Telangana: ఆ నియోజకవర్గంలో పుంజుకున్న కాంగ్రెస్.. ఈసారి విజయంపై ధీమా..

మొన్నటి వరకు ఆ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే.. కానీ ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఆపార్టీ గ్రాఫ్ కొంత మెరుగుపడిందని చెప్పుకుంటున్నారు స్థానిక నేతలు. పూర్వ వైభవం కోసం ఆ పార్టీ నేతలు బాగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. మెదక్​ పార్లమెంట్​ పరిధిలో కాంగ్రెస్​ పార్టీ అనూహ్యంగా పుంజుకుంటోంది. 2019 లోక్​సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో లక్షా 52 వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పెరిగాయి. మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 2.8 శాతం ఓట్ల తేడాతో బీజేపీ నుంచి గట్టి పోటీ ఇచ్చారు.

Telangana: ఆ నియోజకవర్గంలో పుంజుకున్న కాంగ్రెస్.. ఈసారి విజయంపై ధీమా..
Brs Bjp Congress
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 09, 2024 | 12:46 PM

మొన్నటి వరకు ఆ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే.. కానీ ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఆపార్టీ గ్రాఫ్ కొంత మెరుగుపడిందని చెప్పుకుంటున్నారు స్థానిక నేతలు. పూర్వ వైభవం కోసం ఆ పార్టీ నేతలు బాగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. మెదక్​ పార్లమెంట్​ పరిధిలో కాంగ్రెస్​ పార్టీ అనూహ్యంగా పుంజుకుంటోంది. 2019 లోక్​సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో లక్షా 52 వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పెరిగాయి. మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 2.8 శాతం ఓట్ల తేడాతో బీజేపీ నుంచి గట్టి పోటీ ఇచ్చారు. కౌటింగ్​ మొదటి రౌండ్​ నుంచి పోటీ పడుతూ నువ్వా నేనా అన్న ఉత్కంఠ కొనసాగింది. లెక్కింపు పూర్తయ్యే సరికి రఘునందన్​ రావ్ కేవలం 39,139 ఓట్ల స్వల్ప మెజారిటీతోనే బయటపడ్డారు. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‎కు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో 4,20,881 ఓట్లు రాగా ఈ లోక్ సభ ఎన్నికల్లోనూ 4,27,899 ఓట్లు వచ్చాయి. మరో వైపు మూడు లోక్​ సభ ఎన్నికల్లో మాదిరిగానే ఈ సారి ఎన్నికల్లో సైతం కాంగ్రెస్​ పార్టీ క్యాండిడేట్​ను మార్చింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీఎస్పీ నుంచి కాంగ్రెస్​‎లో చేరిన నీలం మధుకు టికెట్​ కేటాయించింది.

లోక్​ సభ ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన కాంగ్రెస్​ తనదైన ప్రభావాన్ని చూపింది. కాంగ్రెస్​ ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్‎లు ఓసీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులను బరిలోదించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని బీసీ సామాజిక వర్గానికి చెందని అభ్యర్థి నీలం మధును ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్​ బరిలోదించింది. ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి ఓ రకంగా ప్లేస్ అయ్యిందని చెప్పుకుంటున్నారు నేతలు. లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని ఓటర్లలో 50 శాతానికి పైగా బీసీలే ఉండటం, కాంగ్రెస్ అభ్యర్ధి ముదిరాజ్​ సామాజికవర్గనికి చెందిన వ్యక్తి కావడం, రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉండటంతో ఈ సారి లోక్​ సభ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న ధీమా పార్టీ క్యాడెర్లో కనిపించింది. దీంతో ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. మెదక్ లోక్ సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి పలు అంశాలు దోహదపడ్డాయి. ఆరు గ్యారెంటీల అమలు దిశగా చర్యలు చేపట్టడం, ఆగష్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు, రైతులు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారంటున్నారు పార్టీ నేతలు. అంతేకాకుండా పలు చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఓట్లు క్రాస్ అయి కాంగ్రెస్‎కు పడ్డాయంటున్నారు. ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో కాంగ్రెస్ పార్టీకి సైలెంట్ ఓటింగ్ బాగా ఉందని.. ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి, మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని భావిస్తోంది. దీని కోసం ఇప్పటి నుంచే క్యాడర్లో బలం నింపుతూ ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు సీనియర్ లీడర్లు. ఈసారి కచ్చితంగా మెదక్ తమ ఖాతాలో వేసుకంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!