AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మావోయిస్టు పార్టీకి భారీ షాక్.. అగ్రనేత రామన్న భార్య సావిత్రి లొంగుబాటు..

తెలంగాణ మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. మరో కీలక మహిళా నేత లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ముందు మావోయిస్టు అగ్రనేత దివంగత రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న భార్య సావిత్రి

Telangana: మావోయిస్టు పార్టీకి భారీ షాక్.. అగ్రనేత రామన్న భార్య సావిత్రి లొంగుబాటు..
Maoist
Shaik Madar Saheb
|

Updated on: Sep 21, 2022 | 11:58 AM

Share

Maoist Savitri: తెలంగాణ మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. మరో కీలక మహిళా నేత లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ముందు మావోయిస్టు అగ్రనేత దివంగత రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న భార్య సావిత్రి లొంగిపోయారు. ఇటీవలే రామన్న అనారోగ్యంతో చనిపోయారు. రామన్న మృతి తర్వాత ఆమె భార్య సావిత్రి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సావిత్రి తాను లొంగిపోతున్నట్లు తెలంగాణ పోలీసులకు సమాచారమిచ్చారు. బుధవారం సాయంత్రం డీజీపీ మహేందర్రెడ్డి సమక్షంలో మీడియా ముందుకు రామన్న భార్య సావిత్రి రానున్నట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఇప్పటికే పోలీసుల ఎదుట లొంగిపోయిన సావిత్రి పోలీసులకు పలు కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం.

కాగా.. తెలంగాణలో మావోయిస్టు పార్టీ కట్టడికి పోలీసులు భారీ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే, పలు జిల్లాల్లోకి మావోయిస్టు పార్టీకి చెందిన దళాలు ప్రవేశించాయన్న సమాచారంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా రెండేళ్ల కిందట ఛత్తీస్‌గఢ్ పారిపోయిన అడెల్లు భాస్కర్ దళం కూడా ఆదిలాబాద్ అడవుల్లోకి ప్రవేశించినట్లు తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మోస్ట్ వాంటెడ్ నక్సలిస్టుల ఫొటో జాబితాను సైతం విడుదల చేశారు.

ఈ క్రమంలోనే మావోయిస్టు అగ్రనేత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మావోయిస్టు ఏరియా కమాండర్ మడకం కోసి అలియాస్ రజితను కూడా భద్రాద్రి పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే, తాజాగా సావిత్రి లొంగుబాటుతో మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలినట్లు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..