AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agnipath Protest: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో.. నాంపల్లి స్టేషన్ మూసివేత.. 71 రైళ్లు రద్దు

Agnipath Protest: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. మూడు రైళ్లకు నిప్పటించారు ఆందోళనకారులు. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి..

Agnipath Protest: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో.. నాంపల్లి స్టేషన్ మూసివేత.. 71 రైళ్లు రద్దు
Agnipath Protest
Subhash Goud
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 17, 2022 | 3:51 PM

Share

Agnipath Protest: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. మూడు రైళ్లకు నిప్పటించారు ఆందోళనకారులు. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఆందోళనకారుల దాడులలో తీవ్రంగా నష్టం వాటిల్లింది. రైలు పట్టాలపై పార్శిళ్లు, ఫర్నిచర్స్‌, రైలు బోగీలను ధ్వంసం చేస్తున్నారు ఆందోళనకారులు. ఇక ఆందోళనల నేపథ్యంలో వరంగల్‌, కాజీపేట రైల్వే స్టేషన్ల వద్ద భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా అప్రమత్తం అయ్యారు పోలీసులు. ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా భారీగా మోహరించిన పోలీసులు. కాజీపేట, వరంగల్‌ స్టేషన్ల మీదుగా సికింద్రాబాద్‌ వెళ్లే అన్ని రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు రైల్వే అధికారులు.

సికింద్రాబాద్‌ అల్లర్లలో మృతి చెందిన విద్యార్థి దామోదర్

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో కొనసాగుతున్న ఆందోళనలలో పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన విద్యార్థి దామోదర్‌ కురేషిగా గుర్తించారు పోలీసులు. అతని తండ్రి కుమారస్వామి. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు వెళ్లి అక్కడి నుంచి రైల్వే స్టేషన్‌కు వచ్చినట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

నాంపల్లి రైల్వేస్టేషన్‌ మూసివేత

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో నాంపల్లి రైల్వేస్టేషన్‌ను మూసివేశారు పోలీసులు. ప్రయాణికులు లోపలికి రావొద్దని పోలీసులు హెచ్చరించారు. పోలీసులు నాంపల్లి పోలీసుస్టేషన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ కు ఫైర్ ఇంజన్లను అందుబాటులో ఉంచారు.

మొత్తం 71 రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ

సికింద్రాబాద్‌లో కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో మొత్తం 71 రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ. అల్లర్లు సద్దుమణిగిన తర్వాత పునరుద్దరిస్తామని చెబుతున్నారు పోలీసులు. ఆరు రైళ్లను అధికారికంగా రద్దు చేశారు రైల్వేఅధికారులు. రద్దు అయిన రైళ్లు.. ఈస్ట్ కోస్ట్, షాలిమార్, హుందానగర్, వివిధ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి రైళ్లు. సికింద్రాబాద్ ఔటర్‌లో రైళ్లు నిలిచిపోయాయి. మౌలాలి, చర్లపల్లి, ఘట్ కేసర్ స్టేషన్లులో రైళ్లు నిలిచిపోయాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి