AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

E-Governance 2022: హైదరాబాద్ వేదికగా ఇ-గవర్నెన్స్ 2022.. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన 7, 8 తేదీల్లో జాతీయ సదస్సు

24వ జాతీయ ఇ-గవర్నెన్స్ సదస్సు- 2022 జనవరి 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC) జరగనుంది.

E-Governance 2022: హైదరాబాద్ వేదికగా ఇ-గవర్నెన్స్ 2022.. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన 7, 8 తేదీల్లో జాతీయ సదస్సు
Ktr
Balaraju Goud
|

Updated on: Jan 06, 2022 | 4:00 PM

Share

E-Governance 2022 at Hyderabad: 24వ జాతీయ ఇ-గవర్నెన్స్ సదస్సు- 2022 జనవరి 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC) జరగనుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ (DARPG), మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఈ సదస్సును నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం కాన్ఫరెన్స్ థీమ్ ‘ఇండియాస్ టెకేడ్: డిజిటల్ గవర్నెన్స్ ఇన్ ఎ పోస్ట్ పాండమిక్ వరల్డ్‌.’గా నిర్ణయించారు

ప్రారంభ సెషన్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సమావేశానికి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అధ్యక్షత వహించనున్నారు. ఈ సదస్సులో ఆత్మ నిర్భర్ భారత్, పబ్లిక్ సర్వీసెస్ యూనివర్సలైజేషన్, ఇన్నోవేషన్ – ప్లాట్‌ఫార్మైజేషన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఇండియాస్ టెకేడ్ – డిజిటల్ ఎకానమీ (డిజిటల్ పేమెంట్స్ – బిల్డింగ్ సిటిజన్స్ కాన్ఫిడెన్స్) వంటి పలు అంశాలపై స్పీకర్ సెషన్‌లు కూడా ఉంటాయి.

కాన్ఫరెన్స్ మొదటి రోజున (జనవరి 7న) నేషనల్ ఇ-గవర్నెన్స్ అవార్డ్స్- 2021 ప్రధానం చేయడం జరుగుతుంది. ఇ-గవర్నెన్స్‌పై నిర్వహిస్తున్న ఈ సదస్సు ఇ-గవర్నెన్స్ కార్యక్రమాల ప్రభావవంతమైన అమలును గుర్తించడానికి, ప్రోత్సహించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. వివిధ ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలలోని ఉన్నతాధికారులు, ఇ-గవర్నెన్స్‌ నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలు, అనుభవాలు పంచుకోవడం తో పాటు ఇ-గవర్నెన్స్ లో ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారం గురించి చర్చిస్తారు.ఈ వేదిక ద్వారా ఇస్తున్న అవార్డులు ఇ-గవర్నెన్స్ మరియు డిజిటలైజేషన్‌ రంగాల్లో కృషి చేస్తున్న వారికి గొప్ప ప్రేరణగా నిలుస్తున్నాయి.

రెండు రోజులు జరిగే ఈ సదస్సులో, నిర్ధారించిన థీమ్‌లు మరియు సబ్-థీమ్స్ లపై పలు సెషన్స్ తో పాటు, ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారుల తో పాటు ప్రైవేట్ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సదస్సు లో పాల్గొంటారు.

Read Also….  GHMC on Covid 19: థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధం.. సర్కిళ్ల వారీగా ఐసోలేషన కేంద్రాలుః గ్రేటర్ మేయర్ విజయలక్ష్మి

Follow Us
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?