Revanth on Gujarat: తెలంగాణలో పెట్టుబడులకు రక్షణ లేకుండా చేసేందుకు గుజరాత్ నాయకుల కుట్రః రేవంత్
పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో బ్రేకుల్లేని బుల్డోజర్లా ప్రచారంలో దూసుకుపోతున్నారు అన్ని పార్టీల నేతలు. పంచ్లు, సెటైర్లు, సవాళ్లతో ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి టీవీ9కు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో కీలక కామెంట్స్ చేశారు.
పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో బ్రేకుల్లేని బుల్డోజర్లా ప్రచారంలో దూసుకుపోతున్నారు అన్ని పార్టీల నేతలు. పంచ్లు, సెటైర్లు, సవాళ్లతో ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి టీవీ9కు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో కీలక కామెంట్స్ చేశారు. తమ ప్రభుత్వాన్ని కూలగొడతామని కొందరు అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి వారిని తమ కార్యకర్తలు తరిమికొడతారని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో పెట్టుబడులకు రక్షణ లేకుండా చేసేందుకు గుజరాత్ పెట్టుబడిదారీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులను గుజరాత్ నేతలు గుట్టచప్పుడు ఇక్కడి నుంచి తరలించుకుపోతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇక్కడి పరిశ్రమలను తీసుకెళ్లేందుకు, తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేదీ లేదన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..