AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా అత్త త్వరగా చనిపోవాలి స్వామి.. అంటూ దేవుడి హుండీలో వింత నోటు వైరల్‌..! ఎక్కడంటే..

కర్ణాటకలోని ఓ ఆలయ హుండీలో లభించిన రూ.20 నోటు సంచలనం సృష్టించింది. ఆ నోటుపై "వచ్చే ఏడాది జాతరకు ముందే నా అత్తగారు చనిపోవాలి" అనే వింత కోరిక రాయబడి ఉంది. ఆలయ నిర్వాహకులను, ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. కొందరు కుటుంబ ఉద్రిక్తతలు కారణంగా భావిస్తే, మరికొందరు దీనిని కేవలం జోక్‌గా కొట్టిపారేస్తున్నారు.

మా అత్త త్వరగా చనిపోవాలి స్వామి.. అంటూ దేవుడి హుండీలో వింత నోటు వైరల్‌..! ఎక్కడంటే..
Let My Mother In Law Die
Jyothi Gadda
|

Updated on: Feb 24, 2026 | 7:08 PM

Share

20 రూపాయల నోటుతో పాటు ఒక చిన్న కాగితం ముక్క ఫోటో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆ నోట్‌పై రాసి వున్న ఒక సందేశం కారణంగా ఇప్పుడా అది ప్రజల దృష్టిని ఆకర్షించింది. అది కూడా ఒక ఆలయంలోని విరాళాల పెట్టెలో కనిపించడం మరింత దిగ్భ్రాంతికరంగా మారింది. విస్తృతంగా వైరల్‌ అవుతున్న ఈ ఫోటో నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి తన అత్తగారి చావును కోరుకుంటూ దేవుడిని వేడుకుంటూ రాసిన కోరికను తెలియజేస్తుంది.

ఈ సంఘటన ఇటీవల కర్ణాటకలోని కలబురగిలోని అఫ్జల్‌పూర్ తాలూకా కటదర్గి ప్రాంతంలో ఉన్న భాగ్యవంతి దేవి ఆలయంలో చోటుచేసుకుంది. ఇటీవల ఆలయంలో ఒక జాతర జరిగింది. జాతర తర్వాత కానుక పెట్టె తెరిచి డబ్బులు లెక్కపెడుతున్నప్పుడు, ఈ నోట్ వెలుగులోకి వచ్చింది. ఆ కాగితంలో ఇలా రాసి ఉంది, దేవా నా దుఃఖాన్ని తొలగించు… వచ్చే ఏడాది జాతరకు ముందే నా అత్తగారు చనిపోవాలి ఈ సందేశాన్ని చదివి ఆలయ నిర్వాహకులు కూడా ఆశ్చర్యపోయారు. సాధారణంగా భక్తులు కానుకల పెట్టెలో కుటుంబం ఆనందం, శాంతి, ఉద్యోగం, పిల్లలు, డబ్బు, ఆరోగ్యం లేదా శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. అయితే, ఎవరికైనా మరణం కావాలని కోరిక వ్యక్తం చేయడం, దానిని దేవుని ముందు సమర్పించడం చాలా అరుదు.

ఆ నోట్ పై పేరు లేదా ఇతర ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో ఆ సందేశాన్ని కోడలు రాసిందా లేక అల్లుడు రాశాడా అనేది కూడా స్పష్టంగా తెలియదని ఆలయ నిర్వాహకులు తెలిపారు. తమ ఇనెళ్ల వృత్తి జీవితంలో ఇలాంటి కొత్త, వింత డిమాండ్ ఎప్పుడూ చూడలేదని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే గ్రామంలో చర్చ మొదలైంది. దీనిపై ప్రజలు భిన్నమైన కామెంట్స్‌ వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కొందరు దీనిని తీవ్రమైన కుటుంబ ఉద్రిక్తత ఫలితంగానే ఇలాంటి కోరిక వ్యక్తం చేశారని భావిస్తున్నారని, మరికొందరు ఇది ఎగతాళి లేదా కోపంతో జరిగి ఉంటుందని చెబుతున్నారు. ఈ సందేశం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. ఆలయ నిర్వహకులు మాత్రం ఆ నోటును కేవలం వింత ప్రార్థనగా కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే ఇది దర్యాప్తుకు సంబంధించిన విషయం కాదు. ప్రతి భక్తుడు తమ భావాల ప్రకారం విరాళాల పెట్టెలో ఏదో ఒకటి సమర్పిస్తారు. ఈ మెసేజ్ కూడా దానిలో ఒక భాగం. కానీ ఇది కొంచెం భిన్నంగా, షాకింగ్‌గా ఉందన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సేవా తీర్థంలో తొలి కేబినెట్ సమావేశంపై మోదీ ట్వీట్
సేవా తీర్థంలో తొలి కేబినెట్ సమావేశంపై మోదీ ట్వీట్
అతని ఎపిసోడ్ వల్ల చాలా హర్ట్ అయ్యా..
అతని ఎపిసోడ్ వల్ల చాలా హర్ట్ అయ్యా..
మా అత్త త్వరగా చనిపోవాలి.. అంటూ దేవుడి హుండీలో వింత నోటు వైరల్‌..
మా అత్త త్వరగా చనిపోవాలి.. అంటూ దేవుడి హుండీలో వింత నోటు వైరల్‌..
ట్విన్స్‌ డే రోజు అరుదైన ఘటన..
ట్విన్స్‌ డే రోజు అరుదైన ఘటన..
పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీలను ఆశ్రయిస్తున్నారా.. జాగ్రత్త
పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీలను ఆశ్రయిస్తున్నారా.. జాగ్రత్త
వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త
వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త
ఇంగ్లండ్‌తో నేడు బిగ్ ఫైట్..పాకిస్థాన్ సెమీస్ ఆశలు గట్టెక్కేనా?
ఇంగ్లండ్‌తో నేడు బిగ్ ఫైట్..పాకిస్థాన్ సెమీస్ ఆశలు గట్టెక్కేనా?
రైలు నడిపే లోకో పైలట్ జీతం ఎంతో తెలుసా..? మీరు అస్సలు ఊహించలేరు..
రైలు నడిపే లోకో పైలట్ జీతం ఎంతో తెలుసా..? మీరు అస్సలు ఊహించలేరు..
అయ్యప్పమాలలో వెడ్డింగ్ పార్టీకి రామ్ చరణ్.. అల్లు శిరీష్ క్లారిటీ
అయ్యప్పమాలలో వెడ్డింగ్ పార్టీకి రామ్ చరణ్.. అల్లు శిరీష్ క్లారిటీ
డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ ఏమన్నారంటే..
డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ ఏమన్నారంటే..