AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: రక్తపు మడుగులో మృతదేహాలు.. కొడవలితో నరికి చంపిన ఆనవాళ్లు.. అసలేం జరిగింది

ముంబయిలో (Mumbai) దారుణ ఘటన జరిగింది. ఓ బాలిక డ్రైవర్ తో కలిసి, తన తల్లిని, సొంత అక్కను దారుణంగా చంపేసింది. అనంతరం డ్రైవర్ తో కలిసి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది....

Crime: రక్తపు మడుగులో మృతదేహాలు.. కొడవలితో నరికి చంపిన ఆనవాళ్లు.. అసలేం జరిగింది
crime news
Ganesh Mudavath
|

Updated on: Jun 30, 2022 | 6:38 PM

Share

ముంబయిలో (Mumbai) దారుణ ఘటన జరిగింది. ఓ బాలిక డ్రైవర్ తో కలిసి, తన తల్లిని, సొంత అక్కను దారుణంగా చంపేసింది. అనంతరం డ్రైవర్ తో కలిసి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ముంబయిలోని కందివలి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ఇంట్లో నాలుగు మృతదేహాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇంట్లో లభించిన లేఖలో ఇద్దరిని హత్య చేసి, తాము ఆత్మహత్య చేసుకున్నట్లు రాసి ఉంది. శివ్ దయాల్ సేన్ అనే వ్యక్తి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతనికి భూమి అనే బాలికతో పరిచయం ఏర్పడింది. ఈ విషయంపై ఇంట్లో గొడవలు జరిగాయి. దీంతో ఆ బాలిక తన తల్లిని, అక్కను చంపేయాలని నిర్ణయించారు. ముందస్తు పథకం ప్రకారం ఇద్దరినీ హత్య చేసింది. అనంతరం డ్రైవర్ తో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. నలుగురూ చనిపోయిన రెండు అంతస్తుల భవనం ఇల్లు, ఆస్పత్రిగా ఉంది. హత్యకు గురైన వారిని కిరణ్​ దాల్వి, ఆమె కూతురు ముస్కాన్​గా గుర్తించారు. ఆత్మహత్య చేసుకున్న చిన్న కుమార్తె పేరు భూమి, డ్రైవర్ పేరు శివ్​దయాల్​సేన్. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కందివలి(వెస్ట్​)లోని దేనా బ్యాంక్ జంక్షన్​లో ఓ వ్యక్తి కొడవలి పట్టుకుని తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ ప్రాంతానికి చేరుకోగా దాల్వి హాస్పిటల్ భవనంలోకి కొడవలితో హల్ చల్ చేస్తున్న వ్యక్తి, ఇద్దరు మహిళలు వెళ్లారని, ఆ తర్వాత లోపలి నుంచి అరుపులు కేకలు వినిపించిట్లు స్థానికులు చెప్పారు. నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని శతాబ్ది ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
బంగారం, వెండికితో పాటు మరో దెబ్బ.. పెరుగుతున్న మరో లోహం ధరలు
బంగారం, వెండికితో పాటు మరో దెబ్బ.. పెరుగుతున్న మరో లోహం ధరలు
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!