AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: ప్రజాసౌధంలో తొలి సమీక్ష.. నూత‌న స‌చివాల‌యంలో అధికారులతో భేటీ కానున్న సీఎం కేసీఆర్

తెలంగాణ అస్తిత్వ వైభవానికి ప్రతీకగా.. అమెరికా వైట్ హస్ ను తలపించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ భవనాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.

CM KCR: ప్రజాసౌధంలో తొలి సమీక్ష.. నూత‌న స‌చివాల‌యంలో అధికారులతో భేటీ కానున్న సీఎం కేసీఆర్
CM KCR
Shaik Madar Saheb
|

Updated on: May 01, 2023 | 8:15 AM

Share

తెలంగాణ అస్తిత్వ వైభవానికి ప్రతీకగా.. అమెరికా వైట్ హస్ ను తలపించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ భవనాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్‌.. తన ఛాంబర్ లో ఆసీనులై.. ఆరు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆ తర్వాత మంత్రులు, అధికారులు ఒకేసారి తమ తమ ఛాంబర్ లలో ఆసీనులయ్యారు. 28 ఎకరాల్లోని విశాల స్థలంలోని 7,79,982 చదరపు అడుగులు విస్తీర్ణంలో 265 అడుగుల ఎత్తుతో ఈ భవనాన్ని నిర్మించారు.

కాగా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ లో ముక్యమంత్రి కేసీఆర్ సోమ‌వారం మ‌ధ్యాహ్నం తొలి స‌మీక్ష నిర్వహించనున్నారు. పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌నులు, క‌రివేన‌, ఉదండాపూర్ కాల్వల విస్తరణ ప‌నులతో పాటు ఉదండాపూర్ నుంచి తాగునీరు త‌ర‌లింపు, తదితర ప‌నుల‌పై సీఎం కేసీఆర్ అధికారులతో స‌మీక్షించ‌నున్నారు. కొడంగ‌ల్, వికారాబాద్ వెళ్లే కాల్వ పనులు, అలాగే రాష్ట్రంలో ప్రారంభించిన కొత్త ప్రాజెక్టులు, వాటి ప‌నుల‌పై కూడా కేసీఆర్ స‌మీక్ష చేయ‌నున్నారు. ఈ స‌మావేశానికి సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు హాజ‌రు కానున్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వర్షాలు, పంట నష్టం తదితర విషయాలపై కూడా అధికారులతో చర్చించనున్నారు. కాగా, అకాల వర్షాల కారణంతో పలు ప్రాంతాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..