AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సత్తాచాటిన తెలంగాణ గురుకుల విద్యార్థులు.. ఈసారి ఎంతమందికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయంటే ?

తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యార్థుల కోసం చేపట్టినటువంటి ఆపరేషన్‌ బ్లూ క్రిస్టల్‌ అనే ప్రాజెక్టు సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. నీట్‌ మొదటి విడత కౌన్సిలింగ్‌లోనే సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల విద్యార్థులు తమ సత్తా చాటిచెప్పారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో దాదాపు 180 మంది విద్యార్థులు ఎంబీబీఎస్‌ సీట్లు దక్కించుకున్నారు. సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులాల నుంచి 135 మంది, గిరిజన గురుకులాల నుంచి 45 మంది సీట్లు సాధించారు.

Telangana: సత్తాచాటిన తెలంగాణ గురుకుల విద్యార్థులు.. ఈసారి ఎంతమందికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయంటే ?
Medical Students
Aravind B
|

Updated on: Aug 24, 2023 | 11:32 AM

Share

తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యార్థుల కోసం చేపట్టినటువంటి ఆపరేషన్‌ బ్లూ క్రిస్టల్‌ అనే ప్రాజెక్టు సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. నీట్‌ మొదటి విడత కౌన్సిలింగ్‌లోనే సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల విద్యార్థులు తమ సత్తా చాటిచెప్పారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో దాదాపు 180 మంది విద్యార్థులు ఎంబీబీఎస్‌ సీట్లు దక్కించుకున్నారు. సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులాల నుంచి 135 మంది, గిరిజన గురుకులాల నుంచి 45 మంది సీట్లు సాధించారు. అయితే వీరిలో రెగ్యులర్‌ ఇంటర్‌ విద్యార్థులు 30 మంది, లాంగ్‌టర్మ్‌ నుంచి 105 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలకు చెందిన ఐదుగురు విద్యార్థులు సైతం ఎంబీబీఎస్‌ సీట్లు సాధించారు. అయితే గత సంవత్సరం గిరిజన గురుకులాల నుంచి 41 మంది విద్యార్థులు మెడిసన్‌లో సీట్లు దక్కించుకున్నారు. ఈసారి 45 మంది సీట్లు సాధించారు.

వీళ్లలో 18 బాలికలు ఉన్నారు. రెగ్యులర్ ఇంటర్ నుంచి 8 మంది కాగా.. లాంగ్‌టర్మ్ నుంచి 37 మంది ఎంపికయ్యారు. అయితే మొట్టమొదటిసారిగా పర్టిక్యులర్‌ వల్నరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్స్‌ (పీవీటీజీ)కు చెందిన విద్యార్థిని కూడా ఎంబీబీఎస్ సీటు పొందింది. పీవీటీజీకి చెందిన సంగర్సు స్రవంతి అనే విద్యార్థిని కరీంనగర్‌లోని ప్రతిమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో సీటు సాధించింది.

ఆపరేషన్‌ బ్లూ క్రిస్టల్‌ సక్సెస్‌ తెలంగాణ ప్రభుత్వం నిరుపేద విద్యార్థుల కోసం ఫ్రీగా నీట్‌ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ అందించేందుకు ఎస్సీ గురుకులాల్లో ఆపరేషన్‌ బ్లూ క్రిస్టల్‌ (ఓపీబీసీ), గిరిజన గురుకులాల్లో ఆపరేషన్‌ ఎమరాల్డ్‌ (ఓపీఎం) లను ప్రారంభించింది. ఈ సంవత్సరం ఓపీబీసీ కింద 223 మందికి శిక్షణ ఇచ్చారు. అయితే అందులో 153 మంది ర్యాంకులు సాధించారు. రెగ్యులర్‌ గురుకులాల నుంచి మరో 50 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తానికి సాంఘిక సంక్షేమ గురుకులాల నుంచే ఈ ఏడాది 203 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఓపీఎం కింద ఈ ఏడాది 93 మంది గిరిజన విద్యార్థులకు నీట్‌ లాంగ్‌టర్మ్‌ శిక్షణ ఇచ్చారు. అయితే వీరిలో 64 మంది ర్యాంకులు దక్కించుకున్నారు. మరో 8 మంది రెగ్యులర్‌ గురుకులాలకు చెందినవారు కలుపుకొని మొత్తంగా గిరిజన గురుకులాల నుంచి 72 మంది ఎంబీబీఎస్‌కు అర్హత సాధించారు. ఓపీబీసీ, ఓపీఎం నుంచి 185 మంది తొలి విడత కౌన్సిలింగ్‌లో సీట్లు పొందారు.

ఇవి కూడా చదవండి

విద్యార్థులకు మంత్రుల అభినందనలు గురుకుల విద్యార్థులు గతంలో కంటే ఎక్కువగా మెడికల్‌ సీట్లను సాధించడంపై మంత్రులు సత్యవతి రాథోడ్‌, కొప్పుల ఈశ్వర్‌, గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ సెక్రటరీ షఫీవుల్లా ఆనందం వ్యక్తం చేశారు. సీట్లు దక్కించున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు