులు జాగ్రత్తగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Telangana: అల్వాల్‌లో రెచ్చిపోయిన దొంగలు.. జ్యువెలరీ షాపులో షట్టర్ పగలగొట్టి బీభత్సం.. వీడియో వైరల్..

Telangana: అల్వాల్‌లో రెచ్చిపోయిన దొంగలు.. జ్యువెలరీ షాపులో షట్టర్ పగలగొట్టి బీభత్సం.. వీడియో వైరల్..

నగరంలో గజదొంగలు గడగడలాడిస్తున్నారు. ఒకవైపు జ్యువెలరీ షాపుల షట్టర్లు పగలగొడుతూ.. మరోవైపు ఒకే రాత్రి వరుసగా ఇళ్లపై పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అల్వాల్‌లో కిలో వెండి ఆభరణాల చోరీ కలకలం రేపగా.. చెంగిచెర్లలో 9 ఇళ్లలో బీభత్సం సృష్టించిన అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

హైదరాబాద్ లో అంతర్జాతీయ హెల్త్ కేర్ సదస్సు.. క్యాన్సర్ మహమ్మారిపై చర్చ

హైదరాబాద్ లో అంతర్జాతీయ హెల్త్ కేర్ సదస్సు.. క్యాన్సర్ మహమ్మారిపై చర్చ

హైదరాబాద్ అంతర్జాతీయ హెల్త్ కేర్ సదస్సుకు వేదికైంది. హైటెక్ సిటీ నోవాటెల్‌లో ఐదు దేశాల ఆరోగ్యశాఖ మంత్రులు, 5500 మంది వైద్యులు పాల్గొన్నారు. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కోవడం, ఐటీ వినియోగం, వైద్యరంగ మార్పులను ప్రజలకు చేరవేయడంపై చర్చ జరిగింది. అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి ఈ సదస్సు వైద్య రంగానికి ఎంతో ఉపయుక్తమన్నారు.