AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sravan Kumar B

Sravan Kumar B

Correspondent - TV9 Telugu

sravan.boinepally@tv9.com
Follow On:
ప్రభుత్వ వేలంలో మరోసారి కోకాపేట భూములకు రికార్డు ధర

ప్రభుత్వ వేలంలో మరోసారి కోకాపేట భూములకు రికార్డు ధర

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కోకాపేట నియోపోలిస్‌లో హెచ్ఎండిఏ నిర్వహించిన భూముల వేలం కొత్త రికార్డులు సృష్టించింది. ప్లాట్ నంబర్ 15, 16లలో ఎకరం ధర రూ. 151.25 కోట్లు, రూ. 147.75 కోట్లకు చేరింది. జీహెచ్ఆర్, గోద్రేజ్ సంస్థలు వీటిని దక్కించుకున్నాయి. ఇది మునుపటి రికార్డులను అధిగమించింది.

రూ. 10 కోట్లకు విల్లా.. హైదరాబాద్‌లో భారీ డిమాండ్‌

రూ. 10 కోట్లకు విల్లా.. హైదరాబాద్‌లో భారీ డిమాండ్‌

హైదరాబాద్‌లో విల్లాలు, లగ్జరీ అపార్ట్‌మెంట్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఐటీ ఉద్యోగులు కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తూ, తమ కార్యాలయాలకు దగ్గరగా ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. విల్లాలు స్టేటస్ సింబల్‌గా మారడంతో, కాలుష్య రహిత వాతావరణంలో నివసించడానికి కోటి రూపాయల వరకు వెచ్చించేందుకు వెనుకాడటం లేదు. షంషాబాద్, కిస్మత్‌పూర్‌లలో విల్లా నిర్మాణాలు పెరిగాయి.

నిచ్చెన ఎక్కితేనే బ్యాంకు సేవలు.. డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా రిస్క్‌ చేస్తేనే

నిచ్చెన ఎక్కితేనే బ్యాంకు సేవలు.. డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా రిస్క్‌ చేస్తేనే

ఒడిశాలోని భద్రక్ జిల్లా ఎస్‌బీఐ శాఖ వద్ద అక్రమణల తొలగింపులో భాగంగా మెట్లు కూల్చివేయబడ్డాయి. దీంతో కస్టమర్లు, సిబ్బంది మొదటి అంతస్తులోని బ్యాంకులోకి వెళ్లడానికి నిచ్చెనను ఉపయోగించాల్సి వచ్చింది. ఈ వింత పరిస్థితి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నోటీసులను పట్టించుకోని భవన యజమాని నిర్లక్ష్యమే దీనికి కారణం. ప్రస్తుతం స్టీల్ మెట్లు ఏర్పాటు చేశారు.

శుభకార్యాలకు లాంగ్‌ బ్రేక్‌..! శుక్ర మౌడ్యమి కాలం నిజంగా అశుభ సమయమా..?

శుభకార్యాలకు లాంగ్‌ బ్రేక్‌..! శుక్ర మౌడ్యమి కాలం నిజంగా అశుభ సమయమా..?

బుధవారం నుంచి శుక్ర మౌడ్యమి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో శుభ కార్యక్రమాలు బంద్ అయ్యాయి. మరి పూజలు చేయాలా? వద్దా? అసలు ఈ శుక్ర మౌడ్యమి అంటే ఏమిటి? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

బైకర్‌ను ఆపిన ట్రాఫిక్‌ పోలీస్‌.. అతని బైక్‌పై ఉన్న చలాన్లు చూసి షాక్‌

బైకర్‌ను ఆపిన ట్రాఫిక్‌ పోలీస్‌.. అతని బైక్‌పై ఉన్న చలాన్లు చూసి షాక్‌

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బంజారాహిల్స్‌లో ఫోన్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన ఒక వ్యక్తి వాహనంపై 42 పెండింగ్ చలాన్లు (రూ.16,665) వెలుగులోకి వచ్చాయి. హెల్మెట్, ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్ ఉల్లంఘనలకు అతను బాధ్యుడు. చలాన్లు చెల్లించ నిరాకరించడంతో పోలీసులు అతని యాక్టివాను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. పెండింగ్ చలాన్లను పట్టించుకోకపోతే వాహనం సీజ్ అవుతుందని హెచ్చరిస్తున్నారు.

పోలీసుల అయ్యప్ప మాలధారణపై ఆంక్షలు.. బ్లాక్ డ్రెస్, గడ్డం, జుట్టు పెంచుకోవడంపై నిషేధం!

పోలీసుల అయ్యప్ప మాలధారణపై ఆంక్షలు.. బ్లాక్ డ్రెస్, గడ్డం, జుట్టు పెంచుకోవడంపై నిషేధం!

తెలంగాణ పోలీసు శాఖ మతపరమైన దీక్షలపై ఆదేశాలు జారీ చేసింది. పోలీసు శాఖ డ్యూటీలో ఉన్నపుడే అయ్యప్ప దీక్ష లేదా ఇలాంటి మతపరమైన దీక్షలు చేపట్టరాదని పేర్కొంది. దీక్ష చేసే పోలీస్ సిబ్బంది తప్పనిసరిగా సెలవు తీసుకుని మాత్రమే కొనసాగించాలని వెల్లడించారు. సెలవు తీసుకోకుండా మతాచారాలు పాటిస్తే చర్యలు ఉంటాయని పోలీస్ శాఖ హెచ్చరించింది.

