AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ న్యూస్.. IPL 2025 రద్దు అయ్యే అవకాశం..! ఇవిగో లేటెస్ట్ అప్ డేట్స్

భారత్-పాక్ మధ్య హై టెన్షన్ నేపథ్యంలో బీసీసీఐ అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టోర్నీ రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశీ ఆటగాళ్లను సురక్షితంగా పంపేందుకు చర్యలు ప్రారంభించే సూచనలు ఉన్నాయి. ఫుల్ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

బిగ్ న్యూస్.. IPL 2025 రద్దు అయ్యే అవకాశం..! ఇవిగో లేటెస్ట్ అప్ డేట్స్
Ipl 2025
Follow us
Ram Naramaneni

|

Updated on: May 09, 2025 | 12:00 AM

భారతదేశం, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా IPL 2025  రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత పహల్గామ్‌లో ఉగ్రవాదులు దుశ్చర్యకు కౌంటర్‌గా పీఓకే, పాక్‌లో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది భారత్. దీంతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.  ప్రస్తుతం ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతి దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్‌పై నీలి నీడలు నెలకున్నాయి. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో జమ్మూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో.. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల స్టేడియంలో పంజాబ్‌ కింగ్స్ , దిల్లీ క్యాపిటల్స్  మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ అర్ధంతరంగా రద్దు చేశారు.   భద్రతాపరంగా సమస్యలు తలెత్తకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆటగాళ్లు,  సపోర్టింగ్ స్టాఫ్‌, ప్రేక్షకుల భద్రతతే తమకు మొదటి ప్రాధాన్యత అని.. అందుకే మ్యాచ్ రద్దు చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.   ఈ అత్యవసర పరిస్థితి కారణంగా టోర్నమెంట్ భవిష్యత్తును నిర్ణయించడానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ భేటీ కొనసాగుతోంది.  ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ 2025ని అర్ధంతరంగా నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది.

ప్రస్తుత పరిస్థితిపై పూర్తి అవగాహన వచ్చే వరకు మిగిలిన మ్యాచులపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.  యుద్ధం కారణం కాకుండా ఉంటే ఈ మ్యాచ్‌లను మరో దేశం వేదికగా నిర్వహించి ఉండేవాళ్లు.. కానీ, భారత్ – పాక్ మధ్య భారీ ఉద్రిక్తతలు నెలకొనడంతో ఐపీఎల్‌ను రద్దు చేసేలాగే కనిపిస్తున్నారు. పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. విదేశీ ఆటగాళ్లు కూడా భద్రతపై అనుమానం వ్యక్తం చేసే అవకాశం ఉంది. యుద్ధ పరిస్థితులు లేకపోతే టోర్నీని మరో చోటికి షిఫ్ట్ చేసేవారు. కానీ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. మే9 న టోర్నీ రద్దు గురించి దాదాపు ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.