AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీపై తీర్పు వాయిదా..

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీపై తీర్పు వాయిదా..

Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Mar 20, 2026 | 8:38 PM

Share

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డి కస్టడీ పిటిషన్‌పై తీర్పు సోమవారానికి వాయిదా పడింది. కోర్టు సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది, రోహిత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలు, దుబాయ్ సంబంధాలపై దృష్టి సారించింది. డ్రగ్స్ పార్టీ మూలాలు, నిర్వహణ ఉద్దేశ్యంపై ఆరా తీస్తోంది.

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులు రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మల కస్టడీ పిటిషన్‌పై ఉప్పర్‌పల్లి కోర్టు తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. ఈరోజు, రేపు కోర్టుకు సెలవులు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిందితులను 10 రోజుల కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరారు. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వెనుక ఉన్న మూలాలపై సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. రోహిత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలు, డ్రగ్స్ సప్లయర్‌లతో అతని సంబంధాలపై సిట్ దృష్టి సారించింది. డ్రగ్స్ పార్టీ నిర్వహణకు గల ప్రధాన ఉద్దేశ్యంపై సిట్ ఆరా తీస్తోంది. రోహిత్ రెడ్డి దుబాయ్ సంబంధాలపైనా దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే నిందితుల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న సిట్, పుట్టా మహేష్ మినహా ఇతరుల వాంగ్మూలాలను నమోదు చేసింది. కస్టడీ లభిస్తే నిందితులను మరింత లోతుగా ప్రశ్నించే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మొయినాబాద్ ఎపిసోడ్ తో తెరపైకి వైట్ ఛాలెంజ్

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ కానుక

Petrol Prices: భారత్ లో పెరిగిన పవర్ పెట్రోల్ ధరలు

ఆస్కార్‌ వేడుకల్లో పీసీ సందడి.. మామూలుగా లేదుగా!

20 ఏళ్ల అమ్మాయితో ప్రేమ సూర్య రిస్క్ చేస్తున్నారా

Follow Us