CM Revanth: తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది.. బడ్జెట్‎పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..

కేంద్ర బడ్జెట్‎లో తెలంగాణ రాష్ట్రం పట్ల కక్ష పూరితంగా వ్యవహరించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 18సార్లు తాము మంత్రుల బృందంతో కలిసి రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి సమస్యలు తీర్చాలని కేంద్ర మంత్రులను కోరినట్లు తెలిపారు. చాలా సార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర సమస్యలపై వివరించామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‎పై స్పందించారు. జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ది కోసం కేంద్రం ఆలోచన చేయడం లేదన్నారు.

CM Revanth: తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది.. బడ్జెట్‎పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
Cm Revanth Reddy
Follow us

|

Updated on: Jul 23, 2024 | 6:02 PM

కేంద్ర బడ్జెట్‎లో తెలంగాణ రాష్ట్రం పట్ల కక్ష పూరితంగా వ్యవహరించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 18సార్లు తాము మంత్రుల బృందంతో కలిసి రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి సమస్యలు తీర్చాలని కేంద్ర మంత్రులను కోరినట్లు తెలిపారు. చాలా సార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర సమస్యలపై వివరించామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‎పై స్పందించారు. జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ది కోసం కేంద్రం ఆలోచన చేయడం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తాను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా ప్రధాన మంత్రి మోదీని కలిసి రాష్ట్రానికి రావల్సిన నిధులపై వివరించామన్నారు. తమ రాష్ట్రంపట్ల పెద్దన్న పాత్ర పోషించమని కోరినట్లు ఈ సందర్భంగా తెలిపారు. అనవసరమైన బేషజలకు తాముపోలేదన్నారు.

బీహార్, ఆంధ్రకి తప్ప ఎవరిని పట్టించుకోలేదన్నారు. ఇది కుర్చీ కాపాడుకోవడం కోసం పెట్టిన బడ్జెట్ లాగా ఉందన్నారు. ఏపీలో పోలవరం నిర్మాణనికి వేల కోట్లు ఇస్తామంటున్న కేంద్రప్రభుత్వం.. తమ ప్రాజెక్టులకు ఎందుకు నిధులు ఇవ్వరని ప్రశ్నించింది. కేంద్రంతో ఫ్రెండ్లి‎గా ఉండటం తమ చేతగాని తనం కాదన్నారు. వివక్ష లేకుండా తమ రాష్ట్రానికి రావల్సిన నిధులు కేటాయించాలన్నారు. కేంద్ర బడ్జెట్‎లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించినట్టు కనిపిస్తోందన్నారు. మొదటి నుండే ప్రధాని తెలంగాణ పట్ల వ్యతిరేకత చూపిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రాకు మాత్రం అన్ని విధాలుగా నిధులు ఇచ్చారని తెలిపారు. అయితే దానికి తాము ఎలాంటి విమర్శలు చేయడంలేదన్నారు. అదే సందర్భంగా పునర్విభజన చట్టంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. మద్దతు ఇచ్చే పార్టీలతో లాలూచీ పడిన బడ్జెట్ ఇది అని విమర్శించారు. తెలంగాణకు నిధులు కేటాయింపులో పూర్తిగా విఫలం అయినందుకు కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు. రాష్ట్రానికి నిధులు తేనప్పుడు 8మంది బీజేపీ ఎంపీలు ఎందుకు ఉన్నట్లు అని ప్రశ్నించారు. బడ్జెట్‎ను మరోసారి సవరించి తెలంగాణకు నిధులు విడుదల చేయాలన్నారు. నిధులు విడుదల చేసేంత వరకూ కాంగ్రెస్ ఎంపీలు పోరాడుతూనే ఉంటారని స్పష్టం చేశారు. దీనికి ఎంఐఎం సహకరించాలని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది.. బడ్జెట్‎పై సీఎం రేవంత్ కామెంట్
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది.. బడ్జెట్‎పై సీఎం రేవంత్ కామెంట్
పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ ఇవే.. మిస్ చేయకుండా ఇవ్వండి!
పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ ఇవే.. మిస్ చేయకుండా ఇవ్వండి!
వాటర్ ట్యాంకుల్లో నాచు ఈజీగా పోవాలంటే ఇలా చేయండి..
వాటర్ ట్యాంకుల్లో నాచు ఈజీగా పోవాలంటే ఇలా చేయండి..
ఓర్నీ.! ఇదేం పనిరా.. పెళ్లైన 3 నిమిషాలకే ఆగలేకపోయారా..?
ఓర్నీ.! ఇదేం పనిరా.. పెళ్లైన 3 నిమిషాలకే ఆగలేకపోయారా..?
భారత సంతతి వ్యక్తికి యూకే పార్లమెంట్‌లో అరుదైన గౌరవం..
భారత సంతతి వ్యక్తికి యూకే పార్లమెంట్‌లో అరుదైన గౌరవం..
ఇది ఆరంభం మాత్రమే.. కేంద్ర బడ్జెట్‌పై చంద్రబాబు, పవన్ ఏమన్నారంటే
ఇది ఆరంభం మాత్రమే.. కేంద్ర బడ్జెట్‌పై చంద్రబాబు, పవన్ ఏమన్నారంటే
కార్ లోన్ తీసుకుంటున్నారా? వీటి గురించి ముందు తెలుసుకోండి..
కార్ లోన్ తీసుకుంటున్నారా? వీటి గురించి ముందు తెలుసుకోండి..
గోవిందుడు అందరివాడేలే సినిమాలో చరణ్ చెల్లెలుగా గత్తర లేపిందిగా..!
గోవిందుడు అందరివాడేలే సినిమాలో చరణ్ చెల్లెలుగా గత్తర లేపిందిగా..!
ప్రకృతి మానవుడికి ఇచ్చిన వరం వస.. ఎన్ని వ్యాధులను నయం చేస్తుందంటే
ప్రకృతి మానవుడికి ఇచ్చిన వరం వస.. ఎన్ని వ్యాధులను నయం చేస్తుందంటే
ఒకేసారి రెండు ధన యోగాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు
ఒకేసారి రెండు ధన యోగాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు