Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో రెండు కొత్త ఫీచర్లు..
Whatsapp: ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్ (Apps)లో వాట్సాప్ ఒకటి. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ, యూజర్లను చేజారి పోకుండా చూసుకుంటారు కాబట్టే ఈ యాప్కు ఇంతటీ క్రేజ్ దక్కింది. ఈ క్రమంలోనే ఇతర మెసేజింగ్ యాప్ల..
Whatsapp: ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్ (Apps)లో వాట్సాప్ ఒకటి. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ, యూజర్లను చేజారి పోకుండా చూసుకుంటారు కాబట్టే ఈ యాప్కు ఇంతటీ క్రేజ్ దక్కింది. ఈ క్రమంలోనే ఇతర మెసేజింగ్ యాప్ల నుంచి వచ్చే పోటీని తట్టుకునేందుకు గాను ఇటీవల కొన్ని కొత్త ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్ను పరిచయం చేసింది. ఎమోజీ రియాక్షన్ ఫీచర్ను వాట్సాప్ తీసుకొచ్చింది. ఈ విషయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ అధికారికంగా ప్రకటించారు.
ఇప్పటి వరకు ఇలాంటి ఫీచర్ ఇన్స్టాగ్రామ్లో అందుబాటులో ఉంది. ఈ కొత్త ఫీచర్తో యూజర్లు వాట్సాప్ స్టేటస్ అప్డేట్కు ఎమోజీలతో తమ రియాక్షన్ తెలపొచ్చు. ఇందుకోసం ఇతరుల స్టేటస్ అప్డేట్పై క్లిక్ చేస్తే వెంటనే స్క్రీన్పై ఎమోజీ రియాక్షన్స్ కనిపిస్తాయి. అందులో నచ్చిన ఎమోజీపై క్లిక్ చేసిన వెంటనే అవతలి వ్యక్తికి మీ రియాక్షన్ వెళ్లిపోతుంది. ఇదిలా ఉంటే ఈ ఫీచర్ను ప్రస్తుతం కొద్ది మంది యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తేనున్నారు.
ఇదిలా ఉంటే వాట్సాప్ దీంతో పాటు మరో కొత్త ఫీచర్ను కూడా తీసుకురానుంది. వాట్సాప్ గ్రూప్ సభ్యులు షేర్ చేసే మెసేజ్లను డిలెట్ చేసే అవకాశాన్ని గ్రూప్ అడ్మిన్కు కల్పించనున్నారు. దీంతో ఫేక్ న్యూస్కు చెక్ పెట్టే అవకాశం లభించనుంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్లో ఉన్న ఈ ఫీచర్ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..