ఆరోగ్యానికి మంచిదని డ్రైఫ్రూట్స్ అతిగా తినేస్తున్నారా.. మీ గుండెకు ముప్పే!

ఆరోగ్యానికి మంచిదని డ్రైఫ్రూట్స్ అతిగా తినేస్తున్నారా.. మీ గుండెకు ముప్పే!

డ్రై ఫ్రూట్స్‌లో అత్యంత మేలు కలిగించే డ్రై ఫ్రూట్స్ అంటే, బాదం, వాల్‌నట్స్ ముందు వరసలో ఉంటాయి. వీటిలో పోషకాలు మెండుగా ఉంటాయి అందువలన వీటిని ప్రతి రోజూ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉటాయి. ముఖ్యంగా, బాదంపప్పుల్లో విటమిన్ E, మ్యాగ్నీషియం, ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువుంటాయి. అందువలన బాదం తినడం వలన ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరచడమే కాకుండా, చర్మ ఆరోగ్యానికిచ బరువు నియంత్రణకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

దొరికితే దొంగ.. లేదంటే దొర..  దేశంలో అత్యధికంగా అవినీతి జరిగే ప్రభుత్వ శాఖ ఎదో తెలుసా..?

దొరికితే దొంగ.. లేదంటే దొర.. దేశంలో అత్యధికంగా అవినీతి జరిగే ప్రభుత్వ శాఖ ఎదో తెలుసా..?

దేశంలో అవినీతిపై ఓ స్వతంత్ర సంస్థ సర్వే నిర్వహించింది. లక్షలాది మంది నుంచి వివరాలు సేకరించింది. వారిలో 51 శాతం మంది నుంచి తాము లంచం ఇచ్చామనే సమాధానం వచ్చింది. ఆస్తి రిజిస్ట్రేషన్, పోలీస్, మున్సిపాలిటీ వంటి శాఖల్లో ఎక్కువగా అవినీతి జరుగుతోందని వెల్లడించారు. మరి దేశవ్యాప్తంగా ఏయే ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఎక్కువగా ఉందో తెలుసుకుందాం.

విమాన ప్రమాదం.. శిఖా గార్గ్‌ కుటుంబానికి రూ.317 కోట్ల పరిహారం! కోర్టు సంచలన తీర్పు..

విమాన ప్రమాదం.. శిఖా గార్గ్‌ కుటుంబానికి రూ.317 కోట్ల పరిహారం! కోర్టు సంచలన తీర్పు..

2019 ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 MAX ప్రమాదంలో శిఖా గార్గ్ మరణించిన ఘటనలో, ఆమె భారతీయ కుటుంబానికి 35.85 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 317 కోట్లు) పరిహారంగా చెల్లించాలని చికాగో కోర్టు బోయింగ్‌ను ఆదేశించింది. ఆరేళ్ల న్యాయ పోరాటం తర్వాత ఈ తీర్పు వచ్చింది.

మెట్ల బావిలో మ్యూజిక్‌ కాన్సెర్ట్‌లు! మంగ్లీ, హేమచంద్రా వంటి స్టార్లు కూడా వస్తారు..

మెట్ల బావిలో మ్యూజిక్‌ కాన్సెర్ట్‌లు! మంగ్లీ, హేమచంద్రా వంటి స్టార్లు కూడా వస్తారు..

సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట్ మెట్ల బావి 17వ శతాబ్దపు నిజాం నిర్మాణ అద్భుతం. ఒకప్పుడు ప్రజల దాహం తీర్చిన ఈ బావి, శిథిలావస్థ నుండి తెలంగాణ ప్రభుత్వం కృషితో పునరుద్ధరించబడింది. ఇప్పుడు ఇది పర్యాటక కేంద్రంగా, సంగీత కచేరీలకు ప్రసిద్ధ వేదికగా మారింది.

అయ్యో.. ఆమె ఏం పాపం చేసిందిరా.. అలా చంపేశారు

అయ్యో.. ఆమె ఏం పాపం చేసిందిరా.. అలా చంపేశారు

పశ్చిమగోదావరి ముద్దాపురం నాగహరిత అనుమానాస్పద మృతి కేసులో సంచలనం. మొదట షార్ట్ సర్క్యూట్‌గా భావించినా, ఫోరెన్సిక్ నివేదిక హత్యను ధృవీకరించింది. తలపై బలమైన గాయాలు, పెట్రోల్‌తో తగలబెట్టినట్లు వెల్లడైంది. ఆస్తి తగాదాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వివాదాస్పదంగా మారిన ఈ కేసులో తదుపరి విచారణ కీలకం.

భర్త నుంచి హెచ్‌ఐవీ.. భార్య ఏం చేసిందో తెలుసా? వీడియో

భర్త నుంచి హెచ్‌ఐవీ.. భార్య ఏం చేసిందో తెలుసా? వీడియో

కర్ణాటకలోని హోసూరులో ఓ కుటుంబంలో హెచ్‌ఐవీ చిచ్చు రేపింది. భర్తకు హెచ్‌ఐవీ సోకడంతో, భార్య, కుమారుడికి కూడా వైరస్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన తల్లి తన తొమ్మిదేళ్ల కుమారుడిని హత్య చేసి, ఆపై తాను ఆత్మహత్య చేసుకుంది. హెచ్‌ఐవీ సోకినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదని జిల్లా ఎయిడ్స్ విభాగం అధికారులు తెలిపారు.