Sub Registrar Taslima: అరెస్టైన నెలరోజులకు తస్లీమా ఇళ్లలో సోదాలు.. ఎన్ని కోట్ల ఆస్తులు గుర్తించారో తెలుసా?

మార్చి నెలలో ఓ ప్లాట్​ రిజిస్ట్రేషన్​ విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహబూబాబాద్​ సబ్​ రిజిస్ట్రార్​ తస్లీమా మహమ్మద్​ పై ఆదాయానికి మించి ఆస్తులు కేసు నమోదైంది. తస్లీమా ఇంటితో పాటు ఆమె బందువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఏకకాలంలో ఆరు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి భారీ ఎత్తున ఆస్తులు గుర్తించారు.

Sub Registrar Taslima: అరెస్టైన నెలరోజులకు తస్లీమా ఇళ్లలో సోదాలు.. ఎన్ని కోట్ల ఆస్తులు గుర్తించారో తెలుసా?
Sub Registrar Taslima
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 23, 2024 | 7:11 AM

మార్చి నెలలో ఓ ప్లాట్​ రిజిస్ట్రేషన్​ విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహబూబాబాద్​ సబ్​ రిజిస్ట్రార్​ తస్లీమా మహమ్మద్​ పై ఆదాయానికి మించి ఆస్తులు కేసు నమోదైంది. తస్లీమా ఇంటితో పాటు ఆమె బందువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఏకకాలంలో ఆరు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి భారీ ఎత్తున ఆస్తులు గుర్తించారు.

మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న తస్లీమా మార్చి 22న ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో అమెను అరెస్ట్ చేసి జైలు పంపింది అవినీతి నిరోధక శాఖ. అయితే, సరిగ్గా నెల రోజుల తరవాత ఆమె ఆస్తులపై విచారణ చేపట్టారు నిర్వహించారు. తస్లీమా ఇంటితోపాటు ఆమె బంధువుల ఇళ్ళల్లోనూ సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. తనిఖీలు చేస్తున్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు డీఎస్పీ పి.సాంబయ్య నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. హనుమకొండ కాకతీయ కాలనీలోని తస్లీమాతో ఇంటితో పాటు ఆమె సోదరుల పేరుతో ఉన్న ఐదు ఇళ్ళు, సూర్యాపేటలోని ఆమె భర్త, భూపాలపల్లిలోని ఓ డాక్యుమెంట్​ రైటర్ ఇంట్లో ఏకకాలంలో సోదాలు చేశారు. మొత్తం ఆరు చోట్ల తనిఖీలు చేపట్టారు అధికారులు. సబ్​ రిజిస్ట్రార్​ గా పని చేస్తున్న తస్లీమా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు నిర్ధారించారు.

తన కుటుంబ సభ్యుల పేరున ఇండ్లు, ల్యాండ్స్ కూడబెట్టినట్లు గుర్తించారు. తస్లీమా, ఆమె కుటుంబ సభ్యుల పేరున రూ.2 కోట్ల ఏడు లక్షల విలువైన ఐదు ఇండ్లు, రూ.12 లక్షల విలువైన ఆరు ఇండ్ల స్థలాలు, ములుగులో రూ.20.40 లక్షల విలువైన మూడెకరాల వ్యవసాయ భూమి, రూ.1.92 లక్షల నగదు, రూ.98,787 బ్యాంక్​ బ్యాలెన్స్​, ఒక కియా కారు, రెండు బుల్లెట్​ బైకులు ఉన్నట్లు తేల్చారు.

ఈ మేరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం వాటన్నింటి విలువ రూ.2.95 కోట్లు వరకు ఉంటుందని నిర్ధారించారు. ప్రస్తుతం తస్లీమా ఏసీబీ ట్రాప్​ కేసులో కరీంనగర్​ జైలులో ఉండగా, ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన కేసులో విచారణ జరుపుతున్నామని, కోర్టు ఆదేశాల మేరకు ఆ తరువాతి చర్యలు తీసుకుంటామని వరంగల్ ఏసీబీ డీఎస్పీ పి.సాంబయ్య వివరించారు.

సరిగ్గా నెల రోజుల తరువాత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు జరగడం స్థానికంగా కలకలం రేపింది. సామాజిక కార్యకర్తగా, సబ్ రిజిస్ట్రార్ గా ప్రత్యేక ముద్ర వేసుకున్న తస్లీమాపై అవినీతి ఆరోపణలు ఆసక్తికర చర్చగా మారాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?