Telangana: బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్కు సంక్రాంతి సెలవులు ఇవే.. ఇంటర్ విద్యార్థుల సెలవులు పొడిగింపు..?
తెలంగాణలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఇళ్లకు పయనమయ్యారు. వారిని వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇచ్చింది యాజమాన్యం.
తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు బుధవారం నుంచి వారం రోజుల పాటు (జనవరి 11 నుంచి జనవరి 17) సెలవులు ప్రకటించినట్లు ఇంచార్జ్ వీసీ వెంకట రమణ తెలిపారు. తిరిగి జనవరి 18న క్లాసులు పున: ప్రారంభం అవ్వనున్నాయి. ఈ మేరకు విద్యార్థులు వారి గ్రామాలకు వెళ్లేందుకు పాస్లు కూడా జారీ చేశారు. దీంతో చాలామంది మంగళవారం మధ్యాహ్నం నుంచే స్వగ్రామాలకు పయనమయ్యారు. వీరికి భైంసా ఆర్టీసీ తరఫున ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. దీంతో బస్టాండ్లో సందడి వాతావరణం నెలకుంది.
ఇంటర్ విద్యార్థులకు సెలవులు పొడిగించాలి : ఏబీవీపీ
కాగా ఈనెల 14 నుండి 16 వరకు ఇంటర్ కాలేజీలకు సంక్రాంతి పండుగ సెలవులుప్రకటించింది ఇంటర్ బోర్డ్. ఈ రోజుల్లో క్లాసులు నిర్వహిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తిరిగి 17 నుండి కళాశాలలు రీ ఓపెన్ అవుతాయని తెలిపింది. అయితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు సెలవులు పొడిగించాలని ఇంటర్మీడియట్ బోర్డ్ జాయింట్ సెక్రటరీ (అకాడమిక్) వసుంధర దేవి గారికి ABVP రాష్ట్ర కార్యదర్శి కుమారి ఝాన్సీ నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేసింది. దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు సెలవులు పొడిగించాలని ఇంటర్మీడియట్ బోర్డ్ జాయింట్ సెక్రటరీ (అకాడమిక్) వసుంధర దేవి గారికి ABVP రాష్ట్ర కార్యదర్శి కుమారి ఝాన్సీ నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేయడం జరిగింది.#ABVPForStudents pic.twitter.com/7EG6Vh9Mej
— ABVP Telangana (@ABVPTelangana) January 10, 2023
ఇక తెలంగాణలోని అన్ని రకాల స్కూల్స్కు మాత్రం అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈనెల 13 నుంచి 17 వరకు.. 5 రోజులు సెలవులు ఉండనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం