AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: గేమ్ బాగుందని టెంప్ట్ అవుతున్నారా? నెక్ట్స్ జరిగేదిదే.. తస్మాత్ జాగ్రత్త..!

అమాయకులను మోసం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా గేమింగ్‌, బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్ ద్వారా గేమింగ్, బెట్టింగ్‌లకు పాల్పడుతున్న..

Hyderabad: గేమ్ బాగుందని టెంప్ట్ అవుతున్నారా? నెక్ట్స్ జరిగేదిదే.. తస్మాత్ జాగ్రత్త..!
Online Games
Shiva Prajapati
|

Updated on: Jan 31, 2023 | 9:04 AM

Share

అమాయకులను మోసం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా గేమింగ్‌, బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్ ద్వారా గేమింగ్, బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠా గతేడాది డిసెంబర్‌లో చేవెళ్లకు చెందిన హర్షవర్ధన్‌ అనే విద్యార్థి నుంచి 98 లక్షలను ఈ ముఠా కాజేసింది. హర్షవర్ధన్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న ఈ ముఠాకు చెందిన 8 మంది ముఠా సభ్యులను సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పలువురికి ఆన్‌లైన్ బెట్టింగ్‌ వివరాలను పంపుతూ..వారిని గేమ్స్ ఆడిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని సైబరాబాద్ క్రైమ్ డీసీపీ కలమేశ్ సింగన్వార్ తెలిపారు. నిందితుల ఖాతాల్లోని నగదుతోపాటు వారి వద్ద నుంచి 193 మొబైల్ ఫోన్లు, 21 ల్యాప్‌ టాప్‌‌లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

ఆన్‌లైన్‌ గేమింగ్‌ ముఠాకు చెందిన మోహిన్ పాషా, కరణ్ అరోరా, సంజీవ్ కుమార్, కరణ్ మల్హోత్రా, హవాల్దాని, మోహిత్ కుమార్, దినేష్ సింగ్‌లను అరెస్ట్ చేశారు. వీరు ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ వెబ్‌ సైట్‌‌లు, అప్లికేషన్‌‌లను నడుపుతున్నారు. ఆన్‌లైన్ గేమ్‌లు ఆడటానికి, బెట్టింగ్‌‌లు ఆడటానికి వినియోగదారుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. లావాదేవీలు నిర్వహించేందుకు ఆయా బ్యాంకుల్లో కరెంట్ బ్యాంక్ ఖాతాలను తెరిచారు.

ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌ ముఠా వినియోగదారులు చేసిన లావాదేవీల స్క్రీన్ షాట్‌ను సేకరించి, బ్యాంక్ ఖాతాతో ధృవీకరించిన తర్వాత రాష్ట్రంలో నిషేధించబడిన ఆన్‌ లైన్ గేమింగ్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై గేమింగ్ యాక్ట్ పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆన్‌లైన్ లోన్‌యాప్‌లు, ఉద్యోగాల ఇప్సిస్తామని మోసం చేసే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

సైబర్‌ క్రైమ్‌ జరిగితే 1930కి కాల్‌ చేస్తే డబ్బు రికవరీ!

అరెస్టయిన నిందితులంతా ఢిల్లీ, ఉత్తరాఖండ్, కర్నాటకకు చెందినవారిగా గుర్తించారు. వీరంతా పెద్దగా చదువుకోకపోయినా, ఆన్‌లైన్‌లో మోసాలు చేయడంలో ఎక్స్‌ఫర్ట్ అని పోలీసులు తెలిపారు. సైబర్‌ క్రైమ్‌ జరిగినప్పుడు వెంటనే 1930కి కాల్‌ చేస్తే డబ్బు రికవరీ చేసే ఛాన్స్‌ ఉందని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్