AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar-pradesh: బ్యాంక్‌ అధికారుల నిర్లక్ష్యం.. రూ.42 లక్షలు నీళ్లపాలు.. అసలేం జరిగిందంటే..

బ్యాంక్‌ అధికారుల నిర్లక్ష్యం..పెద్ద విపత్తుకు దారితీసింది. అయితే బ్యాంక్ అధికారులు తెలివిగా విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు.

Uttar-pradesh: బ్యాంక్‌ అధికారుల నిర్లక్ష్యం.. రూ.42 లక్షలు నీళ్లపాలు.. అసలేం జరిగిందంటే..
Currency Notes
Jyothi Gadda
|

Updated on: Sep 19, 2022 | 9:50 PM

Share

Uttar-pradesh: దాచిన సొమ్ము దెయ్యాల పాలు అనేడి నానుడి… కానీ, ఇక్కడ అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. బ్యాంక్‌ అధికారుల నిర్లక్ష్యం..పెద్ద విపత్తుకు దారితీసింది. ఒకటి కాదు రెండు కాదు.. అధికారుల నిర్లక్ష్యం ఏకంగా రూ. 42లక్షలు నగదు నీటి పాలైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి)లో చోటు చేసుకుంది. పాండు నగర్ బ్రాంచ్‌లో కరెన్సీ చెస్ట్‌లో నీరు చేరడంతో రూ. 42 లక్షల కరెన్సీ నోట్లు తడిసిపోయాయి. అయితే బ్యాంక్ అధికారులు తెలివిగా విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు. జూలై నెలాఖరులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బృందం బ్యాంక్ కరెన్సీ చెస్ట్‌ను ఆడిట్ చేసినప్పుడు బ్యాంకు అధికారుల పనితీరు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సీనియర్ మేనేజర్ కరెన్సీ చెస్ట్ దేవి శంకర్ సహా నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లోని పాండునగర్ బ్రాంచ్‌లోనే ప్రధాన కరెన్సీ చెస్ట్ ఉంది. ప్రధాన కరెన్సీ బాక్స్ రెండు రెట్లు ఎక్కువ సామర్థ్యంతో నిండి ఉంటుంది. నగదు నిల్వకు సంబంధించి నిర్దేశించిన నిబంధనలు పాటించకపోవడమే ఇందుకు కారణంగా తెలిసింది. జూలై 25 నుండి జూలై 29 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు ప్రధాన కరెన్సీ ఆడిట్ నిర్వహించారు. ఆడిట్‌లో ఆర్‌బీఐ అధికారులు నీళ్లలో తడిచి ముద్దైపోయిన నోట్లను గుర్తించారు. విచారణలో నేలపై ఉంచిన పెట్టెలోకి నీరు చేరిందని, తేమ కారణంగా దిగువన ఉంచిన నోట్లు కుళ్లిపోయాయని తేలింది.

బహుశా రూ.2 లక్షల నోట్లు కుళ్లిపోయి ఉంటాయని తొలుత ఆర్బీఐ అధికారులు భావించగా.. వారంరోజుల పాటు ఆ నోట్లను లెక్కించే సరికి ఆ సంఖ్య రూ.42 లక్షలకు చేరింది. ఇది చూసి ఆర్బీఐ అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు నలుగురు అధికారులను సస్పెండ్ చేసినట్లు కరెన్సీ చెస్ట్ విభాగం అధిపతి నిధి పాఠక్ తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత తుది చర్యలు తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి

సస్పెండ్ అయిన వారిలో కరెన్సీ చెస్ట్ సీనియర్ మేనేజర్ దేవి శంకర్, మేనేజర్ ఆశారాం, చెస్ట్ ఆఫీసర్ రాకేష్ కుమార్, సీనియర్ మేనేజర్ భాస్కర్ కుమార్ భార్గవ ఉన్నారు. వీరిలో ముగ్గురు అధికారులను నోట్లు తడిసిన తర్వాత ప్రధాన కరెన్సీ చెస్ట్‌లో ఉంచినట్లు సమాచారం. ఆర్‌బీఐ వర్గాల ప్రకారం, కరెన్సీ చెస్ట్‌లను ఎప్పటికప్పుడు ఆర్‌బీఐ ఆడిట్ చేస్తుంది. ఇందుకోసం కొన్ని నిబంధనలను రూపొందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు