AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అది నా అడ్డా అంటున్న ఎమ్మెల్యే.. అంతలేదు అంటున్న మాజీ ఎంపీ.. ఇంతకీ వీరి గొడవేంటో తెలుసా?

Telangana: ఖమ్మం జిల్లా పినపాకలో పొలిటికల్ వార్ పీక్స్‌కు చేరుకుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ రేగా కాంతారావు మధ్య అంతర్గత పాలిటిక్స్ నడుస్తున్నాయి.

Telangana: అది నా అడ్డా అంటున్న ఎమ్మెల్యే.. అంతలేదు అంటున్న మాజీ ఎంపీ.. ఇంతకీ వీరి గొడవేంటో తెలుసా?
Trs
Shiva Prajapati
|

Updated on: Feb 27, 2022 | 8:59 PM

Share

Telangana: ఖమ్మం జిల్లా పినపాకలో పొలిటికల్ వార్ పీక్స్‌కు చేరుకుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ రేగా కాంతారావు మధ్య అంతర్గత పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఏయ్‌ బిడ్డా.. ఇది నా అడ్డా అని రేగా అంటే.. అంతలేదు అంటూ కౌంటర్ ఇస్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అంతేకాదు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా రెండు వర్గాల నేతలు దాడులకు దిగారు. తలలు పగిలి.. రక్తాలు కారాయి. ఈ వివాదం పార్టీ అధిష్టానం వద్దకు చేరింది. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇంతకీ వారి మధ్య వివాదం ఎందుకు? ఇప్పు పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ రాజకీయాలు కొంత ప్రత్యేకమనే చెప్పాలి. అక్కడ పార్టీలో విభేదాలు, వర్గపోరు కామన్‌. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేగాకాంతారావు ఇష్యూతో ఆ రచ్చ మరోసారి రోడ్డెక్కింది. రెండు వర్గాల మధ్య ఓరేంజ్‌ డైలాగ్‌ వార్‌నడుస్తోంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం తాజా వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది. అయితే ఈ గ్రూపుల మధ్య తగాదా ఇప్పటిదికాదు. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆధిపత్యపోరు ఇప్పుడు మళ్లీ ఒకసారి అలా బయటకు వచ్చింది.

పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలం మల్లెల మడుగులో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆవిష్కరణ కోసం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ పిడమర్తి రవి వచ్చారు. ఈ ప్రోగ్రాంపై లోకల్‌ ఎమ్మెల్యే అయిన రేగా కాంతారావుకు ఎలాంటి సమాచారం లేదు. దాంతో మా అడ్డాలో మీ పెత్తనం ఏంటని పొంగులేటి అండ్‌ టీమ్‌ను నిలదీశారు రేగా వర్గీయులు. అంతే రెండు వర్గాలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. పరస్పరం దాడులు, లాఠీఛార్జ్‌ వరకూ వెళ్లింది. పిడమర్తి ఆవిష్కరించిన విగ్రహానికి పాలాభిషేకం చేశారు రేగా వర్గీయులు.

ఇదిలాఉంటే.. రేగా తీరుపై ఫైర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పిడమర్తి రవి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన తీరుతో పార్టీకి చెడ్డపేరు వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి రేగా ఊరుకుంటేనా.. తనపై విమర్శలు చేసిన ఈ ఇద్దరు నేతలకు అంతే స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. పినపాకపై యుద్ధానికి వస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు గాజులు వేసుకొని లేరంటూ సోషల్‌ మీడియాలో వరుస పోస్టులు చేశారు. నా అడ్డాలో నీ పెత్తనమేంటని సూటిగా నిలదీశారు. ఈ వివాదం చివరకు పార్టి అధిష్టానం వద్దకు చేరుకుంది. మరి అధినాయకత్వం ఎలా స్పందిస్తుందనేది సస్పెన్స్‌గా మారింది.

ఇదిలాఉంటే మల్లెమడుగులో జరిగిన ఘటనలో మొత్తం 17 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పిడమర్తి రవి, పాయం వెంకటేశ్వర్లు, తుళ్ళురి బ్రహ్మయ్య, సహా వారి అనుచరులపై కేసులు పెట్టారు పోలీసులు. అంతేకాదు.. మల్లెల మడుగులో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు 144 సెక్షన్ కూడా విధించారు.

Also read:

Viral Video: పుష్పా సాంగ్‌తో అదరగొట్టిన ఎమ్మెల్యే.. ఊ అంటారా తల్లి ఉహూ అంటారా అంటూ..

Russia – Ukraine Crisis: రష్యాపై పోరుకు ఉక్రెయిన్ బ్యూటీ.. గన్ను చేతపట్టి నేను సైతం అంటూ కదనరంగంలోకి..

Rahul Gandhi – Gujarat: గుజరాత్‌లో సొంత పార్టీ నేతలకే ఝలక్ ఇచ్చిన రాహుల్ గాంధీ.. ఇంతకీ ఆయన చేశారంటే..!

హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు