AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Smuggling: ఓరి మీ తెలివి తెల్లారిపోను.. ఇలా కూడా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తారా..?

ఈ మధ్యకాలంలో విదేశాల నుంచి ఇండియాకు అక్రమంగా బంగారం రవాణా చేయడం లాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. దేశంలోని పలు ఎయిర్‌పోర్టులలో గోల్డ్ స్మగ్లింగ్ చేసే వారు కస్టమ్స్ అధికారుల కంట పడుతూనే ఉన్నారు. ఇప్పడు తాజాగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పెద్ద మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Gold Smuggling: ఓరి మీ తెలివి తెల్లారిపోను.. ఇలా కూడా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తారా..?
Gold Smuggling
Aravind B
| Edited By: Janardhan Veluru|

Updated on: May 24, 2023 | 11:44 AM

Share

ఈ మధ్యకాలంలో విదేశాల నుంచి ఇండియాకు అక్రమంగా బంగారం రవాణా చేయడం లాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. దేశంలోని పలు ఎయిర్‌పోర్టులలో గోల్డ్ స్మగ్లింగ్ చేసే వారు కస్టమ్స్ అధికారుల కంట పడుతూనే ఉన్నారు. ఇప్పడు తాజాగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పెద్ద మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు ప్రయాణికులు రియాద్‌ నుంచి హైదరాబాద్‌‌కు అక్రమంగా బంగారాన్ని తీసుకొచ్చారు. పక్కా సమాచారంతో ప్రయాణికల్ని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. దీంతో వారి షూ సాక్స్‌ల్లో పేస్ట్ రూపంలో దాచి తీసుకొచ్చిన 1.818 కిలోల బంగారాన్ని గుర్తించారు.

ఆ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ దాదాపు రూ.1.30 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఆ ముగ్గురు ప్రయాణికులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వాళ్లని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

గోల్డ్ స్మగ్లింగ్ వీడియో..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి.