AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వాహనదారులకు అలర్ట్.. ప్రధాని పర్యటనతో ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలివే

జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ (Hyderabad) లోని మాదాపూర్ హెచ్ఐసీసీలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రధాని రాక సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. హెచ్‌ఐసీసీ....

Hyderabad: వాహనదారులకు అలర్ట్.. ప్రధాని పర్యటనతో ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలివే
Traffic
Ganesh Mudavath
|

Updated on: Jul 01, 2022 | 8:02 PM

Share

జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ (Hyderabad) లోని మాదాపూర్ హెచ్ఐసీసీలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రధాని రాక సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. హెచ్‌ఐసీసీ పరిధిలో ఆంక్షలు విధించారు. నీరూస్‌ నుంచి కొత్తగూడ జంక్షన్‌, గచ్చిబౌలి జంక్షన్‌ వెళ్లేవారు.. సీఓడీ నుంచి దుర్గం చెరువు, బయోడైవర్సిటీ మీదుగా రాకపోకలు సాగించాలని వెల్లడించారు. ఆర్సీపురం, చందానగర్‌, మాదాపూర్‌, గచ్చిచౌలి నుంచి వచ్చే వాహనాలు బీహెచ్‌ఈఎల్‌, హెచ్‌సీయూ, ట్రిపుల్‌ ఐటీ మీదుగా వెళ్లాలి. మియాపూర్‌, కొత్తగూడ, హఫీజ్‌పేట నుంచి వచ్చేవారు ఏఐజీ ఆసుపత్రి, దుర్గం చెరువు మీదుగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు (Traffic Restrictions in Hyderabad) సూచించారు. ఎక్కడా ఏ చిన్న పొరపాటుకూ తావు లేకుండా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. జులై 3న సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ప్రముఖులు, నాయకులు, కార్యకర్తల వాహనాల పార్కింగ్‌ కోసం నగరం నలువైపులా పార్కింగ్‌ మైదానాలు సిద్ధం చేశారు.

కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు బైసన్‌పోలో మైదానం, బోయినపల్లి మార్కెట్‌ ప్రాంతాల్లో, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చే వాహనాలు నెక్లెస్‌రోడ్డు చుట్టుపక్కల స్థలాల్లో, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చే వాహనాలను రైల్వేమైదానం, రైల్వే డిగ్రీకళాశాల స్థలాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్‌ వైపు ప్రముఖుల రాకపోకలు సాగించే సమయాల్లో పంజాగుట్ట, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌, రాజ్‌భవన్‌ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయి. వాహనదారులు ఈ మార్పులను గమనించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

ప్రధాని మోదీ(PM Modi) తెలంగాణ పర్యటన ఖరారైంది. శనివారం హైదరాబాద్‌కు చేరుకుంటారు ప్రధాని మోదీ. మూడు రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు. శనివారం, ఆదివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. హైటెక్స్‌లోని నోవాటెల్‌ హోటల్లో జరిగే సమావేశాలకు ప్రధాని మోదీ హాజరవుతారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో శుక్రవారం నుంచి 4వ తేదీ వరకు సిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు. నోవాటెల్‌ హోటల్‌లో బస చేయనున్న మోదీకి మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నగరంలో 28 నుంచి 30 గంటల పాటు గడపనున్న ప్రధాని పర్యటనను.. విజయవంతంగా పూర్తి చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

తెలంగాణ వార్తల కోసం..

Follow Us
చింతకాయతో చేపల పులుసు ఇలా వండితే అన్నం రెండు ప్లేట్లు ఖాయం
చింతకాయతో చేపల పులుసు ఇలా వండితే అన్నం రెండు ప్లేట్లు ఖాయం
హోటల్ బిల్లు రూ. 1200 సేవ్! వైష్ణో దేవి యాత్రికుడి ధురంధర్ ప్లాన్
హోటల్ బిల్లు రూ. 1200 సేవ్! వైష్ణో దేవి యాత్రికుడి ధురంధర్ ప్లాన్
ఆ భయాలు నన్ను ఎప్పటికీ వెంటాడుతునే ఉంటాయి.. అడివి శేష్..
ఆ భయాలు నన్ను ఎప్పటికీ వెంటాడుతునే ఉంటాయి.. అడివి శేష్..
RCBలో కోహ్లీ కంటే తోపు.. 13 ఫోర్లు, 17 సిక్సర్లతో పరుగుల..
RCBలో కోహ్లీ కంటే తోపు.. 13 ఫోర్లు, 17 సిక్సర్లతో పరుగుల..
ఆడపిల్ల పుట్టడం ఎందుకు శుభం అంటారు? గరుడ పురాణం చెప్పే రహస్యం
ఆడపిల్ల పుట్టడం ఎందుకు శుభం అంటారు? గరుడ పురాణం చెప్పే రహస్యం
అటుకులతో కమ్మని పాయసం.. ఒకసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు
అటుకులతో కమ్మని పాయసం.. ఒకసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు
మమతా సర్కార్‌పై బీజేపీ ఛార్జిషీట్.. అరాచకం రాజ్యమేలుతుందన్న..
మమతా సర్కార్‌పై బీజేపీ ఛార్జిషీట్.. అరాచకం రాజ్యమేలుతుందన్న..
ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా రిజెక్ట్ అవుతున్నారా?.. సీక్రెట్ రెమిడీ
ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా రిజెక్ట్ అవుతున్నారా?.. సీక్రెట్ రెమిడీ
చల్లగా కమ్మగా ఉండే సొరకాయ పెరుగు పచ్చడి ఇలా చేయండి
చల్లగా కమ్మగా ఉండే సొరకాయ పెరుగు పచ్చడి ఇలా చేయండి
ప్రయాణమే ప్రాణమా? తిరుగుతూ డబ్బు సంపాదించే ఉద్యోగం కావాలా?
ప్రయాణమే ప్రాణమా? తిరుగుతూ డబ్బు సంపాదించే ఉద్యోగం కావాలా?