కాంగ్రెస్తోనే దేశ అభివృద్ధి- అద్దంకి దయాకర్
సిద్ధిపేట జిల్లా: గడిచిన శాసనసభ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో గెలుపొంది రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. గురువారం సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సిద్ధిపేట వచ్చానన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పేద కుటుంబాలకు […]
సిద్ధిపేట జిల్లా: గడిచిన శాసనసభ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో గెలుపొంది రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. గురువారం సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సిద్ధిపేట వచ్చానన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పేద కుటుంబాలకు నెలకు రూ.6 వేల చొప్పున ఏడాదికి రూ.72 వేలు ఇస్తామని చెప్పారు. ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందని వెల్లడించారు. 16 ఎంపీలతో కేంద్రంలో చక్రం తిప్పుతా అంటున్న కేసీఆర్ ఎందుకు ఎంపీగా పోటీ చేయలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు బతకాలని ప్రజలు కోరుకుంటుంటే టీఆర్ఎస్ మాత్రం ప్రతిపక్షాలను చంపాలని చూస్తోందని అన్నారు.