AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆదిలాబాద్‌ జిల్లాలో మరోమారు రోడ్డెక్కిన విద్యార్థులు..ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా 35మందికి అస్వస్థత..

వివరాలు తెలుసుకున్న అదనపు కలెక్టర్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే వెనుదిరిగారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు అదనపు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు.

Telangana: ఆదిలాబాద్‌ జిల్లాలో మరోమారు రోడ్డెక్కిన విద్యార్థులు..ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా 35మందికి అస్వస్థత..
Food Poisoning
Jyothi Gadda
|

Updated on: Sep 20, 2022 | 4:01 PM

Share

Telangana: కొమురంభీం ఆసిపాబాద్ జిల్లా ఆశ్రమ గురుకుల పాఠశాలల్లో వరుసగా పుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. మెరుగైన వసతులు, నాణ్యమైన భోజనం అందక పదుల సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. విష జ్వరాలతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులు చనిపోగా.. తాజాగా కాగజ్ నగర్ మండలం బలిగల మైనార్టీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. పురుగుల భోజనం తిన్న 50 మందిలో 35 మంది విద్యార్థులు అస్వస్థకు గురికాగా మిగిలిన విద్యార్థులు భోజనం మానేసి ఆందోళనకు దిగారు. ఉదయం అల్పాహరం సైతం మానేశారు.. అయినా అధికారులు స్పందించకపోవడంతో పరీక్షలు సైతం బైకాట్ చేసి ఇంటి బాట పట్టారు.

విద్యార్థులు. ఇంత జరిగినా అధికారులు, సిబ్బంది స్పందించకపోవడంతో మైనారిటి గురుకుల ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనారిటీ గురుకుల ఘటనపై కొమురంభీం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ చాహత్ వాజ్ పాయి విచారణ చేపట్టారు. మైనారిటీ గురుకులానికి చేరుకున్న అదనపు కలెక్టర్ మెస్ హాల్ , బోజనం వసతి , భోజనం నాణ్యతపై విద్యార్థులను అడిగి వివరాలు తీసుకున్నారు. వారం రోజులుగా పురుగుల అన్నం పెడుతున్నారని.. వార్డన్ , ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోయారు.

వివరాలు తెలుసుకున్న అదనపు కలెక్టర్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే వెనుదిరిగారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు అదనపు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు. పుడ్ పాయిజన్ ఘటనపై మైనారిటి గురుకుల ప్రిన్సిపల్ వెంకట్ ప్రసాద్, వార్డెన్ ను సస్పెండ్ చేయాలని‌ ఆందోళనకు దిగారు. పూర్థి‌స్థాయి విచారణ చేపట్టి బాద్యులైన వారిపై చర్యలు తీసుకుంటానని హామి ఇవ్వడంతో తల్లిదండ్రులు వెనక్కి తగ్గారు. బాద్యుల పై చర్యలు చేపట్టాకే తమ పిల్లలను హాస్టల్ కు పంపిస్తామని.. అప్పటి వరకు విద్యార్థులను‌ గురుకులానికి పంపించేది లేదని తేల్చి చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి