Evil Fish: చెరువులో చేపలన్నీ మాయం.. ఆ ‘దెయ్యం’ చేప పనే అంటున్న మత్స్యకారులు..

Evil Fish: చెరువుల్లోని చేపలకు ముప్పు ఏర్పడిందా.. అంటే అవుననే అంటున్నారు మత్స్యకారులు. చెరువుల్లోని చేపలు చెరువులోనే మాయమవుతున్నాయి.

Evil Fish: చెరువులో చేపలన్నీ మాయం.. ఆ ‘దెయ్యం’ చేప పనే అంటున్న మత్స్యకారులు..
Evil Fish
Follow us

|

Updated on: Dec 29, 2021 | 5:09 PM

Evil Fish: చెరువుల్లోని చేపలకు ముప్పు ఏర్పడిందా.. అంటే అవుననే అంటున్నారు మత్స్యకారులు. చెరువుల్లోని చేపలు చెరువులోనే మాయమవుతున్నాయి. లక్షల్లో చేపపిల్లలు వదిలితే వేలల్లోనే మిగులుతున్నాయి. అందుకు కారణం.. దెయ్యం చేప అని అంటున్నారు. చిన్నచేపల్ని తిని బతికే దెయ్యం చేప ఇప్పుడు మన చెరువుల్లోకి ప్రవేశించింది. అందుకే చేపల దిగుబడి కూడా భారీగా తగ్గిందంటున్నారు. దెయ్యం చేప దొరికితే భూమిలో పాతిపెట్టాలని సూచిస్తున్నారు అధికారులు. ఇంతకి మన ప్రాంతంలో లభించని ఈ చేప ఇక్కడికి ఎలా వచ్చింది.

మహబూబ్ నగర్ జిల్లా బుద్దారం చెరువులో జాలరులకు వరుసగా అరుదైన, ప్రమాదకరమైన దెయ్యం చేపలు దొరుకుతున్నాయి. ఇది అరుదైన చేప. అంతేగక ప్రమాదకరమైంది కూడా. తనకన్న చిన్న చేపల్ని తిని బతికే ఈ చేప మన ప్రాంతానికి చెందింది కాదు. క్యాట్ ఫిష్ జాతికి చెందిన ఈ దెయ్యం చేప.. ఈ ప్రాంతానికి ఎలా వచ్చింది. ఇది గనుక మనుగడ సాగిస్తే మత్య్స కారులు భారీగా నష్టపోవడమే గాక మిగతా చేపల మనుగడ కూడా కష్టంగా మారుతుంది.

క్యాట్ పిష్ జాతికి చెందిన ఈ చేపను ఈ ప్రాంతంలో గుర్తించడం ఇదే తొలిసారి. అమెరికాలో అమెజాన్ నదిలో లభించే ఈ చేప ఇక్కడ లభించడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. దీనిని దెయ్యం చేప, బల్లిచేప అని కూడా పిలుస్తారు. దీన్ని ఆక్వేరియంలలో పెంచుతారు. అమెజాన్ సైల్ఫీన్ క్యాట్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఇలాంటి చేప ఎప్పడు చూడలేదని జాలర్లు చెబుతున్నారు. వింత ఆకారంలో ఉన్న ఈ చేపను చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. క్యాట్ ఫిష్ జాతీకి చెందిన ఈ చేప వింతగా శరీరంపై ముళ్లు కలిగి చూడ్డానికి భయంకరంగా ఉంది. దీని మాంసం కూడా ఎరుపు రంగులో ఉంటుంది. సాగు చేసే చేపల్ని తినేసి, రైతులకు నష్టం కలిగించే ఈ చేపలు మత్స్యకారుల వలల్ని కూడా నాశనం చేస్తున్నాయి. అత్యంత హానికరమైన ఈ చేప నీరు లేకపోయినప్పటికీ 15 రోజులకుపైగా బతకగలదు. నీటిలోనే కాకుండా భూమిపైనా ప్రయాణిస్తూ సమీపంలోని జలాల్లోకి ప్రవేశించి అక్కడ తమ సంతతిని పెంచుకోగలదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇతర చేపలతో పోల్చుకుంటే ఈ చేప తన సంతతిని అతి వేగంగా పెంచుకుంటుంది.

ఇంతకు ఈ చేప మహబూబ్ నగర్ చెరువుల్లోకి ఎలా వచ్చింది. గతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి చేపలు ఎన్నడూ చూడలేదు. అలాంటి జాతి చేపలు కూడా ఈ ప్రాంతంలో కనిపించలేదు. కానీ ఇప్పుడు తరచూ దెయ్యపు చేప(డెవిల్ ఫిష్) చెరువుల్లో దొరుకుతోంది. ఇతర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి చేపలు వలస వచ్చే అవకాశం లేదు కాబట్టి విత్తన చేపల్లో ఈ చేప పిల్లలు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. ఇప్పుడు అవి పెరిగి తన సంతతిని పెంచుకుంటున్నాయని మత్య్సకారులు చెబుతున్నారు. ప్రస్తుతం కేజీ నుంచి రెండు కేజీల బరువున్న దెయ్యపు చేపలు చెరువుల్లో దొరుకుతున్నాయి. వీటిని అరికట్టక పోతే మిగతా చేపల మనుగడ అంత సులువు కాదు.

మిగతా చేపల్ని తినే ఈ దెయ్యపు చేప.. చేపల సాగులో రైతులకు నష్టాన్ని కలిగిస్తోంది. దెయ్యం చేప మిగతా చెరువులకు వ్యాపించినట్లైతే మత్య్సకారులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. అంతేగాక ఈ జాతి చేపల కారణంగా తెలంగాణలోని మత్స్యసంపద తగ్గిపోయి మత్స్యకారుల జీవనోపాధి తగ్గిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. తాము వేసిన విత్తన చేపల్లో ఇరవై శాతం చేపలు కూడా తమకు దక్కడం లేదని, దిగుబడి భారీగా తగ్గిపోయిందని మత్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే మత్య్సకారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. క్యాట్ ఫిష్ జాతికి చెందిన చేప అని మిగతా చేపలను తిని బతికే అలవాటు దీనికి ఉంటుందని అంటున్నారు మత్య్స శాఖ అధికారులు. ఈ చేప దొరికినట్లైతే భూమిలో పాతి పెట్టాలని సూచిస్తున్నారు అధికారులు. మత్య్సశాఖ అధికారులు స్పందించి దెయ్యం చేప నివారణకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. మత్య్సకారులను నష్టం నుంచి కాపాడాల్సిన బాధ్యత అధికారుల పై ఉంది.

Also read:

New Zealand: విచిత్రమైన టాటూతో వార్తలు చదివిన న్యూస్ ప్రజెంటర్.. స్టైల్ కోసం కాదట..

Petrol Price: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. పెట్రోల్‌పై రూ.25 తగ్గించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం..

Delhi Airport: వామ్మో ఇదే ప్లాన్ రా అయ్యా.. ఆమె నోరు విప్పకపోతే ప్రాణాలే పోయేవి..!