అయ్యో.. ఎంత ఘోరం.. ట్యాంకర్ చక్రాల కింద పడి నలిగిన యువకుడు.. వీడియో చూస్తే..
హైదరాబాద్లోని కూకట్పల్లి (KPHB) పరిధిలో సోమవారం ఉదయం అత్యంత భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక యువకుడి ద్విచక్ర వాహనాన్ని వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో, ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్యాంకర్ వెనుక చక్రాలు యువకుడి తల పైనుంచి వెళ్లడంతో తల భాగం ఛిద్రమై, మెదడు బయటకు వచ్చిన దృశ్యాలు చూపరులను కలచివేశాయి.
- Sravan Kumar B
- Updated on: Apr 28, 2026
- 8:21 pm
Telangana: ఇంతకాలం టైంపాస్కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
ప్రేమ ఊపిరి పోస్తుంది అనుకుంటే అతడి ఊపిరి తీసింది. ఓయూలో ఓ విద్యార్థి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన విద్యార్థులు అతడిని ఆస్పత్రికి తరలించినా.. లాభం లేకుండా పోయింది. యువతి అన్న ఆ ఒక్క మాటతో కుంగిపోయిన యువకుడు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అసలు ఏం జరిగింది..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Sravan Kumar B
- Updated on: Apr 28, 2026
- 4:32 pm
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ సెగ.. పుకార్లతో పానిక్ బయ్యింగ్.. అప్రమత్తమైన తెలంగాణ సర్కార్!
తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం కనిపిస్తున్న క్యూలైన్లు, "నో స్టాక్" బోర్డులు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఈ ఇంధన సెగ, ఇప్పుడు తెలంగాణ సరిహద్దు జిల్లాల మీదుగా రాష్ట్రవ్యాప్త చర్చకు దారితీసింది. అసలు ఈ పరిస్థితికి కారణం ఇంధన కొరత కాదు, కేవలం "పానిక్ బయ్యింగ్" (భయంతో కొనుగోలు చేయడం), ధరల వ్యత్యాసమేనని తాజా లెక్కలు చెబుతున్నాయి.
- Sravan Kumar B
- Updated on: Apr 28, 2026
- 9:28 am
Hyderabad: త్రేతాయుగంలో రాముడు.. కలియుగంలో మహిళలు.. 10 గంటల్లోనే రామసేతు ప్రయాణం..
హైదరాబాద్కు చెందిన మహిళల బృందం అరుదైన రికార్డ్ సృష్టించింది. రామసేతును ఈది రికార్డ్ నెలకొల్పింది. శ్రీలంక నుంచి రామేశ్వరం వరకు సముద్రాన్ని ఈదారు. 59 కిలోమీటర్ల దూరాన్ని 10 గంటల్లో పూర్తి చేశారు. రామసేతువును ఈదిన తొలి మహిళలుగా రికార్డ్ నెలకొల్పారు.
- Sravan Kumar B
- Updated on: Apr 27, 2026
- 7:47 pm
Hyderabad: ఫ్రెండ్ పిలిచాడని లాడ్జ్కు వెళ్లిన మహిళ.. కట్చేస్తే.. తెల్లారే సరికి
హైదరాబాద్ నగరంలో దారుణ హత్య జరిగింది. చందానగర్లోని ఓ లాడ్జ్లో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఆదివారం తెల్లవారుజామున లాడ్జ్లో మహిళ మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Sravan Kumar B
- Updated on: Apr 26, 2026
- 7:45 pm
Medchal: అపార్ట్మెంట్స్, విల్లాల మురుగునీరు చెరువులోకి మలిపారు.. కట్ చేస్తే..
మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి పరిధిలో చేపల చెరువుల్లో చేపలు మృత్యువాత పడుతున్నాయి. సమీపంలోని విల్లాలు, అపార్ట్మెంట్ల నుంచి వచ్చే మురుగునీరు చెరువులోకి చేరుకుంటున్నాయి. దీంతో చెరువులోని నీరు కలుషితం అవుతున్నాయి. దీని వల్ల చేపలు చనిపోతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- Sravan Kumar B
- Updated on: Apr 26, 2026
- 7:02 pm
Mee Ticket: టికెట్ ఏదైనా.. యాప్ ఒక్కటే! హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్న్యూస్
మీ టికెట్ యాప్తో తెలంగాణలో ఆర్టీసీ, మెట్రో, పార్కులు, దేవాలయాల టికెట్లను ఇంటి నుంచే సులభంగా బుక్ చేయండి. వేసవిలో క్యూ లైన్లు లేకుండా, మీసేవ ద్వారా వచ్చిన ఈ యాప్ 219 ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. కేవలం ఒక క్లిక్తో ప్రయాణం, సందర్శన ప్రవేశ టికెట్లు పొందండి.
- Sravan Kumar B
- Updated on: Apr 25, 2026
- 10:12 pm
నకిలీ వెండి మోసం! పైపై మెరుపులతో నిండా ముంచేశారు!
సికింద్రాబాద్లో నకిలీ వెండి బార్లతో వ్యాపారులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. రూ.15 లక్షల నష్టం వాటిల్లగా, 8.4 కిలోల నకిలీ వెండి స్వాధీనం చేసుకున్నారు.
- Sravan Kumar B
- Updated on: Apr 25, 2026
- 9:50 pm
Hyderabad: గతంలో రాత్రి చేసే పనులు.. ఇప్పుడు పట్టపగలే.. వీళ్లు ఏం చేస్తున్నారో మీరే చూడండి..
ఉప్పల్ భగాయత్.. ఒకప్పుడు ప్రశాంతమైన లేఅవుట్, ఇప్పుడు ఆకతాయిల అడ్డా.. పట్టపగలే బైక్ రేసింగ్లు, అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ల హల్చల్తో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ ఆగడాలపై మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ కు అపార్ట్మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. అసలు ఉప్పల్ భగాయత్ రోడ్లపై జరుగుతున్న అరాచకాలేంటి? అనే విషయాలు తెలుసుకుందాం..
- Sravan Kumar B
- Updated on: Apr 25, 2026
- 9:43 pm
నమ్మినవారే మోసం చేశారంటూ సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి… చివరికి ఏం జరిగిందంటే?
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో గ్రామపెద్దల సమక్షంలో జరిగిన భూమి విక్రయ ఒప్పందం మోసంగా మారి ఓ వికలాంగుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. కొండాపురం బాబాయ్య తన 1 ఎకరం 20 గుంటల భూమిని రూ.1,30,000కి రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ కొనుగోలుదారులు డబ్బు చెల్లించకపోవడంతో ఆవేదన చెందాడు.
- Sravan Kumar B
- Updated on: Apr 24, 2026
- 8:57 pm
Hyderabad: మియాపూర్ పోలీసుల చేతిలో వరుస ఇళ్ల దొంగ.. 45 కేసుల చరిత్ర
వరుస దొంగనాలకు పాల్పడుతున్న నేరస్తుడిని మియాపూర్ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వాచ్మన్ రూమ్లను గుర్తించి వాళ్లు లేని సమయంలో ఇతడు దొంగనాలకు పాల్పడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. గతంలోనే ఇతడిపై కేసులు ఉన్నాయి.
- Sravan Kumar B
- Updated on: Apr 24, 2026
- 8:17 pm
పుష్పలాగా ఎవ్వరు అడ్డు వచ్చినా తగ్గేదేలే.. ఫుట్పాత్లన్నీ క్లియర్
GHMC అధికారులు హైకోర్టు ఆదేశాలతో ఫుట్పాత్ల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపారు. పాదచారులకు, ట్రాఫిక్కు ఆటంకంగా మారిన ఆక్రమణలను తొలగించారు. బడంగ్పేట సర్కిల్లో అత్యధికంగా 333 దుకాణాలు సహా మొత్తం 653 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ నిరంతర డ్రైవ్తో ట్రాఫిక్ ప్రమాదాలు తగ్గి, ప్రజల భద్రత పెరుగుతుందని అధికారులు తెలిపారు.
- Sravan Kumar B
- Updated on: Apr 18, 2026
- 9:32 pm