Telangana Congress: మైనంపల్లి, రేఖానాయక్కు దారేది..? కాంగ్రెస్లో రెండు టికెట్ల లొల్లి..! నేతల్లో టెన్షన్..
Telangana Congress Tickets: తెలంగాణలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్ధుల ఎంపికపై స్పీడు పెంచిన హస్తం పార్టీ.. గెలుపు గుర్రాల వేటలో పడింది. దీనికోసం ఢిల్లీ వేదికగా వడపోత ప్రారంభించింది. ఇప్పటికే 70 స్థానాల్లో అభ్యర్ధులపై కసరత్తు కొలిక్కి వచ్చింది. ఇప్పుడు మిగతా స్థానాలపై స్క్రీనింగ్ మొదలుపెట్టింది. ఫైనల్ చేసిన జాబితాను అధిష్టానానికి నివేదించింది స్క్రీనింగ్ కమిటీ.

Telangana Congress Tickets: తెలంగాణలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్ధుల ఎంపికపై స్పీడు పెంచిన హస్తం పార్టీ.. గెలుపు గుర్రాల వేటలో పడింది. దీనికోసం ఢిల్లీ వేదికగా వడపోత ప్రారంభించింది. ఇప్పటికే 70 స్థానాల్లో అభ్యర్ధులపై కసరత్తు కొలిక్కి వచ్చింది. ఇప్పుడు మిగతా స్థానాలపై స్క్రీనింగ్ మొదలుపెట్టింది. ఫైనల్ చేసిన జాబితాను అధిష్టానానికి నివేదించింది స్క్రీనింగ్ కమిటీ. జాబితాను పరిశీలించి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఫైనల్ లిస్ట్ విడుదల చేయనుంది. మిగతా స్థానాలపై స్క్రీనింగ్ కమిటీ మరోసారి సమావేశం కానుంది. ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం నేపథ్యంలో ఆశావాహులు ఢిల్లీకి క్యూ కట్టారు. అదిష్టానం పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ టికెట్ కోసం సంప్రదింపులు జరుపుతున్నారు.
ఇదిలాఉంటే.. కాంగ్రెస్ పార్టీలో చేరికల హడావిడి కనిపిస్తోంది. పార్టీలో చేరేందుకు ఒక్కక్కరుగా ఢిల్లీ చేరుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీలోనే మైనంపల్లి హనుమంతరావు, వేముల వీరేశం, రేఖానాయక్ ఉన్నారు. మైనంపల్లి ఫ్యామిలీపై కాంగ్రెస్లో చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. తండ్రి హనుమంతరావు, కొడుకు రోహిత్లకు రెండు టికెట్లు ఇవ్వలేమంటోంది కాంగ్రెస్ పార్టీ. ఉదయపూర్ తీర్మానాన్ని ప్రస్తావిస్తున్న పార్టీ నేతలు కుటుంబానికి ఒక్కటే టికెట్ అంటున్నారు. కనీసం ఐదేళ్లు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికే రెండో టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ తీర్మానంలో ఉంది.
అటు రేఖానాయక్ ఫ్యామిలీపైనా ఉదయ్పూర్ తీర్మానం ఎఫెక్ట్ పడుతోంది. తనతో పాటు భర్త శ్యామ్ నాయక్ కు కూడా టికెట్ ఇవ్వాలని రేఖానాయక్ డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరికీ టికెట్లు సాధ్యం కాదంటోంది కాంగ్రెస్ పార్టీ. మరి పార్టీలో రెండు టికెట్ల లొల్లిని కాంగ్రెస్ పార్టీ ఎలా పరిష్కరిస్తుందో చూడాల్సి ఉంది.
అయితే, స్క్రీనింగ్ కమిటీ ఆచితూచి టికెట్ల ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా గెలిచే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఆర్థిక, అంగబలం కలిగిన నేతలను రంగంలోకి దించాలని యోచిస్తోంది. ఈ మేరకు అధిష్టానం సూచనలను, సలహాలను పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే, మొదటి విడత అభ్యర్థుల జాబితా మరో వారంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
