AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సత్తాచాటిన తెలంగాణ గురుకుల విద్యార్థులు.. ఈసారి ఎంతమందికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయంటే ?

తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యార్థుల కోసం చేపట్టినటువంటి ఆపరేషన్‌ బ్లూ క్రిస్టల్‌ అనే ప్రాజెక్టు సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. నీట్‌ మొదటి విడత కౌన్సిలింగ్‌లోనే సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల విద్యార్థులు తమ సత్తా చాటిచెప్పారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో దాదాపు 180 మంది విద్యార్థులు ఎంబీబీఎస్‌ సీట్లు దక్కించుకున్నారు. సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులాల నుంచి 135 మంది, గిరిజన గురుకులాల నుంచి 45 మంది సీట్లు సాధించారు.

Telangana: సత్తాచాటిన తెలంగాణ గురుకుల విద్యార్థులు.. ఈసారి ఎంతమందికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయంటే ?
Medical Students
Aravind B
|

Updated on: Aug 24, 2023 | 11:32 AM

Share

తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యార్థుల కోసం చేపట్టినటువంటి ఆపరేషన్‌ బ్లూ క్రిస్టల్‌ అనే ప్రాజెక్టు సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. నీట్‌ మొదటి విడత కౌన్సిలింగ్‌లోనే సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల విద్యార్థులు తమ సత్తా చాటిచెప్పారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో దాదాపు 180 మంది విద్యార్థులు ఎంబీబీఎస్‌ సీట్లు దక్కించుకున్నారు. సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులాల నుంచి 135 మంది, గిరిజన గురుకులాల నుంచి 45 మంది సీట్లు సాధించారు. అయితే వీరిలో రెగ్యులర్‌ ఇంటర్‌ విద్యార్థులు 30 మంది, లాంగ్‌టర్మ్‌ నుంచి 105 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలకు చెందిన ఐదుగురు విద్యార్థులు సైతం ఎంబీబీఎస్‌ సీట్లు సాధించారు. అయితే గత సంవత్సరం గిరిజన గురుకులాల నుంచి 41 మంది విద్యార్థులు మెడిసన్‌లో సీట్లు దక్కించుకున్నారు. ఈసారి 45 మంది సీట్లు సాధించారు.

వీళ్లలో 18 బాలికలు ఉన్నారు. రెగ్యులర్ ఇంటర్ నుంచి 8 మంది కాగా.. లాంగ్‌టర్మ్ నుంచి 37 మంది ఎంపికయ్యారు. అయితే మొట్టమొదటిసారిగా పర్టిక్యులర్‌ వల్నరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్స్‌ (పీవీటీజీ)కు చెందిన విద్యార్థిని కూడా ఎంబీబీఎస్ సీటు పొందింది. పీవీటీజీకి చెందిన సంగర్సు స్రవంతి అనే విద్యార్థిని కరీంనగర్‌లోని ప్రతిమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో సీటు సాధించింది.

ఆపరేషన్‌ బ్లూ క్రిస్టల్‌ సక్సెస్‌ తెలంగాణ ప్రభుత్వం నిరుపేద విద్యార్థుల కోసం ఫ్రీగా నీట్‌ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ అందించేందుకు ఎస్సీ గురుకులాల్లో ఆపరేషన్‌ బ్లూ క్రిస్టల్‌ (ఓపీబీసీ), గిరిజన గురుకులాల్లో ఆపరేషన్‌ ఎమరాల్డ్‌ (ఓపీఎం) లను ప్రారంభించింది. ఈ సంవత్సరం ఓపీబీసీ కింద 223 మందికి శిక్షణ ఇచ్చారు. అయితే అందులో 153 మంది ర్యాంకులు సాధించారు. రెగ్యులర్‌ గురుకులాల నుంచి మరో 50 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తానికి సాంఘిక సంక్షేమ గురుకులాల నుంచే ఈ ఏడాది 203 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఓపీఎం కింద ఈ ఏడాది 93 మంది గిరిజన విద్యార్థులకు నీట్‌ లాంగ్‌టర్మ్‌ శిక్షణ ఇచ్చారు. అయితే వీరిలో 64 మంది ర్యాంకులు దక్కించుకున్నారు. మరో 8 మంది రెగ్యులర్‌ గురుకులాలకు చెందినవారు కలుపుకొని మొత్తంగా గిరిజన గురుకులాల నుంచి 72 మంది ఎంబీబీఎస్‌కు అర్హత సాధించారు. ఓపీబీసీ, ఓపీఎం నుంచి 185 మంది తొలి విడత కౌన్సిలింగ్‌లో సీట్లు పొందారు.

ఇవి కూడా చదవండి

విద్యార్థులకు మంత్రుల అభినందనలు గురుకుల విద్యార్థులు గతంలో కంటే ఎక్కువగా మెడికల్‌ సీట్లను సాధించడంపై మంత్రులు సత్యవతి రాథోడ్‌, కొప్పుల ఈశ్వర్‌, గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ సెక్రటరీ షఫీవుల్లా ఆనందం వ్యక్తం చేశారు. సీట్లు దక్కించున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆ హీరో నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నాడు..
ఆ హీరో నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నాడు..
ఈ సమ్మర్‌లో ట్రెండీ స్మూతీ: సులభంగా తయారు చేసి రోజంతా హైడ్రేట్‌గా
ఈ సమ్మర్‌లో ట్రెండీ స్మూతీ: సులభంగా తయారు చేసి రోజంతా హైడ్రేట్‌గా
సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ.4 లక్షల పరిహారం
సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ.4 లక్షల పరిహారం
ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. మంగళూరు స్పెషల్ చికెన్ సుక్కా రెసిపీ
ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. మంగళూరు స్పెషల్ చికెన్ సుక్కా రెసిపీ
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్
తులసి, మనీ ప్లాంట్ ఒకే చోట పెంచవచ్చా?పండితులు ఏం చెబుతున్నారంటే?
తులసి, మనీ ప్లాంట్ ఒకే చోట పెంచవచ్చా?పండితులు ఏం చెబుతున్నారంటే?
రోడ్ల మీద పర్సులు, నైటీలు అమ్మాను.. కట్ చేస్తే
రోడ్ల మీద పర్సులు, నైటీలు అమ్మాను.. కట్ చేస్తే
మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..
మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!