AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NZ vs SL: శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?

పాకిస్థాన్‌కు ఇప్పటివరకు రెండు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క పాయింట్ మాత్రమే ఉంది. అంతేకాకుండా నెట్ రన్ రేట్ -0.461గా ఉండడం వారి పరిస్థితిని మరింత బలహీనంగా చేస్తోంది. శ్రీలంకతో మిగిలిన చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిచినా కూడా న్యూజిలాండ్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ సాధించడం కష్టమే.

NZ vs SL: శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
Pakistan Cricket
Venkata Chari
|

Updated on: Feb 25, 2026 | 11:34 PM

Share

సూపర్-8 దశలో జరిగిన కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ శ్రీలంకను భారీ తేడాతో ఓడించి సెమీఫైనల్‌కు చేరే తన అవకాశాలను మరింత బలపరిచింది. ఈ ఘన విజయం పాకిస్థాన్ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. గ్రూప్ బీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ ముందుకు దూసుకెళ్లగా, పాకిస్థాన్ మూడో స్థానానికి జారింది.

కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఫిబ్రవరి 25న జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ చేసి శ్రీలంకకు 169 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ప్రతిగా శ్రీలంక 20 ఓవర్లు ఆడినప్పటికీ లక్ష్యానికి చాలా దూరంగా నిలిచింది. న్యూజిలాండ్ బౌలర్లు శ్రీలంకను 107 పరుగులకే కట్టడి చేయడంతో కివీస్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. ఈ ఫలితంతో శ్రీలంక సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించగా, పాకిస్థాన్ టోర్నీ నుంచి బయటపడే ప్రమాదం పెరిగింది.

న్యూజిలాండ్ సెమీఫైనల్ ఆశలు మరింత బలంగా

ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ గ్రూప్ బీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండేది. కానీ శ్రీలంకపై న్యూజిలాండ్ సాధించిన భారీ విజయం తర్వాత పాకిస్థాన్ మూడో స్థానానికి పడిపోయింది. సూపర్-8లో న్యూజిలాండ్‌కు పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. శ్రీలంకపై గెలిచిన రెండో మ్యాచ్‌తో న్యూజిలాండ్‌కు మొత్తం 3 పాయింట్లు వచ్చాయి. అంతేకాకుండా 3.050 నెట్ రన్ రేట్‌తో ఇతర జట్లపై స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది.

పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ నుంచి బయటపడే పరిస్థితి?

పాకిస్థాన్‌కు ఇప్పటివరకు రెండు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క పాయింట్ మాత్రమే ఉంది. అంతేకాకుండా నెట్ రన్ రేట్ -0.461గా ఉండడం వారి పరిస్థితిని మరింత బలహీనంగా చేస్తోంది. శ్రీలంకతో మిగిలిన చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిచినా కూడా న్యూజిలాండ్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ సాధించడం కష్టమే. అందువల్ల పాకిస్థాన్ ఇంకా అధికారికంగా నిష్క్రమించకపోయినా, టోర్నీ నుంచి బయటపడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

20 ఓవర్లలో 168 పరుగులు చేసిన న్యూజిలాండ్

ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ప్రారంభంలో వారి నిర్ణయం ఫలించినట్లే కనిపించింది. న్యూజిలాండ్ 84 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత కెప్టెన్ మిచెల్ సాంట్నర్, కోల్ మెక్‌కాంకీ కలిసి ఏడో వికెట్‌కు వేగవంతమైన 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ భాగస్వామ్యంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 168 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ లక్ష్యాన్ని చేధించడంలో శ్రీలంక విఫలమైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us