Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సంచలనం.. రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట పేర్లు..

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు మరో మలుపు తిరిగింది.  రిమాండ్ రిపోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చింది. అమిత్‌ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును వెల్లడించింది. 

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సంచలనం.. రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట పేర్లు..
Mlc Kavitha
Follow us

|

Updated on: Nov 30, 2022 | 8:39 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ప్రకంపనలు పుట్టిస్తోంది. ఓ వైపు అరెస్ట్‌లు కొనసాగుతున్న వేళ..  ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు మరో మలుపు తిరిగింది.  రిమాండ్ రిపోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చింది. అమిత్‌ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును చేర్చింది. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితతోపాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లను ఈడీ రిపోర్టులో చేర్చింది.

రూ. వంద కోట్లు అరేంజ్‌ చేసినవారిలో.. కవిత, ఎంపీ మాగుంట పేరు ఉన్నట్టు ఈడీ వెల్లడించింది. పది సెల్‌ఫోన్లను డ్యామేజ్‌ చేసినట్టు.. రిమాండ్‌ రిపోర్టులో ఈడీ పేర్కొంది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

కాగా, అమిత్‌ అరోరాను ఇప్పటికే అరెస్ట్ చేసి ఈడీ పలుమార్లు విచారించింది. ఈ క్రమంలోనే కవిత పేరు రిమాండ్‌ రిపోర్ట్‌లో చేర్చడం హాట్‌ టాపిక్‌గా మారింది. లిక్కర్ స్కామ్‌ ఎపిసోడ్‌లో సౌత్ గ్రూప్‌ వంద కోట్ల ముడుపులు చెల్లించింది. వంద కోట్ల సమకూర్చిన వారిలో కవిత, మాగుంట పేర్లను చేర్చింది ఈడీ.

ఇవి కూడా చదవండి

గతంలో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ స్కామ్ తో సంబంధం లేనట్లు వెల్లడించారు. ఈ తరుణంలోనే వీరిద్దరి పేర్లను చేర్చడం రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..