న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్.. ప్రారంభించిన టీవీ9 ఎండీ బరుణ్ దాస్
న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్-2025ని ప్రారంభించారు టీవీ9 ఎండీ బరుణ్ దాస్. ఈ కార్యక్రమానికి టీవీ9 COO విక్రమ్, టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ హాజరయ్యారు. నేటి నుంచి మూడు రోజుల పాటు బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జరగనుంది. ఆ వివరాలు

న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్-2025ని ప్రారంభించారు టీవీ9 ఎండీ బరుణ్ దాస్. ఈ కార్యక్రమానికి టీవీ9 COO విక్రమ్, టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ హాజరయ్యారు. నేటి నుంచి మూడు రోజుల పాటు బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జరగనుంది. ఈ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో 64 టీమ్స్ పాల్గొంటున్నాయి.
ప్రస్తుతం దేశంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ.. ప్రధాని మోదీ నాయకత్వంలో మనం విజయం సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు టీవీ9 ఎండీ బరుణ్ దాస్. అలాగే ఈ కష్ట సమయంలో భద్రతా బలగాలకు మనం అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు పుల్లెల గోపిచంద్. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.
మే 9 నుంచి 11 వరకు పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో 3 రోజుల పాటు ఈ న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 జరగనుంది. ఈ పోటీలో విజేతగా నిలిచిన టీంపై కాసుల వర్షం కురవనుంది. మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 1.50 లక్షలు, రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 1 లక్ష, మూడవ స్థానంలో నిలిచిన జట్టుకు 50,000 రూపాయలు బహుమతిగా ఇవ్వనున్నారు.